యూరప్లో హల్ చల్ చేస్తున్న ఎయిర్ కండిషన్డ్ బైక్స్

బైక్ రైడర్ సెగలు కక్కే ఎండలో ఆమ్లెట్లా ఉడికిపోకుండా చల్లగా ఉంచేందుకు ఈ ఏసి బైక్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాందడోయ్.. ఈదురు గాలులు, దుమ్ము-ధూళి, వర్షాలు, చలి ఇలా అన్ని ప్రతికూల వాతావరణ పరిస్థితులను నుంచి బైక్ రైడర్లను చక్కగా రక్షిస్తుంది. ద్విచక్ర వాహనాన్ని పూర్తిగా క్యాబిన్తో కవర్ చేయబడినట్లుగా ఉండే ఈ ఏసి బైక్లో పైవైపు తెరుచుకునే ఒక డోర్ ఉంటుంది. ఈ బైక్లో ఇద్దరు ప్రయాణికులు హాయిగా ప్రయాణించవచ్చు.
బైక్ను నిలపడానికి సపోర్టింగ్ వీల్ ఒకటి సైడ్ స్టాండ్లా ఉపయోగపడుతుంది. అయితే, ఈ బైక్లో ప్రయాణించాలంటే.. కొంచెం ఖర్చు చేయకతప్పదు మది. కొంచెం అంటే ఎంతో తెలుసా జస్ట్ రూ. 33 లక్షల రూపాయలు మాత్రమే. పెరావెస్ మోనోట్రేసర్ కంపెనీ ఈ ఎయిర్ కండిషన్డ్ బైక్ ధరను 52,500 యూరోలు (సుమారు రూ. 33,53,035)గా నిర్ణయించింది. అంటే, ఈ ఏసి బైక్కు వెచ్చించే ధరకు ఓ మంచి బ్రాండెడ్ లగ్జరీ కారును కొనుక్కోవచ్చు. కానీ.. ఎంతైనా బైక్ రైడ్లో ఉండే మజా.. లగ్జరీ ఏసి కార్తో రాదు కదా..!


Click it and Unblock the Notifications








