Just In
- 55 min ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- 3 hrs ago కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- 6 hrs ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- 8 hrs ago కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
Don't Miss
- News స్కాట్లాండ్లో ట్రెక్కింగ్ కోసం వెళ్లి ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
- Sports ముక్కలవుతున్న ముంబై.. హార్దిక్ను విమర్శిస్తూ నబీ పోస్ట్
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Technology ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- Movies Tenent Review: మర్డర్ మిస్టరీ మెప్పించిందా? సత్యం రాజేష్కు హిట్ పడిందా? టెనెంట్ రివ్యూ
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
చీమలే కదా అనుకోకండి.. ప్రయాణానికి సిద్దమైన విమానాన్ని రద్దు చేసాయ్
ఒకప్పుడు విజయాల బాటలో పయనిస్తున్న కంపెనీలు చాలా అరకు ప్రస్తుతం నష్టాల బాటలో అడుగులు వేస్తున్నాయి. మరి కొన్ని కంపెనీలైతే పూర్తిగా మూతపడ్డాయి. దీనికి ప్రధాన కారణం కరోనా వైరస్. కరోనా మహమ్మారి మొత్తం ప్రపంచాన్నే కుదిపివేసింది. ఇప్పటికి కూడా ఈ మహమ్మారి వ్యాప్తి నుంచి పూర్తి కోలుకోలేదు.
కరోనా వల్ల నష్టాలను చవి చూసిన కంపెనీలలో ఒకటి ఎయిర్ ఇండియా. కేంద్ర ప్రభుత్వం యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా చాలా సంవత్సరాలుగా నష్టాల్లో నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ కారణంగా, గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియాను ప్రైవేట్ రంగానికి విక్రయించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
ఎయిర్ ఇండియా సరిగా పనిచేయడం లేదని ఇదివరకే చాలా పిర్యాదులు వచ్చాయి. అయితే ఇటీవల ఇదే తరహాలో ఒక పిర్యాదు వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన వల్ల చివరి క్షణంలో ఢిల్లీ నుంచి లండన్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానం రద్దు చేయబడింది.
ఎయిర్ ఇండియా 111 సెప్టెంబర్ 06 న మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి లండన్కు వెళ్లాల్సి ఉంది. టికెట్ పొందిన ప్రయాణికులు విమానం లోపల కూర్చున్నారు. కొంతమంది ప్రయాణీకులు, బిజినెస్ క్లాస్ సీట్లలో చీమలను గుర్తించారు. గుర్తించిన ప్రయాణికులు సంబంధిత అధికారులకు తెలిపారు.
ప్రయాణికుల పిర్యాదు అందుకున్న అధికారులు బిజినెస్ క్లాస్ సీట్లను పరిశీలించి ఉన్నతాధికారులకు తెలియజేసారు. అయితే విమానంలో చీమలు కనిపించిన దృశ్యాలు వెలుగులోకి రాలేదు. అయితే చీమల కారణంగా ప్రయాణికులు ఆ సీట్లలో కూర్చోవడానికి నిరాకరించారు. ప్రయాణికులు కూర్చోవడానికి నిరాకరించడం వల్ల, టేకాఫ్ చేయడానికి సిద్ధంగా ఉన్న ఎయిర్ ఇండియా విమానం రద్దు చేయబడింది. దీనికి బదులుగా బోయింగ్ 787-8 లండన్కు వెళ్లింది. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా తన ట్విట్టర్ ఖాతా ద్వారా నివేదించింది.
విమానాల్లో ఈ రకమైన సంఘటనలు వెలుగులోకి రావడం ఇదే మొదటి సారి కాదు. గత ఏడాది మే చివరలో ఎయిర్ ఇండియాలో ఇలాంటి ఒక సంఘటన కూడా వెలుగులోకి వచ్చింది. ఆ సమయంలో అమెరికాకు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం గబ్బిలాల కారణంగా రద్దు చేయబడింది.
ఢిల్లీ విమానాశ్రయంలో కూడా ఇటువంటి ఒక సంఘటన జరగడం గమనార్హం. కొంతమంది ప్రయాణికులు న్యూయార్క్ నుండి వెళ్తున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్యాబిన్లో గబ్బిలాలు ఎగురుతున్నట్లు గమనించారు. ఈ కారణంగా టేకాఫ్ కోసం విమానాన్ని తిరిగి విమానాశ్రయానికి తీసుకెళ్లారు. తర్వాత ప్రయాణికులందరినీ విమానం నుంచి కిందకు దించారు. ప్రయాణికులందరినీ దించిన తర్వాత విమానంలో ఉన్న గబ్బిలాలు బయటకు పంపించారు.
ఎయిర్ ఇండియా 111 విమానంలో భూటాన్ యువరాజు జిగ్మే నామ్గీల్ వాంగ్ కూడా చీమల కారణంగా రద్దు చేయబడిన విమానంలో ప్రయాణించడానికి నిర్ణయించుకున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరాల్సిన ఢిల్లీ-లండన్ విమానం 5.20 గంటలకు చేరింది. చీమల కారణంగా విమానం చాలా ఆలస్యంగా గమ్యాన్ని చేరింది.
భద్రతా కారణాల దృష్ట్యా కొన్ని పాకిస్తాన్ విమానయాన సంస్థలు ఐరోపాలో పనిచేయకుండా నిషేధించబడ్డాయి. ఎయిర్ ఇండియా విమానాలను కూడా ఈ విధంగా జరగకుండా నిషేధించవచ్చు. ఎయిర్ ఇండియా అప్రమత్తంగా ఉండాలి, అంతే కాకుండా ఇలాంటి సంఘటనలు జరగకుండా నిరోధించాలి.
విమానం చాలా సంవత్సరాలు ఒకవిధంగా ఎలా ఉంటుంది అనే ప్రశ్న అందరికి ఏర్పడుతుంది. సాధారణంగా ఒక విమానం యొక్క సగటు జీవిత కాలం 25 నుండి 30 సంవత్సరాలు మాత్రమే. ఏదైనా విమానం పూర్తిగా పాతబడే వరకు వేచి దానిని ఉపయోగించకూడదు.
చాలా విమానాలు 18 సంవత్సరాల సర్వీసు తర్వాత రిటైర్ అవుతాయి, అయితే విమానం జీవితం దాదాపు 25 సంవత్సరాలు. విమానం పదవీ విరమణ చేసిన తర్వాత ఇది స్టోరేజ్ ఎయిర్పోర్టుకు చేరుతుంది. ఆ సమయంలో వీటికి వాటర్ శాల్యూట్ వంటివి కూడా నిర్వహిస్తారు.
రిటైర్ అయిన విమానాలను ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో చూడవచ్చు. వీటిలో ఎక్కువ భాగం నైరుతి అమెరికాలో ఉన్నాయి. విమానాలు తుప్పు పట్టే ప్రక్రియ చాలా నెమ్మదిగా ఉంటుంది. ఎందుకంటే ఇవి భూమి ఉపరితలం కంటే కూడా ఎత్తుగా ఉంటాయి. కావున ఇవి అంత తొందరగా తుప్పు పట్టవు.
ఒక విమానం రిటైర్ అయిన తర్వాత ఇతర విమానాలలో విడిభాగాలను ఉపయోగిస్తారు. కొన్నిసార్లు విడిభాగాలకు బదులుగా పాత విమానాల్లోని విడిభాగాలను భర్తీ చేస్తారు. అయితే ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా నిర్వహించాలి, లేకుంటే ఊహకు అందని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
Note: Images are representative purpose only.