భారత్లో ఫెరారీ హెడ్ఫోన్; ధర రూ.19,000 మాత్రమే
ఫెరారీ బ్రాండ్ అంటే ఎవరికి మాత్రం క్రేజ్ ఉండదు చెప్పండి. ఈ క్రేజ్ను క్యాష్ చేసుకునేందుకు ఇప్పటికే పలు కంపెనీలు వివిధ రకాల గ్యాడ్జెట్లను, యాక్ససరీలను తయారు చేస్తున్న సంగతి తెలిసినదే. తాజాగా, ఫెరారీ ఓ సరికొత్త హెడ్ఫోన్ను భారత్లో పరిచయం చేసింది.
సంగీత ప్రియులను లక్ష్యంగా చేసుకొని 'స్కుడెరియా పి200 హెడ్ఫోన్' (Scuderia P200 Headphone)ను భారత్లో విడుదల చేసింది. ఈ హెడ్ఫోన్లో అణువనువునా ఫెరారీ డిఎన్ఏ కనిపిస్తుంది. స్టయిల్, పర్సనాలిటీ, కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీతో ఈ హెడ్ఫోన్ ధరకు తగిన విలువను కలిగి ఉంటాయి.
ఫెరారీ అభిమానుల కోసం స్కుడెరియా పి200 హెడ్ఫోన్ను లాజిక్3 కలెక్షన్ ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చామని సాహిల్ ఇంటర్నేషనల్ సీఈఓ సాహిల్ సానీ తెలిపారు. స్పోర్టీ డిజైన్ కలిగిన ఈ హెడ్ఫోన్ ప్రపంచ స్థాయి ఉత్తమ సౌండ్ క్వాలిటీ అనుభూతిని కలిగిస్తుందని, దీనిని స్కుడెరియా ఫెరారీ రేసింగ్ టీమ్ నుంచి స్ఫూర్తి పొంది డిజైన్ చేశామని కంపెనీ తెలిపింది.
అన్ని రకాల గ్యాడ్జెట్లకు కనెక్ట్ చేసుకునే విధంగా, సపోర్ట్ చేసే విధంగా ఈ హెడ్ఫోన్ డిజైన్ చేశారు. 3.5 మి.మీ. జాక్ ఆప్షన్ కలిగిన గ్యాడ్జెట్ల కోసం ఇందులో ఓ కనెక్టరను కూడా ఇచ్చారు. వాల్యూమ్ కంట్రోల్ బటన్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఇది బ్లాక్ లేదా రెడ్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. భారత మార్కెట్లో స్కుడెరియా పి200 హెడ్ఫోన్ ధర రూ.18,990/-గా ఉంది. మరింత సమాచారం కోసం www.ferrari-by-logic3.com వెబ్సైట్ను సందర్శించండి.













Click it and Unblock the Notifications








