నానో ప్లాంట్ను తాత్కాలికంగా మూసివేయనున్న టాటా
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ఇటీవలే తమ నానోను అప్గ్రేడ్ చేసి పవర్ స్టీరింగ్తో పాటుగా మరికొన్ని స్మార్ట్ ఫీచర్లను జోడించి ఈ చవక కారును స్మార్ట్ సిటీ కారుగా నానో ట్విస్ట్ పేరుతో విడుదల చేసిన సంగతి తెలిసినదే. ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న రెగ్యులర్ నానోతో పాటుగానే ఈ నానో ట్విస్ట్ను కూడా ఆఫర్ చేస్తున్నారు.
టాటా నానో మరియు టాటా నానో ట్విస్ట్ రెండు వేరియంట్లను కూడా కంపెనీ గుజరాత్లోని సనంద్ ప్లాంట్లో ఉత్పత్తి చేస్తుంది. అయితే, కంపెనీ ప్రస్తుతం ఈ ప్లాంట్ను కొద్దిరోజుల పాటు మూసివేసి, ఉత్పత్తి నిలిపివేయాలని నిర్ణయించుకుంది. టాటా నానో మోడల్కు డిమాండ్ తక్కువగా ఉండటం, ఇప్పటికే స్టాక్ అధికంగా ఉండటంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.

అయితే, రానున్న పండుగ సీజన్ నాటికి టాటా నానో డిమాండ్ పెరిగే అవకాశం ఉండటంతో, అప్పటికీ ఉత్పత్తిని తిరిగి ప్రారంభించాలని కంపెనీ నిర్ణయించుకుంది. దాదాపు 30-40 రోజుల పాటు ఈ ప్లాంట్లో నానో ఉత్పత్తిని నిలిపివేయనున్నారు. మరోవైపు టాటా మోటార్స్ కైట్ కోడ్నేమ్తో ఓ కొత్త కాంపాక్ట్ కారును అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసినదే.
టాటా కైట్ హ్యాచ్బ్యాక్ కారును కూడా గుజరాత్లోని సనంద్ ప్లాంట్లోనే ఉత్పత్తి చేయనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో, టాటా కైట్ ఉత్పత్తి కోసం గుజరాత్ సనంద్ ప్లాంట్లో మార్పులు చేర్పులు చేసేందుకే నానో ఉత్పత్తిని షట్డౌన్ చేశారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ, టాటా నానో కొనుగోలుదారులను ఆకట్టుకోవటంలో దాదాపుగా విఫలమైందనే చెప్పాలి.


Click it and Unblock the Notifications








