Just In
- 51 min ago 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- 2 hrs ago మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- 3 hrs ago కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- 5 hrs ago వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్పై కూర్చుకున్న వ్యక్తి (వీడియో)
Don't Miss
- News సూర్య గోచారంతో మే 13వరకు ఈ రాశులకు సంపద వర్షం
- Sports DC vs GT: అందుకే డేవిడ్ వార్నర్ను పక్కన పెట్టాం: రిషభ్ పంత్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Movies నీకెంత బలుపు? ఆర్కే నాయుడుపై సీనియర్ నటి సీరియస్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
కేవలం 1 నిముషంలో 25,000 బుకింగ్స్.. స్కార్పియో-ఎన్ బుకింగ్స్ లో రికార్డ్ బద్దలు కొట్టిన మహీంద్రా
దేశీయ వాహన తయారీ దిగ్గజం 'మహీంద్రా అండ్ మహీంద్రా' ఎట్టకేలకు తన కొత్త SUV 'స్కార్పియో-ఎన్' (Scorpio-N) కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. అయితే కంపెనీ బుకింగ్స్ ప్రారంభించిన కేవలం 1 నిముషంలోనే 25,000 బుకింగ్స్ వచ్చేసాయి. ఇది నిజంగా ఊహాతీతం అనే చెప్పాలి. ఇప్పటి వరకు కూడా ఇంత తక్కువ సమయంలో అత్యధిక బుకింగ్స్ పొందిన కంపెనీ బహుశా 'మహీంద్రా' అయి ఉంటుంది. కంపెనీ బుకింగ్స్ మరియు డెలివరీలను గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.
కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, కొత్త మహీంద్రా స్కార్పియో-ఎన్ కోసం కేవలం 30 నిముషాల్లోనే ఏకంగా 1 లక్ష బుకింగ్స్ వచ్చాయి. బుకింగ్స్ లో మహీంద్రా ఇప్పుడు అరుదైన రికార్డ్ బద్దలు కొట్టింది.
'మహీంద్రా స్కార్పియో-ఎన్' బుక్ చేసుకోవాలనుకునే కస్టమర్లు కంపెనీ యొక్క వెబ్సైట్ లో లేదా, కంపెనీ యొక్క డీలర్షిప్లో ముందస్తుగా రూ. 21,000 చెల్లించి బుక్ చేసుకోవాలి. డెలివరీలు 2022 సెప్టెంబర్ 26 నుంచి ప్రారంభమవుతాయి.
మహీంద్రా కంపెనీ ఇప్పటికే తెలిపిన సమాచారం ప్రకారం, లాంచ్ సమయంలో వెల్లడించిన ధరలు కేవలం మొదటి 25,000 బుకింగ్స్ చేసుకున్న వారికి మాత్రమే వర్తిస్తుంది. ఆ తరువాత బుక్ చేస్కున్నవారికి కొత్త ధరలు వర్తిస్తాయి. అయితే ఆ కొత్త ధరలు కంపెనీ త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంటుంది.
మహీంద్రా కంపెనీ తన మొదటి 25,000 కస్టమర్లకు ఈ సంవత్సరం ముగిసేలోపు డెలివరీ చేయనుంది. ఈ కారణంగా ఎక్కువమంది పోటీపోటీగా బుక్ చేసుకోవడం జరిగింది. ఈ విధంగా బుక్ చేసుకునే సమయంలో కొన్ని ఆటంకాలు ఎదురైనట్లు కూడా కస్టమర్లు తెలిపారు.
మహీంద్రా కంపెనీ ప్రారంభంలో తన టాప్ ఎండ్ వేరియంట్ అయిన Z8 L ఉత్పత్తికి ప్రాధాన్యత ఇవ్వనుంది. అయితే నెలకు ఎన్ని యూనిట్లను ఉత్పత్తి చేస్తుంది అనే సమాచారం మాత్రం వెల్లడించలేదు. అయితే బుక్ చేసుకున్న కస్టమర్లకు త్వరగా డెలివరీ చేయడానికి కావాల్సిన ప్రయత్నాలు సిద్ధం చేస్తోంది.
కంపెనీ అందించిన సమాచారం ప్రకారం.. ప్రస్తుతం బుకింగ్స్ వాళ్ళ వచ్చిన మొత్తం దాదాపు 18,000 కోట్లు అని తెలిసింది. కంపెనీ నుంచి మంచి బుకింగ్స్ పొందిన వాహనాల జాబితాలో మహీంద్రా స్కార్పియో-ఎన్ ఇప్పుడు మూడవ మోడల్ అవుతోంది. ఇంతకు ముందు మహీంద్రా XUV700 బుకింగ్స్ లో గొప్ప రికార్డ్ పొందిన SUV గా ఉంది. అయితే ఇప్పుడు మహీంద్రా స్కార్పియో-ఎన్ ఆ రికార్డ్ క్రాష్ చేసింది.
ఇప్పుడు కొత్త స్కార్పియో-ఎన్ బుక్ చేసుకున్న తరువాత ఏదైనా మార్పులు (కలర్ ఆప్సన్,వేరియంట్) చేయాలనుకుంటే 2022 ఆగష్టు 15 వరకు చేసుకోవచ్చు. ఆ తరువాత ఈ సదుపాయం అందుబాటులో ఉండకపోవచ్చు. మహీంద్రా స్కార్పియో-ఎన్ బుక్ చేసుకున్న కస్టమర్లలు డెలివరీలు సెప్టెంబర్ 26 నుంచి ప్రారంభమవుతాయి. అయితే అంతకంటే ముందు జులై 05 నుంచి టెస్ట్ డ్రైవ్స్ ప్రారంభమవుతాయి. జులై 05 నుంచి దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 30 నగరాల్లో ప్రారంభమవుతాయి. ఆ తరువాత దేశం మొత్తం మీద టెస్ట్ డ్రైవ్స్ ప్రారంభమవుతాయి.
కంపెనీ యొక్క స్కార్పియో-ఎన్ ప్రారంభ ధర రూ.11.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా, టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.19.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. స్కార్పియో-ఎన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఫైనాన్స్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. దీని కింద వినియోగదారులకు 6.99% వడ్డీ రేటు లోన్ తో కొనుగోలు చేయవచ్చు. ఈ లోన్ వ్యవధి గరిష్టంగా 10 సంవత్సరాల వరకు ఉంటుంది.
డ్రైవ్స్పార్క్ అభిప్రాయం:
మహీంద్రా కంపెనీ భారతదేశంలో ఒక కొత్త రికార్డ్ సృష్టిస్తోంది. ఇటీవల కాలంలో తన వాహనాలకు విపరీతమైన బుకింగ్స్ పొందుతూ అత్యధిక బుకింగ్స్ పొందుతున్న కంపెనీగా అవతరించింది. మొత్తం మీద కంపెనీ ఇటీవల లాంచ్ చేసిన ఈ కొత్త స్కార్పియో-ఎన్ గొప్ప బుకింగ్స్ పొందింది. త్వరలోనే డెలివరీలు ప్రారంభం కానున్నాయి. అయితే 25,000 యూనిట్ల తరువాత బుక్ చేసుకున్నవారు ఎంత మొత్తంలో ఎక్కువ చెల్లించాల్సి ఉంటుందనే విషయం త్వరలోనే తెలుస్తుంది.