Just In
- 1 hr ago కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- 15 hrs ago 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- 17 hrs ago మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- 18 hrs ago కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
Don't Miss
- Sports టీ20 వరల్డ్ కప్లో ధోనీ రీఎంట్రీ: బీసీసీఐ మాస్టర్ ప్లాన్!
- Lifestyle తీర్చుకోలేని రుణం అమ్మ ప్రేమ..! మన పుట్టినరోజున అందరికంటే ఎక్కువ సంతోషపడేది అమ్మ..!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచి కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- News వీళ్లా..వైఎస్ వారసులు, పక్కన పెట్టింది ఇందుకే - షర్మిల పై జగన్ ఫైర్..!!
- Movies Brahmamudi April 25th episode: కావ్యకు సవతి వచ్చినా ఫర్వాలేదా?.. నీవు నా మొగుడిని తగులుకుంటావా? అనామిక
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
భారత మార్కెట్లో టాటా యోధా 2.0 (Tata Yodha 2.0) పికప్ ట్రక్కు విడుదల.. ధర రూ.10 లక్షలు..
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) భారత మార్కెట్లో మూడు సరికొత్త వాణిజ్య వాహనాలను విడుదల చేసింది. వీటిలో ఒక పికప్ ట్రక్కు మరియు రెండు తేలికపాటి వాణిజ్య వాహనాలు (లైట్ కమర్షియల్ వెహికల్) ఉన్నాయి. వాటి వివరాలేంటో ఈ కథనంలో చూద్దాం రండి.
లైట్ వెయిట్ కమర్షియల్ సెగ్మెంట్లో రారాజుగా ఉన్న టాటా మోటార్స్, దేశీయ సివి మార్కెట్లో యోధా 2.0 (Yodha 2.0), ఇంట్రా వి20 బై-ఫ్యూయల్ (Intra V20 Bi-fuel) మరియు ఇంట్రా వి50 (Intra V50) మోడళ్లను విడుదల చేసింది. వీటిలో టాటా యోధా 2.0 హార్డ్ కోర్ పికప్ ట్రక్కు కాగా మిగిలిన రెండు మోడళ్లు లైట్ కమర్షియల్ వెహికల్స్గా ఉంటాయి. ఈ పికప్ ట్రక్కులు కొత్త డిజైన్ను కలిగి ఉండి, పొడవైన డెక్, అత్యధిక పవర్-టు-వెయిట్ రేషియో, ఆధునిక ఫీచర్లు మరియు అధిక పేలోడ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
ఈ కొత్త మోడళ్లలో టాటా యోధా 2.0 అత్యంత తెలివైన మరియు సౌకర్యవంతమైన పికప్ ట్రక్. వెర్షన్ 2.0 (టూ పాయింట్ ఓ)గా వచ్చిన ఈ కొత్త మోడల్ మునుపటి తరం మోడల్తో పోలిస్తే కొత్త డిజైన్ను కలిగి ఉంటుంది. ఈ కొత్త మోడల్ను 2020 ఆటోఎక్స్పోలో ప్రదర్శించారు. కోవిడ్-19 మహమ్మారి తెచ్చిన అవాంతరాల కారణంగా దీని లాంచ్ వాయిదా పడుతూ వచ్చింది. కాగా, ఎట్టకేలకు ఇప్పుడు ఇది వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది.
టాటా యోధా 2.0 పికప్ ట్రక్ దాని మునుపటి యోధా కన్నా ఎన్నో రెట్లు మెరుగైన డిజైన్ మరియు అధునాతన ఫీచర్లను కలిగి ఉంటుంది. సరికొత్త క్రోమ్ గ్రిల్, రీడిజైన్ చేయబడిన హెడ్లైట్లు మరియు యోధా సిరీస్లో మొదటిసారిగా ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు, ఫాగ్ ల్యాంప్ల కోసం కొత్త స్క్వారీష్ హౌసింగ్ మరియు బంపర్ దిగువ పెద్ద ఎయిర్ డ్యామ్ వంటి మార్పులు ఉన్నాయి. అర్బన్, సెమీ-అర్బన్ మరియు గ్రామీణ మార్కెట్లలోని రవాణా అవసరాలను లక్ష్యంగా చేసుకుని కొత్త టాటా యోధా 2.0 ని అప్గ్రేడ్ చేశారు.
