Just In
- 6 min ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- 2 hrs ago కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- 16 hrs ago గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- 18 hrs ago 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
Don't Miss
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
- News AP Elections: నా కాళ్లు పట్టుకున్నావా లేదా ? పెద్దిరెడ్డికి కిరణ్ ఘాటు కౌంటర్.. !
- Finance Cerelac News: పేదదేశాల సెరెలాక్ ఉత్పత్తులో పంచదార..!! FSSAIకి నోటీసులు జారీ..
- Technology గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ గురించి తెలుసా.. రోడ్ ట్రిప్ సహా ప్రయాణాల్లో ఆందోళన ఉండదిక...!
- Movies సుడిగాలి సుధీర్ అమ్మాయిల పిచ్చోడా? జబర్దస్త్ కమెడియన్ ఘాటుగా రియాక్షన్!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
గుర్ఖాతో ఆఫ్-రోడ్ మార్కెట్ను దున్నేస్తాం: ఫోర్స్ మోటార్స్
పూనేకి చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ ఫోర్స్ మోటార్స్ వచ్చే నెలలో (సెప్టెంబర్ 2014లో) విడుదల చేయనున్న తమ సరికొత్త 2014 'ఫోర్స్ గుర్ఖా' (Force Gurkha) ఎస్యూవీతో భారత ఆఫ్-రోడ్ వాహనాల విభాగంలో 20 శాతం మార్కెట్ వాటా దక్కించుకోవాలనే లక్ష్యంతో ఉంది. ఈ మోడల్ను విడుదల చేసిన తర్వాత ప్రతినెలా 2,400 యూనిట్ల ఫోర్స్ గుర్ఖాలను విక్రయించాలని భావిస్తున్నామని కంపెనీ పేర్కొంది.
వాస్తవానికి ఫోర్స్ మోటార్స్ గడచిన సంవత్సరం ఫిబ్రవరిలోనే తమ సరికొత్త ఫోర్స్ గుర్ఖా ఎస్యూవీ విడుదల గురించి కంపెనీ ప్రకటన చేసినప్పటికీ, ఇది కస్టమర్ల చెంతకు చేరేందుకు దాదాపు ఏడాదిన్నరకు పైగా సమయం పట్టింది. ఫోర్స్ గుర్ఖా ఆఫ్-రోడర్ను ఫోర్స్ మోటార్స్ ఇప్పటికే పలు అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేయటాన్ని కూడా ప్రారంభించింది.
ఫోర్స్ గుర్ఖా విషయంలో నిపుణలు, ఇదివరకటి కస్టమర్లు ఇచ్చి ఫీడ్బ్యాక్ ఆధారంగా కంపెనీ ఇందులో కొన్ని ఇంప్రూవ్మెంట్స్ చేసింది. ఇదివరకటి ఫోర్స్ గుర్ఖాతో పోల్చుకుంటే పెర్ఫామెన్స్, డిజైన్ల పరంగా మరింత మెరుగ్గా ఉండేలా ఫోర్స్ మోటార్స్ తమ సరికొత్త 2014 ఫోర్స్ గుర్ఖా ఎస్యూవీని అభివృద్ధి చేసింది.
మరింత
సమాచారం
తర్వాతి
సెక్షన్లో..
మరిన్ని
వివరాలను
ఈ
ఫొటో
ఫీచర్లో
పరిశీలించండి..!
కొత్త ఫోర్స్ గుర్ఖా ఎస్యూవీలో మెర్సిడెస్ బెంజ్ మాతృ సంస్థ డైమ్లర్ నుంచి గ్రహించిన పవర్ఫుల్ 2.6 లీటర్ ఓఎమ్616 డీజిల్ ఇంజన్ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 81 బిహెచ్పిల శక్తిని, 230 ఎన్ఎమ్ల టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్తో జతచేయబడి ఉంటుంది.
రీడిజైన్డ్ హెడ్లైట్స్, కొత్త గ్రిల్తో ఇది సరికొత్త ఫ్రంట్ లుక్ను కలిగి ఉంటుంది. ఫోర్స్ గుర్ఖా ప్రస్తుతానికి బిఎస్-3 మరియు బిఎస్-4 వెర్షన్లలో మాత్రమే అందుబాటులోకి రానుంది.
ఫోర్స్ మోటార్స్ వెల్లడించిన సమాచారం ప్రకారం, ఫోర్స్ గుర్ఖా మొత్తం మూడు వేరియంట్లలో లభ్యం కానుంది.
ఈ మూడు వేరియంట్లలో ఒకటి ఫోర్-వీల్ డ్రైవ్, హార్డ్-టాప్తో కూడిన 5-సీటర్ వేరియంట్ కాగా రెండు సాఫ్ట్ టాప్తో కూడిన 6-సీటర్ వేరియంట్స్ (వీటిల్లో ఒకటి టూ-వీల్ డ్రైవ్ మరొకటి 4-వీల్ డ్రైవ్).
ఫోర్స్ గుర్ఖా ఈ సెగ్మెంట్లో మహీంద్రా అండ్ మహీంద్రా అందిస్తున్న ఆఫ్-రోడర్ 'థార్' ఎస్యూవీతో తలపడనుంది.
గడచిన ఫిబ్రవరిలో ఫోర్స్ మోటార్స్ వెల్లడించిన దాని ప్రకారం, గుర్ఖా ధరలు ఇలా ఉన్నాయి (ధరలను తర్వాతి స్లైడ్లో పరిశీలించండి). అయితే, సెప్టెంబర్ 2014లో కంపెనీ విడుదల చేయనున్న గుర్ఖాకు ఇదే ధరలను వర్తింప జేస్తుందా లేదా అన్న విషయం తెలియాల్సి ఉంది.
* ఫోర్-వీల్ డ్రైవ్, హార్డ్-టాప్ - రూ.8.50 లక్షలు
* ఫోర్-వీల్ డ్రైవ్, సాఫ్ట్-టాప్ - రూ.8.35 లక్షలు
* టూ-వీల్ డ్రైవ్, సాఫ్ట్-టాప్ - రూ.6.25 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)