Just In
- 58 min ago సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- 4 hrs ago 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
- 4 hrs ago ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- 5 hrs ago బిలినీయర్ మనసుదోచిన ఆటో ఇదే!.. ధర తెలిస్తే మీరు కొనేస్తారు
Don't Miss
- News ఉరేయాలన్న బొత్స తండ్రి సమానుడా ? వైఎస్ నూ వదల్లేదుగా- జగన్ కు షర్మిల కౌంటర్..!
- Sports ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను- కమిన్స్ Video
- Travel ఐఆర్సిటీసి వారి హైదరాబాద్ టు అహ్మదాబాద్ 8 రోజుల ట్రైన్ టూర్ ప్యాకేజీ...
- Finance Gold Bonds: గోల్డ్ బాండ్స్ ప్రీమెచూర్ ధర ప్రకటించిన ఆర్బీఐ.. పూర్తి వివరాలివే..
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- Movies నాతో ఆ పని చేస్తావా? ఒక రాత్రికి ఎంత తీసుకుంటావ్.. జబర్ధస్త్ బ్యూటీ ఏమన్నదో చూశారంటే!
హ్యుందాయ్ స్థానానికి టాటా శాశ్వతంగా ఎసరు పెట్టేస్తుందా..? టాటా స్పీడ్ చూస్తుంటే అలానే అనిపిస్తోంది మరి..!
ప్రస్తుతం, భారతదేశంలో అగ్రగామి ప్యాసింజర్ కార్ కంపెనీల జాబితాలో మారుతి సుజుకి మొదటి స్థానంలో ఉండగా, హ్యుందాయ్ ద్వితీయ స్థానంలో మరియు టాటా మోటార్స్ తృతీయ స్థానంలో ఉంది. అయితే, గత కొంత కాలంగా టాటా మోటార్స్ అద్భుతమైన అమ్మకాల పనితీరును కనబరుస్తోంది. టాటా మోటార్స్ విడుదల చేస్తున్న కొత్త కార్లకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఏర్పడుతోంది, దీంతో కంపెనీ మొత్తం అమ్మకాలు కూడా వేగంగా వృద్ధి చెందుతున్నాయి.
టాటా మోటార్స్ ఇప్పుడు భారతదేశపు ద్వితీయ అగ్రాగమి కార్ కంపెనీగా అవతరించేందుకు కావల్సిన అన్ని అర్హతలను కలిగి ఉంది. ఎలక్ట్రిక్ కార్ విభాగంలో ఇప్పటికే భారతదేశపు నెంబర్ వన్ కంపెనీగా ఉన్న టాటా మోటార్స్, ట్రెడిషనల్ ప్యాసింజర్ కార్స్ విభాగంలో కూడా అగ్రస్థానాలపై కన్నేసింది. ఇప్పటికే కొన్ని సందర్భాల్లో హ్యుందాయ్ అమ్మకాలను ఓవర్టేక్ చేసి, రెండవ స్థానంలో నిలిచిన టాటా మోటార్స్, శాస్వతంగా ఆ స్థానాన్ని కైవసం చేసుకోవాలని చూస్తోంది.
గడచిన సెప్టెంబర్ 2022 నెలలో టాటా మోటార్స్ దేశీయ విపణిలో మొత్తం 47,654 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలను విక్రయించింది. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో (సెప్టెంబర్ 2021 నెలలో) విక్రయించిన 25,730 యూనిట్లతో పోలిస్తే, కంపెనీ గత నెలలో మొత్తం అమ్మకాలలో 85 శాతం వృద్ధిని నమోదు చేసింది. కాగా, గడచిన నెలలో హ్యుందాయ్ మోటార్ ఇండియా దేశీయ మార్కెట్లో 49,700 వాహనాలను విక్రయించింది. గత నెలలో టాటా మోటార్స్, హ్యుందాయ్కి చాలా దగ్గర పోటీ ఇచ్చింది.
సెప్టెంబర్ 2022 నెలలో మారుతి సుజుకి మొత్తం 1.55 లక్షల వాహనాలను విక్రయించి మొదటి స్థానంలో ఉండగా, హ్యుందాయ్ 49,700 యూనిట్లతో ద్వితీయ స్థానంలో మరియు టాటా మోటార్స్ 47,654 యూనిట్లతో తృతీయ స్థానంలో నిలిచింది. రాబోయే నెలల్లో టాటా మోటార్స్ అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే, టాటా మోటార్స్ గడచిన నెలలో భారతదేశంలోనే అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారు టాటా టియాగో ఈవీని ఆవిష్కరించింది. ఇది మరికొద్ది నెలల్లోనే (జనవరి 2023లో) అమ్మకానికి రానుంది.
టాటా మోటార్స్ అందిస్తున్న నెక్సాన్ ఈవీ మరియు టిగోర్ ఈవీ కార్లకు ఇప్పటికే మార్కెట్లో అధిక డిమాండ్ ఉంది. అలాంటి, అతి తక్కువ ధరకే (రూ. 8.49 లక్షలకే) ఓ టాటా ఎలక్ట్రిక్ కారు లభిస్తే, ఇక ఆ మోడల్ అమ్మకాలు ఏ రీతిలో ఉండబోతాయో చెప్పనవసరం లేదు. కంపెనీ అమ్మకాల గురించి టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ చంద్ర మాట్లాడుతూ, టాటా నెక్సాన్ మరియు టాటా పంచ్ల రికార్డు అమ్మకాల నేపథ్యంలో కంపెనీ గత నెలలో 47,654 నెలవారీ అమ్మకాలను సాధించిందని తెలిపారు.