యోధా 2.0 టాటా యొక్క సిగ్నేచర్ 'ట్రస్ట్ బార్' తో కఠినమైన భూభాగాలను సైతం సులువుగా పరిష్కరించగలదని కంపెనీ పేర్కొంది ఈ మోడల్ 4×4 (ఆల్-వీల్ డ్రైవ్) మరియు 4×2 (టూ-వీల్ డ్రైవ్) కాన్ఫిగరేషన్లలో 1,200 కేజీలు, 1,500 కేజీలు మరియు 1,700 కేజీల పేలోడ్ సామర్థ్యంతో లభిస్తుంది. అలాగే, ఇది కస్టమర్ల ఎంపికను బట్టి సింగిల్ క్యాబ్ మరియు క్రూ క్యాబ్ అనే అదనపు సీటింగ్ కెపాసిటీతో కూడా లభిస్తుంది. ఇది 30 శాతం గ్రేడ్ సామర్థ్యంతో పాటు 2-టన్నుల పేలోడ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
టాటా యోధా 2.0 పికప్ ట్రక్కులో శక్తివంతమైన 2.2 లీటర్ డీజిల్ ఇంజన్ ఉంటుంది. ఇది గరిష్టంగా 250 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో ఏసి విత్ హీటర్ కలిగిన వేరియంట్ ధర రూ.9.99 లక్షల నుండి ప్రారంభం అవుతుంది. అలాగే, ఏసితో కూడిన క్రూ క్యాబ్ ఈఎక్స్ వేరియంట్ ధర రూ. 10.74 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంటుంది. ఈ పికప్ ట్రక్కుకు సంబంధించిన మరిన్ని వివరాలను మీ సమీపంలోని అధీకృత టాటా కమర్షియల్ వెహికల్ డీలర్ను సంప్రదించి తెలుసుకోవచ్చు.
ఇక టాటా మోటార్స్ అందిస్తున్న బై-ఫ్యూయెల్ కమర్షియల్ వెహికల్ (రెండు రకాల ఇంధనాలతో నడిచే వాణిజ్య వాహనం) టాటా ఇంట్రా వి20 బై-ఫ్యూయెల్ మరియు ఇంట్రా వి50 పికప్ ట్రక్కులను ప్రధానంగా వ్యవసాయం, పౌల్ట్రీ మరియు పాడి పరిశ్రమల వంటి సేవలకు అలాగే FMCG సేవలు మరియు ఇ- డెలివరీ అవసరాలకు అనుగుణంగా డిజైన్ చేయబడ్డాయి. ఇవి వాణిజ్యం మరియు లాజిస్టిక్స్ రంగాలలో కస్టమర్లకు గరిష్ట లాభాలను అందించడానికి వీలుగా వాటి విభాగాలలో యాజమాన్యం యొక్క అతి తక్కువ మొత్తం ధరను అందజేస్తుందని టాటా మోటార్స్ తెలిపింది.
ఈ రెండింటిలో టాటా ఇంట్రా వి50 అధిక పేలోడ్ సామర్థ్యం, మెరుగైన క్యాబిన్ సౌకర్యం, పొడవైన లోడ్ డెక్, అర్బన్ మరియు సెమీ-అర్బన్ ప్రాంతాలలో అన్ని రకాల భూభాగాలపై నడిపేందుకు వీలుగా అధిక గ్రౌండ్ క్లియరెన్స్ వంటి అంశాలతో వస్తుందని కంపెనీ తెలిపింది. ఇకపోతే, కొత్త ఇంట్రా వి20 పికప్ 1,000 కిలోల పేలోడ్ సామర్థ్యాన్ని కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి బై-ఫ్యూయెల్ (పెట్రోల్ + సిఎన్జి) వాహనం అని కంపెనీ తెలిపింది. వినియోగదారులకు గరిష్ట లాభాలను చేకూర్చేలా, తక్కువ నిర్వహణ వ్యయంతో తయారు చేయబడిందని కంపెనీ తెలిపింది.
ఇంట్రా వి50 స్మార్ట్ పికప్ 1500కేజీల పేలోడ్ సామర్థ్యంతో అతిపెద్ద డెక్ పొడవును కలిగి ఉంటుంది. ఇది 1.5 లీటర్ డీజిల్ ఇంజన్తో పనిచేస్తుంది మరియు ఈ ఇంజన్ గరిష్టంగా 220 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇక ఇంట్రా వి20 విషయానికి వస్తే, దీని పేలోడ్ సామర్థ్యం 1000 కిలోలుగా ఉంటుంది మరియు ఇది పూర్తి ట్యాంక్ ఇంధనాలతో 700 కిలోమీటర్ల సుధీర్ఘమైన రేంజ్ను అందించే భారతదేశపు మొదటి బై-ఫ్యూయెల్ పికప్ ట్రక్కు. ఇది 1.2 లీటర్ డీజిల్ ఇంజన్తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ 106 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది.