ఇసుజు ఎమ్‌యూ-7 ఎస్‌యూవీ, డి-మ్యాక్స్‌ పికప్‌ల విడుదల

భారత ఆటోమొబైల్ మార్కెట్లోకి మరొక జపనీస్ కార్ బ్రాండ్ వచ్చి చేరింది. జపాన్‌ ఆటో దిగ్గజం 'ఇసుజు మోటార్స్' (Isuzu Motors) దేశీయ విపణిలో 'ఇసుజు ఎమ్‌యూ-7' ఎస్‌యూవీ మరియు 'ఇసుజు డి-మ్యాక్స్' పికప్ ట్రక్కులను విడుదల చేసింది. ప్రస్తుతం ఇసుజు మోటార్స్‌కు హైదరాబాద్, కోయంబత్తూర్‌లలో రెండు డీలర్‌షిప్ కేంద్రాలున్నాయి. భారత మార్కెట్లో వీటి ధరలు ఇలా ఉన్నాయి:

  • ఇసుజు ఎమ్‌యూ-7 ఎస్‌యూవీ ధర - రూ.24.16 లక్షలు
  • ఇసుజు డి-మ్యాక్స్ పికప్ (సింగిల్ క్యాబిన్) ధర - రూ.6.78 లక్షలు
  • ఇసుజు డి-మ్యాక్స్ పికప్ (డబుల్ క్యాబిన్) ధర - రూ.8.09 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)

ఇసుజు ఎమ్‌యూ-7 ఎస్‌యూవీ ఈ సెగ్మెంట్లోని టొయోటా ఫార్చ్యూనర్, మిత్సుబిషి పాజెరో స్పోర్ట్ వంటి మోడళ్లకు పోటీగా నిలువనుంది. ప్రస్తుతం ఇసుజు ఈ రెండు మోడళ్లను సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో భారత్‌కు దిగుమతి చేసుకొని ఇక్కడి మార్కెట్లో విక్రయిస్తోంది. కాగా.. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు-చిత్తూరు జిల్లాలో ఉన్న శ్రీ సిటీలో ఇసుజు మోటార్స్ ఓ గ్రీన్‌ఫీల్డ్ ప్లాంటును ఏర్పాటు చేయటం ద్వారా ఈ మోడళ్లను భారత్‌లోనే ఉత్పత్తి చేయాలని కంపెనీ నిర్ణయించింది.

ఇసుజు ఎమ్‌యూ-7 ఎస్‌యూవీ విడుదల

ఇసుజు ఎమ్‌యూ-7 ఎస్‌యూవీ విడుదల

ఇసుజు ఎమ్‌యూ-7 ఎస్‌యూవీని విడుదల చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.

ఇసుజు ఎమ్‌యూ-7 ఎస్‌యూవీ విడుదల

ఇసుజు ఎమ్‌యూ-7 ఎస్‌యూవీ విడుదల

ఇసుజు డి-మ్యాక్స్ పికప్ ట్రక్‌ను విడుదల చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.

ఇసుజు ఎమ్‌యూ-7 ఎస్‌యూవీ విడుదల

ఇసుజు ఎమ్‌యూ-7 ఎస్‌యూవీ విడుదల

ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు-చిత్తూరు జిల్లాలో ఉన్న శ్రీ సిటీలో ఇసుజు మోటార్స్ ఓ గ్రీన్‌ఫీల్డ్ ప్లాంటు ఏర్పాటు విషయమై అవగాహన ఒప్పందం (ఎమ్‌ఓయూ)ను మార్చుకుంటున్న ఇసుజు కంపెనీ మరియు ఆంధ్రప్రదేశ్ సర్కారు.

ఇసుజు ఎమ్‌యూ-7 ఎస్‌యూవీ విడుదల

ఇసుజు ఎమ్‌యూ-7 ఎస్‌యూవీ విడుదల

ఇసుజు ఎమ్‌యూ-7 విడుదల కార్యక్రమంలో జపాన్ అధికారులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధులు.

ఇసుజు ఎమ్‌యూ-7 ఎస్‌యూవీ

ఇసుజు ఎమ్‌యూ-7 ఎస్‌యూవీ

ఇసుజు ఎమ్‌యూ-7 ఎస్‌యూవీ

ఇసుజు ఎమ్‌యూ-7 ఎస్‌యూవీ

ఇసుజు ఎమ్‌యూ-7 ఎస్‌యూవీ

ఇసుజు ఎమ్‌యూ-7 ఎస్‌యూవీ

ఇసుజు ఎమ్‌యూ-7 ఎస్‌యూవీ

ఇసుజు ఎమ్‌యూ-7 ఎస్‌యూవీ

ఇసుజు డి-మ్యాక్స్ పికప్

ఇసుజు డి-మ్యాక్స్ పికప్

ఇసుజు డి-మ్యాక్స్ పికప్

ఇసుజు డి-మ్యాక్స్ పికప్


ఈ మేరకు ఇసుజుతో రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం (మార్చి 15, 2013) ఓ అవగాహన ఒప్పందం (ఎమ్‌ఓయూ)పై ఇరు పార్టీలు సంతకాలు చేశాయి. సుమారు రూ.1,500 కోట్ల పెట్టుబడులతో, దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో కంపెనీ ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. ఇది 2015 నాటికి నిర్వహణలోకి రానుంది. ఈలోపుగా కంపెనీ తమ ఉత్పత్తులను భారత మార్కెట్లోనే అసెంబ్లింగ్ యోచిస్తోంది. ఇందుకు గాను హిందుస్థాన్ మోటార్స్ వంటి పటిష్ట కంపెనీలతో ఇసుజు చర్చలు జరుపుతోంది.

Article Published On: Saturday, March 16, 2013, 9:12 [IST]
English summary
Japanese auto major Isuzu Motors has launched MU-7 SUV and D-Max pick-up in Hyderabad. The 7-seater Isuzu MU-7 SUV has been priced at Rs 23.75 lakh, the the single cab version D-Max pick-up priced at Rs 6.87 lakh and the double cab version D-Max pick-up has been priced at Rs 8.09 lakh. (All prices are ex-showroom, Hyderabad).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+