Just In
- 17 min ago త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- 3 hrs ago హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- 4 hrs ago JNCAP క్రాష్ టెస్ట్లో అదరగొట్టిన స్విఫ్ట్.. స్కోర్ ఎంతో తెలుసా?
- 4 hrs ago కొత్త మారుతి స్విఫ్ట్ బుకింగ్ ప్రైస్ ఎంతో తెలుసా? ఇక్కడ చూడండి!
Don't Miss
- News తారకరత్న భార్య బిగ్ ట్విస్ట్ ..ఆ పార్టీకే మద్దతంటూ ప్రకటన
- Finance Jio Financial Services: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫలితాలు..
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Movies నాగార్జున ఇంటికి కోడలుగా రాబోతున్న మరో హీరోయిన్
- Sports ఆర్సీబీ తుది జట్టు అంచనా
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
68 ఏళ్ల వయసులో అందరిని ఆశ్చర్యపరిచిన వృద్ధ మహిళ.. ఇంతకీ ఏం చేసిందో తెలుసా?
భారతదేశంలో కరోనా లాక్ డౌన్ సమయంలో బస్సులు, రైళ్లు, ఆటో, టాక్సీ వంటి ప్రజా రవాణాలు మాత్రమే కాకుండా విమాన సర్వీసులు కూడా నిలిపివేయబడ్డాయి. ఈ సమయంలో ప్రజలు చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అత్యవసర సమయంలో బయటకు వెళ్ళడానికి మాత్రమే ప్రభుత్వం పాస్లు జారీ చేసింది. ఈ సమయంలో చాలా మంది ప్రజలు వేల కిలోమీటర్లు సైక్లింగ్ చేసినట్లు ఇదివరకటి కథనాలతో తెలుసుకున్నాము.
కొందరు కుటుంబ సభ్యుల అనారోగ్యం కారణంగా సైకిళ్లలో ప్రయాణించారు, మరికొందరు లాక్ డౌన్ కారణంగా ఉద్యోగాలు కోల్పోయారు మరియు వారి స్వగ్రామాలకు తిరిగి వెళ్ళడానికి సైక్లింగ్ చేసారు.
కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. దేశంలోని అన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ సాధారణ స్థితికి చేరుకుంది. రైలు, విమాన, ఆటో, టాక్సీలపై పరిమితులు సడలించబడ్డాయి.
రవాణా వ్యవస్థ సాధారణ స్థితికి చేరుకున్నప్పటికీ, ఒక వృద్ధ మహిళ ఇప్పటికీ సైకిల్ పై తన ప్రయాణాని సాగిస్తోంది. ఆమె సైకిల్ ద్వారా 2,200 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నారు.
MOST READ:అశోక్ లేలాండ్ నుంచి రెండు కొత్త వెహికల్స్ లాంచ్ : ధర & ఇతర వివరాలు
ఈ వయసులో సైకిల్పై అంత దూరం వెళ్లడానికి ప్రధాన కారణం ఆమెకి ఉన్న దైవభక్తి. 68 ఏళ్ల వయసైనా ఆమె మహారాష్ట్రకు చెందినది. ఈ బామ్మ జమ్మూ కాశ్మీర్లోని వైష్ణో దేవి ఆలయానికి వెళ్ళడానికి సైక్లింగ్ చేస్తోంది.
రేఖా దేవశంకర్ అనే ఈ సాహసోపేత బామ్మ జూలై 24 న తన సైకిల్ ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆమె ప్రతిరోజూ దాదాపు 40 కి.మీ సైక్లింగ్ చేస్తోంది. వీలైనంత త్వరగా వైష్ణవి దేవి ఆలయానికి చేరుకోవాలని వారు భావిస్తోంది.
MOST READ:కొత్త రైడింగ్ జాకెట్స్ లాంచ్ చేసిన రాయల్ ఎన్ఫీల్డ్, వీటి రేటెంతో తెలుసా ?
రేఖ దేవశంకర్ సైకిల్ రైడ్ యొక్క వీడియోను రతన్ శారదా పోస్ట్ చేశారు. రేఖా దేవపంకర్ తన ప్రయాణం గురించి అక్టోబర్ 19 న ఆమె ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ వీడియో సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో వైరల్ అవుతోంది.
వీడియోలో చెప్పినట్లుగా 68 ఏళ్ల రేఖా దేవశంకర్ ఒంటరిగా వైష్ణవి దేవి ఆలయానికి సైకిల్ ద్వారా ప్రయాణిస్తోంది. ఈ పోస్ట్లో వారు కొరెగావ్ నుండి జమ్మూ కాశ్మీర్కు వెళ్తున్నారని తెలిపారు.
MOST READ:సైకిల్ రిపేర్ షాప్ ఓనర్ తయారుచేసిన ఎలక్ట్రిక్ బైక్.. ఎలా ఉందో చూసారా ?
కొరేగావ్ మహారాష్ట్రలోని ఒక నగరం. వీడియో చూసిన వారందరూ ఈ వృద్ధ మహిళను మెచ్చుకున్నారు. ఆమె ధైర్యానికి మరియు దృఢ నిర్చయానికి కొందరు ప్రశంసించారు. మరికొందరు ఈ వయసులో ఇంత సాహసోపిత చర్యకు పాల్పడిన వృద్ధ మహిళ భద్రత మరియు ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నారు. ఏది ఏమైనా ఈ వయసులో అంత దూరం సైకిల్ పై ప్రయాణించడం అనేది నిజంగా ప్రశంసనీయం.