Just In
- 27 min ago కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- 2 hrs ago వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్పై కూర్చుకున్న వ్యక్తి (వీడియో)
- 2 hrs ago సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- 6 hrs ago 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
Don't Miss
- Lifestyle పురుషుల్లో ఈ లక్షణాలు ఉంటే.. ఖచ్చితంగా డిప్రెషన్కు గురైనట్టే..!
- News మండుటెండల్లో నారాయణ విద్యాసంస్థల సిబ్బందికి ఎన్నికల కష్టం!!
- Movies నీకెంత బలుపు? ఆర్కే నాయుడుపై సీనియర్ నటి సీరియస్
- Sports T20 వరల్డ్ కప్కు భారత తుదిజట్టు ఇదే - సెహ్వాగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
షాకింగ్ న్యూస్: ఎయిర్ ఇండియా డేటా లీక్, 45 లక్షల మంది ప్రయాణికుల వ్యక్తిగత వివరాలు హ్యాక్!
ఎయిర్ ఇండియా తమ వినియోగదారులు విస్తుపోయే విషయాన్ని వెల్లడించింది. భారతదేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఎయిర్ ఇండియా, తమ ప్రయాణీకుల డేటాను ఎవరో హ్యాక్ చేసి, వారి వ్యక్తిగత వివరాలను దొంగిలించారని ప్రకటించింది.
సుమారు 45 లక్షల మంది ప్రయాణీకుల వివరాలు ఇంటర్నెట్లో లీక్ అయినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. జెనీవాలో ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న సిటా (SITA)పై హ్యాకర్లు జరిపిన సైబర్ దాడిలో ఎయిర్ ఇండియా ప్యాసింజర్లకు సంబంధించిన వ్యక్తిగత వివరాలు లీక్ అయ్యాయి. సిటా అనేది టెలికమ్యూనికేషన్ సర్వీసులను అందించే కంపెనీ.
సిటా సంస్థ కేవలం ఎయిర్ ఇండియాకే కాకుండా ప్రపంచంలోని వివిధ అంతర్జాతీయ విమానయాన సంస్థలకు టెలికమ్యూనికేషన్ సర్వీస్లను అందిస్తుంటుంది. ప్రపంచ విమానయాన వ్యాపారంలోని టెలికమ్యూనికేషన్ సర్వీసుల విభాగంలో సిటాకు దాదాపు 90 శాతం వాటా ఉంది.
అటువంటి పెద్ద బహుళజాతి సమాచార సాంకేతిక సంస్థ నుండి కస్టమర్ వివరాలు లీక్ కావడం యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురయ్యేలా చేస్తోంది. సైబర్ నేరగాళ్లు సిటా సర్వర్లను హ్యాక్ చేసి, ఎయిర్ ఇండియా ప్యాసింజర్ల వ్యక్తిగత వివరాలను దొంగిలించారు.
ఇలా దొంగిలించబడిన సమాచారంలో ప్రయాణికుల పేరు, క్రెడిట్ కార్డు వివరాలు, పుట్టిన తేదీ, కాంకాక్ట్ ఇన్ఫర్మేషన్, పాస్పోర్ట్ సమాచారం, టికెట్ సమాచారం, స్టార్ అలయన్స్ మరియు ఎయిర్ ఇండియా ఫ్రీక్వెంట్ ఫ్లైయర్ డేటా ఉన్నాయని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది.
MOST READ:గిఫ్ట్గా పొందిన థార్ ఎస్యూవీలో ఆఫ్-రోడ్ డ్రైవ్ చేసిన క్రికెటర్ [వీడియో]
ఎయిర్ ఇండియా ద్వారా ఆగస్టు 26, 2011 నుండి ఫిబ్రవరి 3, 2021 వరకు నమోదు చేసుకున్న ప్రయాణీకుల వివరాలు లీక్ అయ్యాయి. అయితే, ఇలా లీకైన సమాచారంలో క్రెడిట్ కార్డుల యొక్క సివివికి సంబంధించిన డేటా సిటా వద్ద లేదని ఎయిర్ ఇండియా తెలిపింది.
ప్రయాణీకుల వ్యక్తిగత సమాచార భద్రత విషయంలో అవసరమైన ప్రతిచోటా తమ పాస్వర్డ్లను మార్చుకోవల్సిందిగా ఎయిర్ ఇండియా తమ ప్రయాణీకులను కోరింది. భవిష్యత్తులో, ఇంలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు కఠినమైన చర్యలు కూడా తీసుకున్నామని తెలిపింది.
MOST READ:రోడ్డుపై అకస్మాత్తుగా కాన్వాయ్ ఆపిన తమిళనాడు సిఎం.. తరువాత ఏం జరిగిందంటే?
ఈ సైబర్ అటాక్ గురించి సిటా ఫిబ్రవరి 25న మొదటి సారిగా తమకు తెలియజేసిందని, అయితే ఈ డేటా లీక్కు సంబంధించిన పూర్తి వివరాలను మార్చి 25 మరియు ఏప్రిల్ 5న మాత్రమే అందించిందని ఎయిర్ ఇండియా తెలిపింది.
కేవలం ఎయిర్ ఇండియా డేటా మాత్రమే కాకుండా, మలేషియన్ ఎయిర్లైన్స్, ఫిన్ఎయిర్, సింగపూర్ ఎయిర్లైన్స్, జెజు ఎయిర్, కాథీ పసిఫిక్, ఎయిర్ న్యూజిలాండ్ మరియు లుఫ్తాన్సా వంటి పలు విమానయాన సంస్థల డేటా కూడా లీకైందని, వారికి దీనికి సంబంధించిన సమాచారం అందించామని సిటా తెలిపింది.
MOST READ:దొంగలించిన కారుని 40 నిముషాల్లోనే స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఎలా అనుకునుటున్నారా
పన్ను చెల్లింపుదారుల డబ్బుతో అతి కష్టమ్మీద నెట్టుకొస్తున్న అతిపెద్ద భారతీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా, ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించింది. ఈ డేటా లీక్ విషయంలో రాజీపడిన సర్వర్లను భద్రపరిచామని, పేరు చెప్పడం ఇష్టం లేని బాహ్య నిపుణులతో నిమగ్నమయ్యామని, క్రెడిట్ కార్డ్ జారీచేసే బ్యాంకులకు కూడా సమాచారం అందించామని మరియు తమ ఫ్రీక్వెంట్ ఫ్లైయర్ ప్రోగ్రామ్ యొక్క పాస్వర్డ్లను కూడా రీసెట్ చేశామని పేర్కొంది.
మరి పైన తెలిపిన సమయంలో మీరు కూడా ఎప్పుడైనా ఎయిర్ ఇండియాలో ప్రయాణించి ఉండి, మీ వివరాలు కూడా సదరు ఎయిర్లైన సంస్థలో రిజిస్టర్ చేయబడి ఉంటే, తక్షణమే మీరు మీ పాస్వర్డ్లను మార్చుకోవటం మంచిది.