మోదీ నిర్ణయంతో బిఎమ్డబ్ల్యూ గుండెల్లో గుబులు, అదేంటో తెలుసా ?
చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచదేశాలను గడగడలాడించింది. ఈ కరోనా మహమ్మారి వల్ల ఇప్పటికే చాలామంది ప్రజలు ప్రాణాలను కోల్పోగా, ఎండతో మంది ప్రజలు ఈ వైరస్ భారిన పడ్డారు. భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందటం వల్ల దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించబడింది. భారతదేశంలో లాక్ డౌన్ ప్రకటించి ఇప్పటికే 45 రోజులు పూర్తయింది.

భారతదేశంలో కరోనా లాక్ డౌన్ ప్రకటించడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ బాగా క్షీణించింది. ఈ కారణంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ స్వయం సమృద్ధిగల భారతదేశం కోసం పిలుపునిచ్చారు. దేశ పౌరులు దిగుమతి చేసుకున్న వస్తువులకు బదులుగా స్థానికంగా తయారైన వస్తువులను ఉపయోగించాలని పిలుపునిచ్చారు.

మన ప్రధానమంత్రితో సహా ఇతర ప్రభుత్వ అధికారులు దిగుమతి చేసుకున్న వాహనాలను ఎక్కువ భద్రత కోసం ఉపయోగిస్తున్నారు. నరేంద్ర మోడీ బిఎమ్డబ్ల్యూ 7 సిరీస్ హై సెక్యూరిటీ, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ సెంటినెల్, ఆర్మర్డ్ టయోటా ల్యాండ్ క్రూయిజర్ వంటి కార్లను ఉపయోగిస్తున్నారు. అతను ప్రధాని అయినప్పటి నుండి మహీంద్రా స్కార్పియోకు బదులుగా బిఎమ్డబ్ల్యూ 7-సిరీస్ హై సెక్యూరిటీ కారును ఉపయోగిస్తున్నారు.

మహీంద్రా అండ్ మహీంద్రా సీఈఓ ఆనంద్ మహీంద్రా భారతదేశంలో తయారు చేసిన కార్లను ఉపయోగించాలని కోరుతూ ప్రధానికి లేఖ రాశారు. స్థానిక కార్లను ప్రోత్సహించడానికి భారతదేశంలో తయారు చేసిన కార్లను ఉపయోగించాలని ఆయన ప్రధానికి సూచించారు. ఇక్కడ మనం బిఎమ్డబ్ల్యూ, ల్యాండ్ రోవర్ మరియు టయోటాకు ప్రత్యామ్నాయంగా భారతదేశంలో తయారైన కార్లను గురించి పూర్తిగా తెలుసుకుందాం.

మహీంద్రా స్కార్పియో :
మహీంద్రా స్కార్పియో చాలా సంవత్సరాలుగా దేశీయ మార్కెట్లో ఉంది. ఈ కారును చాలా మంది భారతీయ రాజకీయ నాయకులు ఉపయోగిస్తున్నారు. స్కార్పియో ఆఫ్-రోడింగ్ సామర్థ్యాలకు ప్రసిద్ధి చెందింది. నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ స్కార్పియోను ఉపయోగించారు. నరేంద్ర మోడీ ఉపయోగించిన ఈ కారు అధికారిక వాహనం.

టాటా హారియర్ :
2019 లో విడుదలైన టాటా హారియర్ ఎస్యూవీ 2020 లో అప్డేట్ చేయబడింది. ఈ మిడ్-సైజ్ ఎస్యూవీని కొత్త ఒమేగా-ఆర్క్ ప్లాట్ఫాంపై నిర్మించారు. ఫ్రంట్-వీల్-డ్రైవ్ ఎస్యూవీ యొక్క హారియర్ అనేక ఆధునిక లక్షణాలను కలిగి ఉంది. ఈ ఎస్యూవీలోని 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ 170 బిహెచ్పి పవర్ మరియు 350 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎస్యూవీలో మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ రెండూ ఉన్నాయి.

టాటా హెక్సా :
టాటా ఏరియా కారుకు బదులుగా టాటా మోటార్స్ హెక్సా కారును ఆవిష్కరించింది. ఈ కారు దేశీయ మార్కెట్లో అత్యంత శక్తివంతమైన మరియు సౌకర్యవంతమైన కార్లలో ఒకటి. టాటా మోటార్స్ హెక్సా యొక్క బిఎస్ 6 వెర్షన్ను విడుదల చేయలేదు. త్వరలో బిఎస్ 6 వెర్షన్ను విడుదల చేయాలని మేము భావిస్తున్నారు. పెద్ద క్యాబిన్ ఉన్న హెక్సా, ప్రధానితో సహా ఇతర మంత్రులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది.

మహీంద్రా ఎక్స్యూవీ 500 :
మహీంద్రా ఎక్స్యూవీ 500 ఇప్పటికే చాలా దేశాల్లో విక్రయించబడుతుంది. ఈ కారు దక్షిణాఫ్రికా వంటి అనేక దేశాలలో ప్రసిద్ధ ఎస్యూవీ. ఈ శక్తివంతమైన ఎస్యూవీకి ఏడు సీట్లు ఉన్నాయి. మహీంద్రా ఎక్స్యూవీ 500 లోని డీజిల్ ఇంజన్ 170 బిహెచ్పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

మారుతి సుజుకి సియాజ్ :
మారుతి సుజుకి సియాజ్ చాలా మంది ప్రభుత్వ ఉద్యోగుల అధికారిక వాహనం. ఈ సెడాన్ను ప్రభుత్వ అధికారులు విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. సెడాన్ విభాగంలో ప్రాచుర్యం పొందిన కారు ఈ సియాజ్. ఈ కారు పూర్తిగా భారతదేశంలో తయారైంది మరియు భారత ప్రధానమంత్రి ఉపయోగించే సాయుధ సెడాన్కు ప్రత్యామ్నాయంగా దీనిని తయారు చేశారు.

భారతదేశంలో చాలా మంది అధికారులు పటిష్టమైన వాహనాలను ఉపయోగిస్తున్నారు. వారు ఏ వాహనంలోనైనా ఉన్నత స్థాయి భద్రతలను వ్యవస్థాపించగలరు. దేశ ఆర్ధిక వ్యవస్థను మళ్ళీ సదాహరణ స్థాయికి తీసుకు రావడానికి సాధ్యమైనంత వరకు దేశీయ వస్తువులనే వాడాలి. అప్పుడే దేశ ఆర్ధిక వ్యవస్థ మెరుగుపడుతుంది.


Click it and Unblock the Notifications








