Just In
- 1 hr ago వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- 2 hrs ago ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
- 3 hrs ago మండే వేసవిలో ట్రాఫిక్ పోలీసులకు చల్లచల్లని ఏసీ హెల్మెట్లు.. ఎక్కడో తెలుసా.??
- 5 hrs ago ఎన్నో అంచనాల మధ్య లాంచ్ అయిన క్లచ్లెస్ బైక్ TVS Jive.. ఎందుకు ఫెయిల్ అయింది.??
Don't Miss
- News ఎన్నికల ముందు గుడ్ న్యూస్..ఫుల్ జోష్లో వైసీపీ
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
- Movies Mahi Shivan: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సీరియల్ నటి మహేశ్వరి.. ఎవరు పుట్టారో తెలుసా?
ఇకపై భారత్లోనే స్కానియా బస్సుల తయారీ
గడచిన సంవత్సరం భారత మార్కెట్లోకి ప్రవేశించిన స్వీడన్కు చెందిన ప్రముఖ వాణిజ్య వాహనాల తయారీ కంపెనీ 'స్కానియా' ఇక తమ బస్సులను భారత్లోనే ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది. స్కానియా భారత మార్కెట్లో తమ మెట్రోలింక్ రేంజ్ బస్సులను విక్రయిస్తోంది. ప్రస్తుతం ఈ బస్సులను మలేషియాలో తయారు చేసి, ఇండియాకు దిగుమతి చేసుకొని విక్రయిస్తున్నారు.
ఇది కూడా చదవండి: వోల్వో బస్సుల్లో ప్రయాణిస్తున్నారా..? అయితే వీటి గురించి తెలుసుకోండి
కాగా.. వచ్చే ఆగస్ట్ నుంచి ఈ బస్సులను ఇండియాలోనే అసెంబ్లింగ్ చేయాలని స్కానియా నిర్ణయించింది. ఈ మేరకు బెంగుళూరుకు సమీపంలో రూ.300 కోట్ల పెట్టుబడితో కంపెనీ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించింది. ఈ ప్లాంట్ నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చింది. వచ్చే నెల నుంచే ఈ ప్లాంట్లో ఉత్పత్తి ప్రారంభిస్తామని స్కానియా పేర్కొంది. స్కానియా బస్సులను స్థానికంగా ఉత్పత్తి చేయటం వలన వాటి ధరలు కూడా దిగొచ్చే ఆస్కారం ఉంది.
చెన్నైకి చెందిన పర్వీన్ ట్రావెల్స్ మొట్టమొదటి స్కానియా మెట్రోలింక్ బస్సును కొనుగోలు చేసింది. స్కానియా మెట్రోలింక్ బస్సు ఫొటోలను మరియు ఆ బస్సుకు సంబంధించిన మరింత సమాచారాన్ని ఈ కథనంలో తెలుసుకోండి.
మరింత
సమాచారం
తర్వాతి
సెక్షన్లో..
మరిన్ని
వివరాలను
ఈ
ఫొటో
ఫీచర్లో
పరిశీలించండి..!
తర్వాతి స్లైడ్లలో స్కానియా మెట్రోలింక్ బస్సులకు సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకోండి.
స్కానియా మెట్రోలింక్ కోచ్ను భారతీయ పరిస్థితులకు అనుగుణంగా, ప్రయాణికుల భద్రతే ప్రధాన లక్ష్యంగా చేసుకుని అల్ట్రా లగ్జరీ ఫీచర్స్, కంఫర్ట్, సేఫ్టీ సదుపాయాలతో వీటిని తయారు చేశారు.
ప్రయాణికులకు స్కానియా బస్సులో ప్రయాణం సౌకర్యవంతమైన మరియు విలాసవంతమైన ప్రయాణ అనుభూతిని కల్పిస్తుందని కంపెనీ పేర్కొంది.
మాడ్యూల్స్ అండ్ మాడ్యులర్ బాడీవర్క్ ఛాస్సిస్ సిస్టమ్ ఆధారంగా చేసుకొని తయారు చేసిన మెట్రోలింక్ బస్సులు టూ-యాక్సిల్, 3-యాక్సిల్ రూపంలో 45, 49, 53 ప్యాసింజర్ సీట్స్ కెపాసిటీతో మూడు మోడళ్లలో లభ్యమవుతున్నాయి.
స్కానియా మెట్రోలింక్ బస్సులలో ఆరు ఎమర్జెన్సీ డోర్లు, మోనిటర్ డ్రైవర్ మూవ్మెంట్స్, ప్రయాణికుల కోసం సేఫ్టీ వీడియోలు మొదలైన ఫీచర్లుంటాయి.
స్కానియా విడుదల చేసిన మెట్రోలింక్ హెచ్డి 45-సీటర్ బస్సు 12 మీటర్ల పొడవును కలిగి ఉండి 2+2 సీట్లను కలిగి ఉంటుంది. ఇందులో 9-లీటర్, 314పిఎస్, యూరో3 ఇంజన్ను అమర్చారు. ఈ బస్సుకు తరచూ గేర్లు మార్చాల్సిన అవసరం లేదు. ఇందులో 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్ను ఉపయోగించారు.
ఇకపోతే మెట్రోలింక్ హెచ్డి 49-సీటర్ బస్సు 13.7 మీటర్ల పొడవును కలిగి ఉండి 49 సెమీ-స్లీపర్ సీట్లను కలిగి ఉంటుంది. ఇందులో పవర్ఫుల్ 13-లీటర్, 365 పిఎస్ ఇంజన్ను అమర్చారు. ఈ ఇంజన్ను స్కానియా ఆప్టిక్రూయిజ్ 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్తో జతచేయబడి ఉంటుంది.
మెట్రోలింక్ హెచ్డి 45-సీటర్ బస్సు 14.5 మీటర్ల పొడవును కలిగి ఉండి, 53 సెమీ-స్లీపర్ సీట్లను కలిగి ఉంటుంది. ఇందులో 8-లీటర్ 416 పిఎస్ ఇంజన్ను అమర్చారు. ఇది కూడా 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్తో జతచేయబడి ఉంటుంది.
వోల్వో, మెర్సిడెస్ బెంజ్, టాటా మోటార్స్, అశోక్ లేలాండ్ వంటి సంస్థలకు స్కానియా గట్టి పోటీ ఇవ్వనుంది.