ఒక్క కారులో 20 మంది ప్రయాణం: భారత్లో మాత్రమే ఇలా జరుగుతుంది.
అసాద్యం సుసాద్యం చేయాలన్నా, సుసాధ్యాన్ని అసాధ్యం చేయాలన్నా మన భారతీయులకే చెందుతుంది. ఇదే మరి మన వారి ప్రత్యేక్యత. ఇది ప్రమాదం అంటే చేస్తాం, వద్దు అంటే చేస్తాం. తీరా ఎదయినా ప్రమాదం చోటు చేసుకుంటే భాదపడతాం.
మేం ఎం చెప్పాలనుకుంటున్నామో అర్థం కాలేదు కదా. ఇదంతా ఎందుకు కాని క్రింది కథనంలోకి రండి అసలు మ్యాటరేంటో తెలుస్తుంది.

ఒక కారు నుండి ఏకంగా 20 మంది చిన్నపిల్లలను క్రిందకు దించుతూ ఇలా కెమెరాకు చిక్కాడు ఓ ప్రభుద్దుడు.

ఇతను ఈ పిల్లలందరిని విహారయాత్ర నిమిత్తం గోల్కొండ కోటకు తీసుకు వచ్చాడు. అదే మన గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఉన్న గోల్కొండ కోటకు.

ఈ చోద్యం చూసిన తరువాత వీరు పెద్ద ప్రమాదం నుండి తప్పించుకున్నట్లు కనబడుతోంది కదూ. దురదృష్టవశాత్తు ఏదయినా ప్రమాదం జరిగితే ఒక్కరు కూడా బ్రతికే అవకాశమే లేదు.

పాఠాలు భోదించే గురువులే ఇలా చేస్తే మరి వీరి దగ్గర చదువుకుంటున్న విధ్యార్థులు ఎలా బాగుపడతారు చెప్పండి.

ఇంత మంది విద్యార్థులను తరలిస్తున్న కారును ఏ పోలీస్ అధికారి కూడా వీరిని ఆపి విచారణ చేయకపోవడం మరింతి ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

అయితే ఇలాంటి వారిని ప్రోత్సహించిన వారి మీద కఠిన చర్యలు తీసుకుంటే తప్ప ప్రమాదాలను అరికట్టవచ్చు అని కొందరి అభిప్రాయం.

దీనికి సంభందించిన వీడియో డాక్యుమెంటరిని ఈ కథనం క్రింద భాగాన చూడవచ్చు.

- 2015 సంవత్సరంలో భారతీయులు అత్యధికంగా కొనుగోలు చేసిన టాప్-20 కార్లు.
- భర్త మోసం చేశాడు...! మరి భార్య ఏం చేసింది...!!
- రాజమౌళి ఈగలా పగపట్టిన ఆవు


Click it and Unblock the Notifications








