Just In
- 9 hrs ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 10 hrs ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 11 hrs ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 12 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
Don't Miss
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Movies కరీనా కపూర్ పోలిటికల్ ఎంట్రీ!.. ఏ పార్టీలో చేరి.. ఎక్కడ నుంచి పోటీ అంటే?
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
కొత్త సైకిల్ కొన్న నటి త్రిష.. కారణం అదే అంటున్న నెటిజన్స్
తెలుగు మరియు తమిళ సినిమాల్లో నటించి అగ్ర తారల సరసన నిలిచిన వారిలో త్రిష ఒకరు. త్రిష తెలుగు మరియు తమిళ సినీ ప్రేక్షలకులకు బాగా తెలుసు, ఈ కారణంగానే కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ అభిమానులు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.
వర్షం సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన త్రిష అతి తక్కువ కాలంలోనే బాగా పాపులర్ అయ్యింది. కానీ తరువాత కాలంలో అనుకోను ఆఫర్లు రాలేదు. అయితే ప్రస్తుతం కొన్ని సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నట్లు కొన్ని వర్గాల ద్వారా తెలుస్తోంది.
ఈ ముద్దు గుమ్మ ఇటీవల సైకిల్ కొన్నట్లు తెలిసింది. త్రిష సైకిల్ షాప్ లో సైకిల్ కొన్న ఫోటో సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతోంది. దీనికి సంబంధించిన ఫోటోలు మీరు కూడా ఇక్కడ గమనించవచ్చు. ఇందులో మీరు గమనించినట్లయితే రెడ్ కలర్ సైకిల్ పై కూర్చున్న ఈ భామ హెల్మెట్ ధరించిపేస్ మాస్క్ కూడా ధరించింది.
ఈ ఫోటో చూసిన కొంతమంది అభిమానులు డీజిల్ మరియు పెట్రోల్ ధరలు ఎక్కువవుతున్న కారణంగా సైకిల్ కొన్నట్లు కామెంట్స్ కూడా చేశారు. కానీ దీనిపై స్పందించిన త్రిష తనకు సైక్లింగ్ చేసే అలవాటు వున్న కారణంగానే ఈ సైకిల్ కొనుగోలు చేసినట్లు చెప్పింది.
మారుతున్న ప్రపంచంలో చాలామంది ప్రజలు చాలా సులువుగా ప్రయాణించడానికి అలవాటు పడిపోయారు. ఈ కారణంగా సైక్లింగ్ వంటివి చేయడానికి కొంతవరకు వెనుకాడుతున్నారు. కానీ సైక్లింగ్ చేయడం చాలా వరకు మంచి అలవాటు, దీనివల్ల ఊబకాయం వంటి చాలా రకాల అర్గ్య సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.
ఏది ఏమైనా భారతదేశంలో రోజురోజుకి పెట్రోల్ మరియు డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ ధరల పెరుగుదల సామాన్య మానవుడిపై తీవ్రమైన ప్రభాన్ని చూపిస్తున్నాయి. ఇంధన ధరలు పెరుగుదల కారణంగా నిత్యావసర ధరలు కూడా అమాంతం పెరిగిపోతున్నాయి.
భారతదేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు అధికంగా ఉండటానికి ప్రధాన కారణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే అధిక ఎక్సైజ్ మరియు వ్యాట్. అందువల్ల పెట్రోల్, డీజిల్పై పన్ను తగ్గించాలని వాహనదారులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు.
జీఎస్టీ పరిమితిలో పెట్రోల్ లేదా డీజిల్ తీసుకురావాలని వాహనదారుల డిమాండ్ చేస్తున్నారు. కానీ ఈ ధరలు ఇప్పట్లో తగ్గే అవకాశాలు కనిపించే అవకాశాలు కనిపించడం లేదు. అందువల్ల చాలామంది వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి మొగ్గుచూపుతున్నారు.