Just In
Don't Miss
- News
దుస్తులు విప్పి చూపించాలని... ఆన్లైన్ క్లాసుల పేరుతో హెడ్ మాస్టర్ లైంగిక వేధింపులు...
- Finance
పేపాల్ గుడ్న్యూస్, వెయ్యి ఇంజీనీర్ ఉద్యోగులు: హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో ఛాన్స్
- Movies
ప్రియాంక చోప్రా నాకు దూరంగా.. ప్రపంచం తలకిందులైనట్టుగా.. నిక్ జోనస్ షాకింగ్ కామెంట్
- Sports
మ్యాక్సీనా మజాకానా.. సిక్స్ కొడితే సీటుకే బొక్క!
- Lifestyle
బెడ్ రూమ్ లో ఈ లోదుస్తులుంటే... రొమాన్స్ లో ఈజీగా రెచ్చిపోవచ్చని తెలుసా...
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఎలక్ట్రిక్ వాహనాన్ని డ్రైవ్ చేసిన మైనర్ బాలుడు.. తర్వాత ఏం జరిగిందో తెలుసా ?
భారతదేశంలో పిల్లలు పెద్దలు కావడానికి ముందే వారికీ వాహనాలను అప్పగించి పెద్దవాళ్ళ ధోరణిలో పెంచుతున్నారు. ఈ ధోరణి రోడ్డు ప్రమాదాలకు దారితీస్తోంది. భారతదేశంలో డ్రైవింగ్ లైసెన్స్ పొందే కనీస వయస్సు 18 సంవత్సరాలు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మీరు వాహనాన్ని నడపకూడదు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడపడం చట్టవిరుద్ధం.

ఇటీవల 10 ఏళ్ల బాలురు కారు, బైక్ నడుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. దీనివల్ల కొన్ని ప్రమాదాలు జరిగాయి. మైనర్లకు వాహనాలను అందించే తల్లిదండ్రులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. పోలీసులు జరిమానా విధించడంతో పాటు, జైలు శిక్ష కూడా ఇస్తున్నారు. పోలీసు అధికారులు ఏమి చేసినా, మైనర్లు చుట్టూ తిరిగే సందర్భాలు చాలానే వెలుగులోకి వచ్చాయి.

ఇటీవలే తమిళనాడులోని పుదుక్కొట్టైలో ఇలాంటి సంఘటన మళ్ళీ కనిపించింది. పుదుక్కోట్టై మునిసిపల్ వార్డులలో చెత్త సేకరణ కోసం ఎలక్ట్రిక్ త్రీ వీలర్లను ఉపయోగిస్తారు. ఈ వాహనాలతో ప్రతిరోజూ చెత్తను సేకరించి ట్రాష్ డిపోకు తీసుకువెళతారు.
MOST READ:6,413 టాటా ఏస్ వాహనాలను కొనుగోలు చేయనున్న జగన్ ప్రభుత్వం.. ఎందుకో తెలుసా?

పుదుక్కొట్టై మునిసిపల్ వార్డులలో చెత్తను సేకరించడానికి పీటర్ కి ఎలక్ట్రిక్ త్రీ వీలర్ బ్యాటరీ వాహనాన్ని అందించారు. అయితే 13 ఏళ్ల బాలుడిని వాహనం నడపడానికి పీటర్ అనుమతించినట్లు తెలిసింది.

బాలుడు పీటర్ యొక్క కజిన్ మరియు అతని ఇద్దరు స్నేహితులతో కలిసి త్రీ వీలర్ నడుపుతున్నాడు. అతను వాహనాన్ని నడుపుతున్నట్లు తెలిపారు. ఈ కారణంగా, మునిసిపల్ అధికారులు ఎలక్ట్రిక్ త్రీ వీలర్లను క్లీనర్లే తప్ప మరెవరూ నడపకూడదని ఆదేశించారు.
MOST READ:మీకు తెలుసా.. భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరగటానికి ప్రధాన కారణం ఇదే

చెత్త సేకరించడానికి పీటర్ బాలుడిని పంపినట్లు చెబుతారు. ఇది చెత్త సేకరణ కోసం బాలలను ఉపయోగిస్తున్నారా అని ప్రజలకు అనుమానం కలిగిస్తుంది. దీని సంబంధించిన కథనాన్ని పుతియథలైమురై నివేదించింది.

మైనర్లను డ్రైవింగ్ చేయకుండా ఆపడానికి పోలీసులు వివిధ చర్యలు తీసుకుంటున్నందున పుదుక్కొట్టైలో జరిగిన సంఘటన ఆందోళనకరంగా ఉంది. మైనర్లకు వాహనాలు నడపడానికి తగినంత అనుభవం లేదు. ట్రాఫిక్ నిబంధనల గురించి కూడా తెలియదు. ఇవి ప్రమాదాలకు దారితీస్తాయి. ఏది ఏమైనా వాహనాలను మైనర్లు నడపడం చట్టవిరుద్ధం. ఇది ఎక్కువ ప్రమాదాలకు దారి తీస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని పిల్లకు వాహనాలను ఇవ్వకుండా పెద్దలు జాగ్రత్తపడాలి.
MOST READ:తాత కోసం బాలుడు చేసిన అద్భుత సృష్టి.. నిజంగా ఇది సూపర్ వెహికల్.. అదేంటో చూసారా ?