Just In
- 8 hrs ago వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- 11 hrs ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- 13 hrs ago కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- 17 hrs ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
Don't Miss
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Movies Paarijatha Parvam Review సునీల్, చైతన్య రావు క్రైమ్ కామెడీ ఎలా ఉందంటే? పారిజాత పర్వం రివ్యూ
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
భాగ్యనగరంలో సైకిల్పై కనిపించిన సోనూసూద్ [వీడియో]
'సోనూసూద్' ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా దాదాపు అందరికి సుపరిచయమే, కరోనా మహమ్మరి గత సంవత్సరం ప్రరపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రాణాలు తీయడమే కాకూండా ఎంతోమంది ప్రజల జీవితాలను అల్లకల్లోలం చేసింది. ఈ నేపథ్యంలో భాగంగా అన్ని దేశాలతో పాటు భారతదేశంలో కూడా కరోనా నివారణకు లాక్ డౌన్ విధించబడింది.
కరోనా లాక్ డౌన్ సమయంలో దాదాపు అన్ని వాహన సదుపాయాలు నిలిచిపోయాయి. ఈ కారణంగా ఎంతోమంది పేద ప్రజలు సుదూర ప్రాంతాలలో చిక్కుకుని స్వస్థలాలకు రావడానికి చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇంకొంతమంది ప్రజలు తమ స్వగ్రామాలకు వేళా కిలోమీటర్లు కాలినడకన బయలుదేరి చేరుకున్నారు. ఇలాంటి సంఘటనలు చూసి చలించిపోయిన ప్రముఖ సినీ నటుడు సోనూసూద్ ఎతోమంది పాలిట దేవుడిగా నిలిచాడు.
సినిమాల్లో విలన్ గా నటించిన సోనూసూద్ నిత్యజీవితంలో రియల్ హీరోగా నిలిచాడు. సోనూసూద్ ఇప్పుడు చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే, అయితే ఇటీవల కాలంలో సోనూ హైదరాబాద్ నగరంలో చాల సింపుల్ గా సైకిల్ పై సినిమా సెట్ కి వెళ్ళాడు. అది చూసిన చిరంజీవితో సహా చిత్ర బృంటం మొత్తం ఆశ్చర్యానికి గురయ్యారు.
MOST READ:చదివింది ఇంజనీరింగ్; చేసేది దొంగతనం.. చివరకు పోలీసులచే అరెస్ట్
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కోకాపేటలో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఓ సెట్లో జరుగుతుంది. దీని కోసం పార్క్ హయత్లో బస చేసిన సోనూసూద్ బుధవారం ఉదయం అక్కడి నుంచి లొకేషన్ వరకు సైకిల్ తొక్కుతూ వెళ్లాడు. దీనికి సంబంధించిన ఫొటోలో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక్కడ వీడియోలో సోనూసూద్ సైకిల్ పై వెళ్లడం కూడా మీరు చూడవచ్చు.
సాధారణంగా చాలామంది ఆరోగ్యం కోసం సైకిల్ తొక్కుతుంటారు. సైక్లింగ్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది, ఇటీవల కాలంలో తమిళ్ స్టార్ విజయ్ తమిళనాడులో జరిగిన ఎన్నికల సందర్భంగా ఓటు వేయడానికి తన ఇంటి నుంచి పోలింగ్ బూత్ కి సైకిల్ పై వెళ్ళాడు. ఈ సంఘటన సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యింది.
MOST READ:ఒకప్పుడు సిటీబస్సులో ప్రయాణించిన నటి, ఇప్పుడు లగ్జరీ కార్ కొనింది.. ఎవరో తెలుసా?
ఇదే కాకుండా ఇంతకు ముందు రకుల్ ప్రీత్ సింగ్ కూడా తన ఇంటి నుంచి సినిమా సెట్ కి సైకిల్ పై వెళ్లిన సంఘటన కూడా వెలుగులోకి వచ్చింది. దీని గురించి పూర్తి సమాచారం మనం ఇదివరకటి కథనంలోనే తెలుసుకున్నాము.
అయితే ఇప్పుడు సోనూసూద్ సైకిల్ పై వెళ్లిన చిత్రాలు కూడా వైరల్ అవుతున్నాయి. సోనూసూద్ దాదాపు 25 కిలోమీటర్లు సైకిల్ పై ప్రయాణించినట్లు తెలిసింది. కాలుష్యాన్ని తగ్గించాలన్న సందేశంతో పాటు ఇలా సైక్లింగ్ చేయడం వల్ల ప్రతి ఒక్కరూ ఫిట్గా ఉండొచ్చని చెప్పకనే చెప్తున్నారు హీరో సోనూసూద్.
MOST READ:ల్యాండ్ రోవర్పై ప్రేమ; అంతిమ యాత్రకు కూడా అదే.. ఇది ఒక రాజు కోరిక
అతడి సింప్లిసిటీకి, ఫిట్నెస్ మీద ఉన్న శ్రద్ధకు నెటిజన్లు హ్యాట్సాఫ్ చెప్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆచార్య' సినిమా మే 13న విడుదల చేస్తున్నట్లు గతంలో ప్రకటించారు. కానీ కరోనా నేపథ్యంలో ఈ సినిమాను వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది.