Just In
- 12 hrs ago గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- 14 hrs ago 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- 16 hrs ago జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- 18 hrs ago జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
Don't Miss
- Movies Karthika Deepam 2 నా బిడ్డకు దూరంగా ఉండు.. కార్తీక్కు దీప షాక్
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఎలక్ట్రిక్ వాహనాన్ని డ్రైవ్ చేసిన మైనర్ బాలుడు.. తర్వాత ఏం జరిగిందో తెలుసా ?
భారతదేశంలో పిల్లలు పెద్దలు కావడానికి ముందే వారికీ వాహనాలను అప్పగించి పెద్దవాళ్ళ ధోరణిలో పెంచుతున్నారు. ఈ ధోరణి రోడ్డు ప్రమాదాలకు దారితీస్తోంది. భారతదేశంలో డ్రైవింగ్ లైసెన్స్ పొందే కనీస వయస్సు 18 సంవత్సరాలు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మీరు వాహనాన్ని నడపకూడదు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడపడం చట్టవిరుద్ధం.
ఇటీవల 10 ఏళ్ల బాలురు కారు, బైక్ నడుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. దీనివల్ల కొన్ని ప్రమాదాలు జరిగాయి. మైనర్లకు వాహనాలను అందించే తల్లిదండ్రులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. పోలీసులు జరిమానా విధించడంతో పాటు, జైలు శిక్ష కూడా ఇస్తున్నారు. పోలీసు అధికారులు ఏమి చేసినా, మైనర్లు చుట్టూ తిరిగే సందర్భాలు చాలానే వెలుగులోకి వచ్చాయి.
ఇటీవలే తమిళనాడులోని పుదుక్కొట్టైలో ఇలాంటి సంఘటన మళ్ళీ కనిపించింది. పుదుక్కోట్టై మునిసిపల్ వార్డులలో చెత్త సేకరణ కోసం ఎలక్ట్రిక్ త్రీ వీలర్లను ఉపయోగిస్తారు. ఈ వాహనాలతో ప్రతిరోజూ చెత్తను సేకరించి ట్రాష్ డిపోకు తీసుకువెళతారు.
MOST READ:6,413 టాటా ఏస్ వాహనాలను కొనుగోలు చేయనున్న జగన్ ప్రభుత్వం.. ఎందుకో తెలుసా?
పుదుక్కొట్టై మునిసిపల్ వార్డులలో చెత్తను సేకరించడానికి పీటర్ కి ఎలక్ట్రిక్ త్రీ వీలర్ బ్యాటరీ వాహనాన్ని అందించారు. అయితే 13 ఏళ్ల బాలుడిని వాహనం నడపడానికి పీటర్ అనుమతించినట్లు తెలిసింది.
బాలుడు పీటర్ యొక్క కజిన్ మరియు అతని ఇద్దరు స్నేహితులతో కలిసి త్రీ వీలర్ నడుపుతున్నాడు. అతను వాహనాన్ని నడుపుతున్నట్లు తెలిపారు. ఈ కారణంగా, మునిసిపల్ అధికారులు ఎలక్ట్రిక్ త్రీ వీలర్లను క్లీనర్లే తప్ప మరెవరూ నడపకూడదని ఆదేశించారు.
MOST READ:మీకు తెలుసా.. భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరగటానికి ప్రధాన కారణం ఇదే
చెత్త సేకరించడానికి పీటర్ బాలుడిని పంపినట్లు చెబుతారు. ఇది చెత్త సేకరణ కోసం బాలలను ఉపయోగిస్తున్నారా అని ప్రజలకు అనుమానం కలిగిస్తుంది. దీని సంబంధించిన కథనాన్ని పుతియథలైమురై నివేదించింది.
మైనర్లను డ్రైవింగ్ చేయకుండా ఆపడానికి పోలీసులు వివిధ చర్యలు తీసుకుంటున్నందున పుదుక్కొట్టైలో జరిగిన సంఘటన ఆందోళనకరంగా ఉంది. మైనర్లకు వాహనాలు నడపడానికి తగినంత అనుభవం లేదు. ట్రాఫిక్ నిబంధనల గురించి కూడా తెలియదు. ఇవి ప్రమాదాలకు దారితీస్తాయి. ఏది ఏమైనా వాహనాలను మైనర్లు నడపడం చట్టవిరుద్ధం. ఇది ఎక్కువ ప్రమాదాలకు దారి తీస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని పిల్లకు వాహనాలను ఇవ్వకుండా పెద్దలు జాగ్రత్తపడాలి.
MOST READ:తాత కోసం బాలుడు చేసిన అద్భుత సృష్టి.. నిజంగా ఇది సూపర్ వెహికల్.. అదేంటో చూసారా ?