కియా కార్నివాల్ ఎంపివిని కొనుగోలు చేసిన మాజీ ఇండియన్ క్రికెటర్
మన దేశంలో ఉన్న క్రికెటర్లకు ఒకటి కంటే ఎక్కువ కార్లు ఉండటం సర్వ సాధారణం సాధారణం. మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ, సచిన్ వంటి ఆటగాళ్లు చాలా లగ్జరీ కార్లను కలిగి ఉన్నారు. ఇటీవల ఒక మాజీ క్రికెటర్ కొత్త లగ్జరీ కారును కొనుగోలు చేశాడు. మాజీ క్రికెటర్ అజయ్ జడేజా కొనుగోలు చేసిన కారు కియా కార్నివాల్ ఎంపివి.

ఇటీవల కారును అజయ్ జడేజా ఇంటికి పంపించారు. అజయ్ జడేజా ప్రస్తుతం రాజస్థాన్ లోని ఉదయపూర్ లో నివసిస్తున్నారు. గతంలో భారత క్రికెట్ జట్టులో అజయ్ జడేజా కూడా ఒకరు. ఈ కార్నివాల్ అజయ్ జడేజా యొక్క మొట్టమొదటి లగ్జరీ కారు. అతన్నీ ఇంతకు ముందు ఏ లగ్జరీ కారులోనూ చూడలేదు.

లగ్జరీ ఎంపివి కార్నివాల్ కారుని కియా మోటార్స్ 2020 ఆటో ఎక్స్పోలో ఆవిష్కరించబడింది. ఇది విలాసవంతమైన క్యాబిన్ మరియు ఆకర్షణీయమైన ధర కలిగి ఉన్న సంస్థ యొక్క అత్యంత ఖరీదైన కారు.

కియా కార్నివాల్ అనేక మోడళ్లలో విడుదలైంది. అజయ్ జడేజా టాప్ ఎండ్ లిమోసిన్ మోడల్ను కొనుగోలు చేశారు. ఈ కారు ధర సుమారు రూ. 34 లక్షలు, ఆన్-రోడ్ ధర రూ. 36 లక్షలు.

కియా కార్నివాల్ ప్రారంభించటానికి ముందు 3,500 కు పైగా బుకింగ్లు పొందాయి. కార్నివాల్ ఎంపివి ప్రీమియం, ప్రిస్టేజ్ మరియు లిమోసిన్ మోడళ్లలో విక్రయించబడుతుంది. కార్నివాల్ ఎంపివి 9 సీట్లు, 7 సీట్లు మరియు 8 సీట్లతో విక్రయించబడింది. టాప్ ఎండ్ మోడల్లో అడ్జస్టబుల్ సీట్లు ఉన్నాయి. ఈ ఎంపివిలో అనేక ఫీచర్లు ఉన్నాయి.

5 మీటర్ల పొడవైన ఎమ్పివిలో విశాలమైన క్యాబిన్, లెగ్రూమ్ మరియు హెడ్రూమ్ ఉన్నాయి. ఎలక్ట్రిక్ స్లైడింగ్ డోర్స్, పవర్-ఫోల్డింగ్ ఒఆర్వీఎం, ఎల్ఇడి ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్, ఎల్ఇడి టైల్ లాంప్, పవర్-ఆపరేటెడ్ టెయిల్గేట్ వంటి అనేక ఫీచర్స్ లక్షణాలను ఇది కలిగి ఉంది.

కియా కార్నివాల్లో 2.2 లీటర్ 4-సిలిండర్ టర్బో-డీజిల్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 197 బిహెచ్పి శక్తిని మరియు 440 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్ కి జతచేయబడి ఉంటుంది.
Image Courtesy: Anurag Sharma


Click it and Unblock the Notifications








