బడ్జెట్ ఎఫెక్ట్: మెర్సిడెస్ బెంజ్ కార్ల ధరల తగ్గింపు
తాజాగా భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్ 2014-15లో వివిధ విభాగాల కార్లపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన నేపథ్యంలో, ప్రముఖ లగ్జరీ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ ఇండియా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న ఉత్పత్తుల ధరలను కూడా భారీగా తగ్గించింది.
గడచిన జనవరిలో మెర్సిడెస్ బెంజ్ అమ్మకాలు కేవలం ఇండియాలోనే 54 శాతం వృద్ధి చెందాయి. ఇటీవలే ముగిసిన 2014 ఆటో ఎక్స్పోలో మెర్సిడెస్ బెంజ్, భారత్ మార్కెట్లో విక్రయిస్తున్న 13 కార్లను ప్రదర్శనకు ఉంచింది.
అలాగే రెండు కొత్త కార్లను (సిఎల్ఏ 45 ఏఎమ్జి, ప్రొడక్షన్ రెడీ జిఎల్ఏ) కూడా ఈ ఆటో ఎక్స్లో కంపెనీ ఆవిష్కరించింది. అంతేకాకుండా, హై సెక్యూరిటీ వెహికల్ కోరుకునే వారి కోసం కంపెనీ సాయుధ ఎమ్-క్లాస్ (అలియాస్ ఎమ్-గార్డ్)ను కూడా విడుదల చేయటం జరిగింది. విఐపిల కోసం తయారు చేసిన ఈ కారు ధర రూ.2.49 కోట్లు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.
సరే ఇదంతా అటుంచి, మెర్సిడెస్ బెంజ్ ఏయే కార్లపై ఎంత మేర ధరలను తగ్గించిందో తెలుసుకుందాం రండి..!

యూనియన్ బడ్జెట్ 2014-15లో కార్లపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన నేపథ్యంలో, మెర్సిడెస్ బెంజ్ ఇండియా విక్రయిస్తున్న సి-క్లాస్, ఈ-క్లాస్, జిఎల్-క్లాస్ వంటి కార్ల ధరలను భారీగా తగ్గించింది.

తాజా తగ్గింపుతో సి-క్లాస్ ధర రూ.39.90 లక్షల నుంచి రూ.39.35 లక్షలకు దిగొచ్చింది (సి220 వేరియంట్ గ్రాండ్ ఎడిషన్ ఎక్స్-షోరూమ్, ఢిల్లీ ధర).

ఈ-క్లాస్ ధర 47.66 లక్షల నుంచి రూ.46.90 లక్షలకు దిగొచ్చింది (ఈ250 సిడిఐ ఎక్స్-షోరూమ్, ఢిల్లీ ధర).

మెర్సిడెస్ జిఎల్-క్లాస్ ధర రూ.74 లక్షల నుంచి రూ.72 లక్షలకు దిగొచ్చింది.


Click it and Unblock the Notifications








