Just In
- 1 hr ago
సన్నీలియోన్ భర్త కార్ నెంబర్ ఉపయోగిస్తూ పట్టుబడ్డ వ్యక్తి, పోలీసులకు ఏం చెప్పాడంటే?
- 1 hr ago
బిఎమ్డబ్ల్యూ ఆర్ నైన్టి మరియు ఆర్ నైన్టి స్క్రాంబ్లర్ బైక్స్ విడుదల; ధరలు
- 2 hrs ago
భారత్కు ఫోక్స్వ్యాగన్ ఆర్టియాన్ వస్తోంది.. ధర తలచుకుంటేనే షాక్..!
- 2 hrs ago
కార్ టైర్ మారుస్తూ కనిపించిన డిప్యూటీ కమిషనర్ రోహిణి సింధూరి [వీడియో]
Don't Miss
- Sports
India vs England: 'టీమిండియాలో ఎందుకు లేవని ప్రశ్నించేవాళ్లు.. ఆ మాటలు నిత్యం గుర్తుకొచ్చేవి'
- News
ప్రముఖ రచయిత వేల్చేరు నారాయణరావుకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం...
- Finance
ఏడాదిన్నరలో రూపాయి దారుణ పతనం, ఏకంగా 104 పైసలు డౌన్
- Movies
డెలివరీ సమయంలో అలాంటి పరిస్థితి.. కన్నీరు పెట్టించిన మధుమిత-శివ బాలాజీ
- Lifestyle
అందమైన మెరిసే జుట్టు పొందాలనుకుంటున్నారా? కాబట్టి ఈ ఆహారాలలో కొంచెం ఎక్కువ తినండి ...
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పెట్రోల్ బంకుల్లో జరిగే మోసాలకు చెక్ పెట్టాలంటే, ఇలా చేయండి
భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఈ క్రమంలో పెట్రోల్ మరియు డీజిల్ వంటి ఇంధనాలకు డిమాండ్ ఎక్కువవుతోంది. ఈ నేపథ్యంలో అనేక కొత్త పెట్రోల్ బంకులు నెలకొల్పబడుతున్నాయి. అంతే కాదు ఈ పెట్రోల్ బంకుల్లో చాలా మోసాలు కూడా జరుగుతున్నాయి.

వాహనదారులు పెట్రోల్ బంకుల్లో మోసపోయిన చాలా సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. పెట్రోల్ బంకర్లలో కస్టమర్లదగ్గర నుంచి ఎక్కువ డబ్బు కోసం ఈ విధమైన మోసాలు చేస్తున్నారు. వాహనదారుడు చెప్పిన దానికంటే తక్కువ ఇంధనాన్ని నింపుతూ వాహనదారులను ఎక్కువగా మోసం చేస్తున్నారు.

కస్టమర్లను మోసం చేయడానికి పెట్రోల్ బంక్ సిబ్బంది ఇలాంటి అనేక కిటుకులను ప్రదర్శిస్తున్నారు. ఈ విధంగా పెట్రోల్ బంకుల్లో మోసపోకుండా ఉండటానికి ఈ కొన్ని నియమాలను పాటిస్తే తప్పకుండా మోసపోయే అవకాశం ఉండదు. పెట్రోల్ బంకుల్లో మోసాలను నివారించే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుసుకుందాం..
MOST READ:ఒకప్పుడు చరిత్ర సృష్టించిన జాగ్వార్ సి-టైప్, మళ్ళీ రానుందా..?

పెట్రోల్ బంకులోని ఫ్యూయెల్ మీటర్ శ్రద్దగా గమనించండి :
ఇంధనం కోసం పెట్రోల్ బంకర్కు వెళ్లేటప్పుడు ముందుగా ఫ్యూయెల్ మీటర్ టెస్ట్ చేయాలి. ఫ్యూయెల్ మీటర్లో పెట్రోల్ లేదా డీజిల్ రీడింగ్ సున్న వద్ద ఉన్నప్పుడే ఇంధనమ్ నింపుకోవాలి. రీడింగ్ సున్నా వద్ద లేకపోతే, రీడింగ్ సున్నాకి సెట్ చేయమని చెప్పండి. పెట్రోల్ నింపుకునేటప్పుడు రీడింగ్ పెరగకపోతే, మిమ్మల్ని మోసం చేస్తున్నారని అర్థం.

