రైలులో ఒంటరి ప్రయాణాల్లో మీ లగేజీ జాగ్రత్త.. ఈ టిప్స్ పాటించండి, లేదంటే క్షణాల్లో చోరీ.!!
భారత్లో రైలు ప్రయాణాలు చాలా ఎక్కువగా చేస్తుంటారు. త్వరితగతిన గమ్యస్థానాలకు చేర్చడం, తక్కువ ఛార్జీలు ఉండటంతో చాలా మంది ట్రైన్ జర్నీస్కి ప్రాధాన్యత ఇస్తారు. అయితే కొంతమంది వ్యక్తిగత అవసరాలు, ఉద్యోగ రీత్యా ఒంటరిగా ప్రయాణిస్తుంటారు. ఇలా ప్రయాణించేటప్పుడు లగేజీ కారణంగా రైలులో టాయిలెట్ను ఉపయోగించుకోలేకపోతుంటారు. వారి కోసమే ఈ కథనం..
రైలు ప్రయాణంలో ఒంటరిగా ప్రయాణించేవారు టాయిలెట్కు వెళ్లేందుకు వెనుకాడుతుంటారు. తమ లగేజీని ఎవరైనా దొంగిలిస్తే ఏం చేయాలో తెలియక తికమకపడటమే ఇందుకు ప్రధాన కారణం. అయితే ఇలాంటి సమయాల్లో లగేజీ చోరీకి గురికాకుండా టాయిలెట్ని ఎలా ఉపయోగించుకోవచ్చో ఇక్కడ కొన్ని ఐడియాలు ఇస్తున్నాం..

భారత్లో రైల్వే అతిపెద్ద రవాణా రంగం. ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తుంటారు. అయితే ముందుగా బుక్ చేసుకున్న కోచ్(Train Journeys)ల్లో ప్రయాణికులు ఎక్కువగా జర్నీ చేస్తుంటారు. ఫ్యామిలీస్, ఫ్రెండ్స్తో పాటు ఒంటరిగా ప్రయాణించే వారు కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటున్నారు.
ఈ క్రమంలో రైళ్లలో ఒంటరిగా ప్రయాణించే ప్రయాణికులు టాయిలెట్లు వాడేందుకు ఇబ్బంది పడుతుంటారు. దీనికి ప్రధాన కారణం వారు తెచ్చే లగేజీ, ఈ లగేజీతో టాయిలెట్(Train Toilet)కు వెళ్లలేరు. అదే సమయంలో లగేజీతో వెళ్లినా.. తిరిగి వచ్చేసరికి చోరీకి గురయ్యే అవకాశం ఉండటంతో.. దీంతో చాలా మంది మరుగుదొడ్లు ఉపయోగించుకోలేకపోతుంటారు.

మీరు అలాంటి పరిస్థితిలో చిక్కుకున్నట్లయితే, మీరు కొన్ని ఐడియాలు(Train Journey Tricks) ఉపయోగించి టాయిలెట్ని సులభంగా వినియోగించుకోవచ్చు. ఒంటరిగా ప్రయాణించే ప్రయాణికులకు రైళ్లలో చోరీ భయం ఎప్పుడూ ఉండేదే. ఇది ఒక వైపు అయితే, మరొక వైపు ఈ సమస్య నుంచి బయటపడటానికి కొన్ని మార్గాలున్నాయి.
స్టేషన్లో రైలు ఆగి ఉన్న సమయంలో టాయిలెట్ను ఉపయోగించడం కంటే రైలు కదులుతున్నప్పుడు టాయిలెట్ను వినియోగించుకోవడం బెస్ట్ ఐడియా. అలాంటి సమయాల్లో మీ బ్యాగును చోరీ చేసిన వారు రైలు నుంచి తప్పించుకోలేరు(Robbery In Trains). కాబట్టి ఈ సమయంలో మీరు టాయిలెట్కు వెళ్లడం సురక్షితం.

రైల్వే స్టేషన్లో రైలు ఆగినప్పుడు దొంగలు తరచూ వస్తువులను దొంగిలించి, వెంటనే స్టేషన్ను వదిలివేసే అవకాశాలు ఉంటాయి. రైలు వేగంగా నడిచే పరిస్థితిలో రైలు తప్ప వేరే చోటు లేకపోవడంతో వీళ్లు దొంగతనాలు చేయలేరు. తద్వారా మీరు టాయిలెట్కు వెళ్లినా మీ బ్యాగు సురక్షితంగా ఉంటుంది.
మీరు రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు అప్పర్ బెర్త్లోని విండో సీటు దగ్గర లగేజీని వదిలేస్తే, దొంగలు మీ బే గుండా వచ్చి అప్పర్ బెర్త్లో మీ లగేజీని తీసుకెళ్లడానికి సాధ్యం కాదు. అయితే అన్ని ఇతర బెర్త్ల వద్ద వారు వాక్వే నుండి చేరుకుని లగేజీని కొట్టేయొచ్చు. కానీ అప్పర్ బెర్త్లో ఉంచిన సామానును వారు కిటికీ నుంచి దొంగిలించలేరు.

ఈ విధంగా మీరు మీ లగేజీని అప్పర్బెర్త్లో ఉంచి టాయిలెట్కు వెళ్ళవచ్చు. కాబట్టి మీరు ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు అప్పర్ బెర్త్ నుంచి టికెట్ బుక్ చేసుకోడం నుంచి మంచి ఐడియా. దీని ద్వారా మీ లగేజీని దొంగలు చోరీ చేయలేరు. సురక్షితంగా మీరు ప్రయాణం చేయవచ్చు.
ఇది మాత్రమే కాదు, రైలు నెమ్మదిగా కదులుతున్నప్పుడు మరియు రైలు ఆగిపోయినప్పుడు, మీరు ఏ కారణం చేతనైనా మీ లగేజీని వదిలి వెళ్లకూడదని గుర్తుంచుకోవాలి. ఆ సమయంలోనే దొంగతనాలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయి. భారత్లో అత్యధికంగా దోపిడీలు రైలు ఆగిపోయి ఉన్నప్పుడే జరుగుతుంటాయి. కాబట్టి మీరు రైలులో ఒంటరిగా ప్రయాణించేటప్పుడు ఈ ట్రిక్స్ పాటించండి.


Click it and Unblock the Notifications








