Just In
- 2 hrs ago కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- 3 hrs ago మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- 17 hrs ago వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- 20 hrs ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
Don't Miss
- News ఏపీ, తెలంగాణలో అత్యంత ధనవంతురాలు ఆమే
- Finance Elon Musk: ఎలోన్ మస్క్ పర్యటన వాయిదా..ఎందుకంటే..!
- Movies ‘సీరియల్స్లో తెలుగు వాళ్లను నీచంగా.. కన్నడ యాక్టర్ల ముందు పని వాళ్లకంటే హీనంగా’
- Sports T20 World Cup: రింకూకు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. అతని కోసమే వేటు?
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
వెహికల్ సేఫ్టీ పరంగా మరో కీలకమైన నిర్ణయం తీసుకున్న కేంద్రం
అన్ని కార్లు మరియు బస్సుల్లో యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్) కల్పించాలని కేంద్ర నిర్ణయం తీసుకుంది. గడువు ముగిసేలోపు ఆ యా వాహన తయారీ సంస్థలు తమ కార్లు మరియు బస్సుల్లో ఏబిఎస్ను అందించాల్సి ఉంటుంది
చిత్తడి
మరియు
జారుడు
స్వభావం
ఉన్న
రహదారుల
మీద
బ్రేకులు
వేసినప్పుడు
వాహనాలు
ఓ
పట్టాన
ఆగవు.
తద్వారా
అదుపు
తప్పి
ప్రమాదానికి
గురయ్యే
అవకాశం
ఉంది.
అయితే
దీనిని
నియంత్రించేందుకు
ఆటోమొబైల్
రంగంలో
వచ్చిన
విప్లవాత్మకమైన
ఆవిష్కరణ
ఏబిఎస్.
ఇప్పుడు
దేశీయంగా
విడుదలయ్యే
అన్ని
కార్లలో
మరియు
బస్సుల్లో
ఈ
ఏబిఎస్
పరిజ్ఞానాన్ని
తప్పనిసరి
చేస్తూ
ప్రభుత్వం
నిర్ణయం
తీసుకుంది.
దేశీయ మరియు అంతర్జాతీయంగా నిర్వహించిన అధ్యయనం ప్రకారం యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ద్వారా వాహన ప్రమాద రేటును చాలా తగ్గించవచ్చని తేలింది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఇక మీదట విడుదలయ్యే అన్ని వాహనాల్లో ఏబిఎస్ తప్పనిసరి చేస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
2019 ఏప్రిల్ నాటికి అన్ని వాహనాల్లో ఏబిఎస్ తప్పనిసరిగా అందించాలని గడువు కూడా విధించింది. గడువు లోపు వాహన తయారీ సంస్థలు తమ కార్లు మరియు బస్సుల్లో ఏబిస్ ను స్టాండర్డ్ ఫీచర్గా తప్పనిసరిగా అందించాల్సి ఉంటుంది.
జారుడు, చిత్తడి మరియు పల్లపు ప్రదేశాల్లో బ్రేకులు వేసినప్పటికీ టైర్లు జారుతూ వాహనం ముందుకు వెళుతుటుంది. దీనిని బ్రేకులు లాక్ లేదా స్కిడ్ అవ్వటం అని చెప్పవచ్చు. అయితే ఓ అధ్యయం ప్రకారం ఏబిఎస్ ఫీచర్ ఉండటం ద్వారా 20 శాతం వరకు ప్రమాదాలను అరికట్టవచ్చని తేలింది.
రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ వెలువరించిన నోటిఫికేషన్ ప్రకారం, అన్ని కొత్త మోడళ్లు ఏప్రిల్ 2018 నాటికి యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ను కలిగి ఉండాలని తెలిసింది.
అన్ని కొత్త మోడళ్లు మరియు అప్పటికే ఉన్న మోడళ్లలో కూడా సంభందిత వాహన తయారీ సంస్థలు ఏప్రిల్ 2019 లోపు యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ను అందించే దిశగా చర్యలు తీసుకోవాలని నోటిఫికేషన్లో వెల్లడించడం జరిగింది.
ఇప్పటి వరకు దాదాపు అన్ని కార్ల తయారీ సంస్థలు యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్ను ఆప్షనల్గా మాత్రమే అందిస్తున్నాయి. ఎలాంటి బేస్ వేరియంట్ తీసుకున్నా అందులో ఏబిఎస్ ఉండదు. ఏదేమైనప్పటికీ ఏప్రిల్ 2019 నుండి ఈ ఫీచర్ను స్టాండర్డ్గా పొందవచ్చు.
టాటా హెక్సా ఎస్యూవీ ఫోటోల కోసం క్రింది గ్యాలరీ మీద క్లిక్ చేయండి....