పెట్రోల్ బంకులో ఈ మోసాన్ని గమనించిన వెంటనే మేనేజర్ కి కంప్లైంట్ చేయండి, లేకుంటే హెల్పింగ్ ఆయిల్ కంపెనీ హెల్ప్లైన్కు కాల్ చేసి సమాచారం అందించండి. ఈ విధంగా చేస్తే అక్కడ సిబ్బంది మళ్ళీ ఇటువంటి చర్యకు పాల్పడే అవకాశం ఉండదు. అంతే కాకుండా మీ తరువాత వారికి కూడా చాలా మేలు చేసినవారు అవుతారు.
MOST READ:కొత్త టాటా సఫారి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ వచ్చేసింది.. ఓ లుక్కేసెయ్యండి

రౌండ్ ఫిగర్ తో పెట్రోల్ తీసుకోవడం మానుకోవాలి :
ఎక్కువగా వాహనదారులు పెట్రోల్ మరియు డీజిల్ పొందాలనుకునే వారు పెట్రోల్ బంకర్ లో ఎక్కువగా రౌండ్ ఫిగర్లో నింపుకుంటారు. అంటే 100 రూపాయలు, 200 రూపాయలు లేదా 500 రూపాయలకు పెట్రోల్, డీజిల్ నింపుకోవడం అన్న మాట. ఈ విధంగా రౌండ్ ఫిగర్ తో పెట్రోల్ లేదా డీజిల్ నింపుకుంటే వారు తక్కువ ఇంధనాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఈ మోసాన్ని నివారించడానికి లీటర్లలో ఇంధనం నింపుకోవడం మంచిది.

రిమోట్ కంట్రోల్ చిప్ మోసానికి కారణమవుతుంది:
పెట్రోల్ బంక్ యజమానులు రిమోట్-కంట్రోల్డ్ పరికరం నుండి పంపు యొక్క ఫ్యూయెల్ మీటర్ను తరచుగా ఉపయోగిస్తారు. ఇది పెట్రోల్ మరియు డీజిల్ ప్రవాహం రేటును తగ్గిస్తుంది. రిమోట్ కంట్రోల్-ఆపరేటెడ్ చిప్ ఉన్న పెట్రోల్ బంకర్లను కనీసం ఇంధన ప్రవాహాన్ని నిర్ధారించడానికి అనేకసార్లు తనిఖీ చేసి ప్రాసెస్ చేశారు.
MOST READ:టాటా నెక్సాన్ లోపల బెడ్రూమ్.. ఇదేంటనుకుంటున్నారా.. అయితే ఇది చూడండి

వాహనదారులను మరియు ఇన్స్పెక్టర్లను మోసం చేయడానికి కొన్నిసార్లు మీటర్లు కూడా వక్రీకరించబడతాయి. కావున ఇటువంటి వాటిలో ఎక్కువ మోసం జరిగే అవకాశం ఉంటుంది. వాహనదారులు దీనిని కూడా దృష్టిలో ఉంచుకోవాలి.

పెట్రోల్ డీలర్ను ట్రాక్ చేయండి :
పెట్రోల్ బంకులో పెట్రోల్, డీజిల్ వేసేటప్పుడు డీలర్పై ఓ కన్నేసి ఉంచాలి. పెట్రోల్ పంపులు అప్పుడప్పుడు మూసివేయబడి ఉంటాయి. అలా కాకుంటే కొన్ని సార్లు పెట్రోల్ పైపును తొలగించి ఉంటారు. ఇది పెట్రోల్ పైపు ద్వారా ఇంధన ప్రవాహాన్ని తగ్గిస్తుంది. కానీ మీటర్ నడుస్తోంది. మీరు ఈ రకమైన మోసాన్ని గమనించినట్లయితే వెంటనే సంబంధిత అధికారులకు కంప్లైంట్ చేయాలి.

పెట్రోల్ బంకుల్లో జరిగే మోసాలను నివారించడానికి ఈ కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి. అపుడే మోసాలను కొంతవరకు నివారించగలము. ఇటీవల బెంగళూరులో పెట్రోల్ బ్యాంకులో జరిగిన ఘరానా మోసం గురించి దాదాపు అందరికి తెలిసి ఉంటుంది. కావున వాహనదారులు.. బి అలెర్ట్..