Just In
- 9 hrs ago గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- 11 hrs ago 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- 13 hrs ago జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- 16 hrs ago జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
Don't Miss
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Movies డైరెక్టర్లకు అమ్మాయిలను సప్లై.. సీనియర్ ఆర్టిస్ట్ చీకటి కోణం వెనుక వాస్తవం అదేనట!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
కరోనా ఎఫెక్ట్; హీరో నిఖిల్కు రెండు చలాన్లు జారీ చేసిన పోలీసులు
భారతదేశంలో కరోనా చాలా ఎక్కువగా వ్యాపిస్తోంది. ఈ మహమ్మారి కారణంగా ఎంతో మంది ప్రజలు మరణించారు. అంతే కాకూండా ఇప్పటికి కూడా చాలామంది ప్రజలు ఈ మహమ్మరి భారిన పడి కొట్టుమిట్టాడుతున్నారు. ప్రస్తుతం దేశంలో తీవ్రంగా ప్రబలుతున్న కరోనా సెకండ్ వేవ్ నివారణకు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కఠినమైన చర్యలు తీసుకుంటున్నాయి.
భారతదేశంలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ కూడా ఉన్నాయి. కరోనా నివారణలో భాగంగా ఈ రెండు రాష్ట్రాల్లో కరోనా లాక్ డౌన్ అమలులో ఉంది. కావున ప్రజలు ఎవరూ బయటకు రాకూడదు అత్యవసర సమయంలో మాత్రమే బయటకు రావడానికి అనుమతించబడుతుంది.
కరోనా లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారు ఎంతటి వారైనా పోలీసులు వారిని కఠినంగా శిక్షిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల తెలంగాణా రాష్ట్రంలో కరోనా అమలులో ఉన్న సమయంలో ప్రముఖ తెలుగు హీరో 'నిఖిల్' రేంజ్ రోవర్ కారు బయటకు వచ్చినట్లు తెలిసింది.
MOST READ:మీకు తెలుసా.. ఈ మారుతి ఆల్టో కారుకి ఎలక్ట్రిక్ సన్రూఫ్ ఉంది.. నమ్మకపోతే వీడియో చూడండి
నివేదికల ప్రకారం హైదరాబాద్లో లాక్డౌన్ నిబంధనలను అతిక్రమించిన సినీనటుడు హీరో నిఖిల్కు చెందిన రేంజ్ రోవర్ కారుకు కూకట్పల్లి ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో నంబర్ ప్లేట్ లేకుండా కారు కనిపించింది. దీంతో వాహనం నడుపుతున్న వ్యక్తిని వివరాలు కోరగా సినీ నటుడు నిఖిల్కు చెందిన కారుగా తెలిసింది.
హీరో నిఖిల్ మొదట హ్యాపీ డేస్ సినిమాలో తెలుగు సినిమా రంగంలో అడుగు పెట్టి తరువాత కాలంలో స్వామి రారా, కార్తికేయ మొదలైన సినిమాలతో మంచి క్రేజ్ దక్కించుకున్నాడు. అయితే ప్రస్తుతం నిఖిల్ టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ మరియు చందూ మొండేటి డైరెక్షన్ లో వస్తున్న కార్తికేయ 2 సినిమాలోనూ, అలాగే సుకుమార్ నిర్మిస్తున్న '18 పేజీస్' సినిమాలోనూ నటిస్తున్నట్లు తెలిసింది.
MOST READ:మహీంద్రా థార్ & ఇసుజు డి-మాక్స్ వి-క్రాస్ మధ్య జరిగిన టగ్ ఆఫ్ వార్; ఇందులో విజేత ఎవరంటే?
హీరో నిఖిల్ ఏ మధ్యనే తన ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే అతని భార్య 'పల్లవి' డాక్టర్ కావడంతో రోగులకు వైద్యపరమైన సలహాలు ఇస్తూ, వాలంటీర్గా పనిచేస్తున్న విషయం అందరికి తెలిసిందే.
దేశంలో ప్రతి రోజు ఒక లక్షకు పైగా కొత్త కరోనా కేసులు వస్తుండటంతో, ఆయా రాష్ట్రాల్లో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలతో లాక్ డౌన్ విధించారు. ఇవన్నీ పోలీసుల పర్యవేక్షణలో ఉన్నాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో అనవరసం బయటకు వచ్చిన వారు ఎంతటి వారైనా వారికీ శిక్ష తప్పడం లేదు. ఇటీవల లాక్ డౌన్ లో బయటకు వచ్చిన ఒక రాజకీయ నాయకుని ఏకంగా 11,000 రూపాయలు జరిమానా విధించినట్లు తెలిసింది.
MOST READ:తండ్రికి నచ్చిన బైక్ గిఫ్ట్గా ఇచ్చిన తనయుడు.. వాహ్ సూపర్
Source: Sakshi