ఇటీవల టియాగో ఈవీని ప్రారంభించడంతో కంపెనీ ఎలక్ట్రిక్ మొబిలిటీలో కొత్త మార్గాలను తెరిచిందని మరియు దేశవ్యాప్తంగా కస్టమర్లు ఎలక్ట్రిక్ వాహనాలను భారీగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. రిటైల్ విక్రయాలను మరింత బలోపేతం చేసేందుకు ఈ పండుగ సీజన్లో సరఫరా మెరుగుపడుతుందని కంపెనీ అంచనా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. మార్కెట్లో టియాగో ఈవీ ధరలు రూ. 8.49 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమై రూ. 11.79 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి.
గత నెలలో కేవలం అంతర్గత దహన ఇంజన్ (పెట్రోల్/డీజిల్) కార్ల అమ్మకాలను గమనిస్తే, ఇవి 43,999 యూనిట్లుగా నమోదయ్యాయి. సెప్టెంబర్ 2021లో ఇవి కేవలం 24,652 యూనిట్లుగా మాత్రమే ఉన్నాయి. ఈ సమయంలో పెట్రోల్/డీజిల్ కార్ల అమ్మకాలు 78.48 శాతం వృద్ధి చెందాయి. ఇక, ఎలక్ట్రిక్ కార్ల విక్రయాల విషయానికి వస్తే, గత సెప్టెంబర్లో మొత్తం 3,655 ఎలక్ట్రిక్ కార్లు విక్రయించబడ్డాయి. ఇవి సెప్టెంబర్ 2021లో విక్రయించిన 1,078 ఎలక్ట్రిక్ కార్లతో పోలిస్తే, 239.05 శాతం వృద్ధి చెందాయి.
టాటా మోటార్స్ వాణిజ్య వాహనాల విషయానికి వస్తే, గత ఏడాది సెప్టెంబర్లో విక్రయించిన 30,258 యూనిట్ వాణిజ్య వాహనాలతో పోలిస్తే, గత నెలలో అమ్మకాలు 9 శాతం పెరిగి 32,979 యూనిట్లకు చేరుకున్నాయి. సెప్టెంబర్ 2022 నెలలో దేశీయ మార్కెట్లో టాటా మోటార్స్ మొత్తం వాహనాల (ప్రయాణీకులు మరియు వాణిజ్య) విక్రయాలు 80,633 యూనిట్లుగా నమోదయ్యాయి, ఇది సెప్టెంబర్ 2021 నెల అమ్మకాల కంటే 44 శాతం అధికం. గత నెలలో, టాటా మోటార్స్ యోధా 2.0, ఇంట్రా వి20 సిఎన్జి మరియు ఇంట్రా వి50 అనే మూడు పిక్-అప్ వాహనాలను విడుదల చేసింది.
అక్టోబర్ 10వ తేదీ నుండి టాటా టియాగో ఈవీ బుకింగ్స్..
ఇదిలా ఉంటే, టాటా మోటార్స్ ఇటీవలే విడుదల చేసిన తమ లేటెస్ట్ ఎలక్ట్రిక్ కారు టాటా టియాగో ఈవీ కోసం అక్టోబర్ 10, 2022వ తేదీ నుండి బుకింగ్లను స్వీకరించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. కేవలం రూ.8.49 లక్షల ప్రారంభ ధరతో విడుదలైన టాటా టియాగో ఈవీ (Tata Tiago EV) దేశంలోనే అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారుగా నిలిచింది. అంతేకాకుండా, ఇది పూర్తి చార్జ్ పై 315 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ను అందిస్తుందని కంపెనీ తెలిరింది. టియాగో ఈవీ రెండు బ్యాటరీ ప్యాక్స్తో 7 వేరియంట్లలో విడుదల చేయబడింది.
టాటా టియాగో ఈవీ పరిచయ ధరలు మొదటి 10,000 యూనిట్ల బుకింగ్లకు మాత్రమే వర్తిస్తాయని, ఆ తర్వాత నుండి కొత్త ధరలు అమల్లోకి వస్తాయని కంపెనీ పేర్కొంది. టియాగో ఈవీ డెలివరీలను జనవరి 2023 నుండి ప్రారంభించాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. టాటా టియాగో ఈవీ బేస్ వేరియంట్లు 19.2kWh బ్యాటరీ ప్యాక్తో లభిస్తుండగా, టాప్-స్పెక్ వేరియంట్లు 24kWh బ్యాటరీ ప్యాక్తో లభ్యం కానున్నాయి. బేస్ వేరియంట్లు పూర్తి చార్జ్ పై 250 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ను అందిస్తుండగా, టాప్-స్పెక్ వేరియంట్లు పూర్తి ఛార్జ్ పై 315 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ను అందిస్తాయని కంపెనీ తెలిపింది.