Just In
- 29 min ago కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి (వీడియో)
- 1 hr ago టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- 2 hrs ago ప్రపంచంలోనే 'ది బెస్ట్ కారు' ఇదే.. 29 దేశాల నుంచి 100 మంది ఆటో మొబైల్ జర్నలిస్ట్లు ఎంపిక చేసిన కారు ఏదంటే??
- 3 hrs ago దిశా పటానీ కార్ల ప్రపంచం చూసారా.. చూస్తే మైండ్ బ్లోయింగ్ అంతే..
Don't Miss
- News అష్టదిగ్బంధనం - బీఆర్ఎస్ భవిష్యత్ పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..!!
- Movies Till Square Review: నాన్ స్టాప్ ఫన్ అండ్ లాఫింగ్ రైడ్.. టిల్లు స్క్వేర్ మూవీ రివ్యూ!
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఇండియా To సింగపూర్ : బస్లో వెళ్లి వచ్చేద్దామా.. మీరు విన్నది నిజమే.. చూడండి
సాధారణంగా ఒక దేశం నుంచి మరో దేశానికి విమానాలలో, జల మార్గం ద్వారా అయితే షిప్ ద్వారానో వెళ్తారన్న సంగతి అందిరికి తెలిసిందే, కానీ ఒక దేశం నుంచి ఇంకో దేశానికీ బస్సు ద్వారా ప్రయాణించడం అంటే, వినటానికి కొత్తగా ఉన్నా.. ఇప్పుడు ఇదే నిజమైంది, ఇప్పుడు ఇండియా నుంచి మన సమీప దేశమైన సింగపూర్ కి బస్ సర్వీస్ ప్రారంభం కానుంది.
హర్యానాలోని గుర్గావ్లో ఉన్న ఒక ప్రైవేట్ సంస్థ భారతదేశం నుండి సింగపూర్కు బస్సు సర్వీసును ప్రారంభించాలని యోచిస్తున్నట్లు ప్రకటించింది. ఈ బస్సు మూడు దేశాల గుండా ప్రయాణించనుంది. ఈ ప్రకటన వినగానే సుదూర ప్రాంతాలకు కూడా బస్సు ద్వారా ప్రయాణించాలనుకునేవారికి చాలా ఆనందాన్ని కలిగించింది. అంతే కాదు దీనికి మంచి స్పందన కూడా వచ్చింది.
అడ్వెంచర్స్ ఓవర్ల్యాండ్ భారతదేశం నుండి సింగపూర్ వెళ్లే బస్సు సర్వీసు అవుతుంది. ఈ బస్సు సర్వీసు నవంబర్ 14 న మణిపూర్ లోని ఇంఫాల్ నుండి ప్రారంభమవుతుంది. అడ్వెంచర్ ఓవర్ల్యాండ్ ప్రస్తుతం ట్రావెల్ కోసం టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి ప్రయాణికులను ఆహ్వానిస్తోంది.
MOST READ:ఘన విజయం సాధించిన ఇండియన్ క్రికెట్ టీమ్కి ఆనంద్ మహీంద్రా స్పెషల్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..!
సింగపూర్లోకి ప్రవేశించే ముందు ఈ బస్సు మయన్మార్, థాయ్లాండ్, మలేషియా మీదుగా ప్రయాణించనుంది. మయన్మార్లోని కాలే మరియు యాంగోన్, బ్యాంకాక్ మరియు థాయ్లాండ్లోని క్రాబీ మరియు మలేషియాలోని కౌలాలంపూర్ సందర్శించవలసిన ముఖ్యమైన నగరాల ద్వారా ఇది వెళ్తుంది.
ఈ బస్సు సర్వీసు భారతదేశం నుండి సింగపూర్ మరియు సింగపూర్ నుండి భారతదేశం ప్రయాణానికి దశల వారీగా కొనసాగుతుంది. ప్రతి దశకు 20 సీట్ల బస్సు మాత్రమే ఉపయోగించబడుతుంది. మొదట వచ్చినవారికి, మొదట అందించిన ప్రాతిపదికన బుకింగ్లు అంగీకరించబడతాయి.
MOST READ:జాబ్ చేస్తూ.. జీవితాన్ని, అనుభవించు రాజా..
ఈ ప్రయాణం యొక్క ప్రతి దశను పూర్తి చేయడానికి బస్సు 20 రోజులు పడుతుంది. ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని నిర్ధారించడానికి బస్సులో అన్ని సౌకర్యాలు ఉంటాయి అని అడ్వెంచస్ ఓవర్ల్యాండ్ ఒక ప్రకటనలో తెలిపింది.
మొత్తంగా, బస్సు 5 దేశాల గుండా ప్రయాణించనుంది. ఇందులో ప్రయాణించే ప్రయాణీకులు రోడ్డు మార్గంలో సుమారు 4,500 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఈ దూరాన్ని కొన్ని గంటల్లో విమానంలో ప్రయాణించగలిగినప్పటికీ, రహదారి ప్రయాణం ప్రయాణికులకు భిన్నమైన అనుభవాన్ని అందిస్తుంది.
MOST READ:ఆటో డ్రైవర్ కొడుకు ఇప్పుడు 'బీమర్' ఓనర్ అయ్యాడు; సిరాజ్ కొత్త కార్ చూడండి
ఈ బస్సు 4500 కిలోమీటర్లు వివిధ దేశాలమీదుగా ప్రయాణించడం వల్ల ప్రకృతి ప్రేమికులు ఆహ్లాదంగా వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు. అదే అడ్వెంచర్స్ ఓవర్ల్యాండ్ సంస్థ గత నెలలో భారత రాజధాని ఢిల్లీ నుంచి లండన్కు బస్ సర్వీస్ అందించే ప్రణాళికను ఆవిష్కరించింది. ఇది ప్రపంచంలోనే అతి పొడవైన రహదారి ప్రయాణాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.
ఓవర్ల్యాండ్ కంపెనీ ప్రారంభించిన ఢిల్లీ నుండి లండన్ వెళ్లే బస్సు సర్వీసును ఉపయోగించుకోవడానికి దాదాపు 195 దేశాల పర్యాటకులు ఇటీవల ఆసక్తి చూపారు. ఇటువంటి సుదూర బస్సు ప్రయాణాలు ప్రయాణ ప్రియులకు చాలా అవసరం. నిజంగా ఇంత దూరం బస్సులో ప్రయాణమంటే ఆ అనుభూతి మాటల్లో చెప్పలేము.
MOST READ:మీకు తెలుసా.. జో బైడెన్ ప్రయాణించే విమానం, విమానం మాత్రమే కాదు.. రక్షణ కవచం