మెర్సిడెస్ బెంజ్ జిఎల్63 ఏఎమ్జి విడుదల; రూ.1.66 కోట్లు
జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ ఇండియా తమ సరికొత్త పవర్ఫుల్ ఎస్యూవీ 'జిఎల్ 63 ఏఎమ్జి'ని నేడు దేశీయ విపణిలో విడుదల చేసింది. సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో పూర్తిగా విదేశాల్లో తయారైన ఈ మెర్సిడెస్ బెంజ్ జిఎల్63 ఏఎమ్జి ఎస్యూవీని ఇండియాకు దిగుమతి చేసుకొని ఇక్కడి మార్కెట్లో విక్రయించనున్నారు.
భారత మార్కెట్లో ఇది రెండు వెర్షన్లలో (రెగ్యులర్, ఏఎమ్జి) లభ్యం కానుంది ఈ సరికొత్త జిఎల్ ఏఎమ్జి ఎస్యూవీ ధర రూ.1.66 కోట్లు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. జిఎల్ ఏఎమ్జి రాకతో భారత్లో మెర్సిడెస్ బెంజ్ అందిస్తున్న హై-పెర్ఫార్మెన్స్ ఏఎమ్జి మోడళ్ల సంఖ్య ఐదుకు చేరుకుంది. కంపెనీ ఇప్పటికే సి63 ఏఎమ్జి, జి63 ఏఎమ్జి, ఈ63 ఏఎమ్జి మరియు ఎస్ఎల్కె55 ఏఎమ్జి మోడళ్లను అందిస్తోంది.

కాగా.. మెర్సిడెస్ బెంజ్ ఇండియా విడుదల చేసిన ఈ కొత్త జిఎల్63 ఏఎమ్జి ఎస్యూవీలో పవర్ఫుల్ 5.5 లీటర్ టర్బో వి8 ఇంజన్ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 549 బిహెచ్పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ శక్తి 40 శాతం ముందు చక్రాలకు, 60 శాతం వెనుక చక్రాలకు బదిలీ అవుతుంది. ఈ ఆల్-వీల్ డ్రైవ్ ఎస్యూవీ సుమారు 2.5 టన్నుల బరువు ఉంటుంది.
మెర్సిడెస్ బెంజ్ జిఎల్63 ఏఎమ్జి ఎస్యూవీలో ఉపయోగించిన ఇంజన్ 7జి-ట్రానిక్ ఏఎమ్జి ఆటోమేటిక్ గేర్బాక్స్తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఇది కేవలం 4.9 సెకండ్ల వ్యవధిలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగాన్ని యాంత్రికంగా గంటకు 250 కిలోమీటర్లకు పరిమితం చేశారు. ఈ కారుకు సంబంధించి పూర్తి రివ్యూ కోసం తెలుగు డ్రైవ్స్పార్క్ను గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








