Just In
- 12 hrs ago వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- 15 hrs ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- 17 hrs ago కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- 21 hrs ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
Don't Miss
- Sports చరిత్ర సృష్టించిన KL రాహుల్.. ధోనీ రికార్డు బ్రేక్
- News ఏపీలో తీవ్ర వడగాల్పులు: అప్రమత్తంగా ఉండక తప్పదు
- Movies Guppedantha Manasu April 20th: మహేంద్ర, అనుపమల కొడుకే మను.. దత్తత కన్ఫార్మ్.. జరక్కపోతే సూసైడే!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
గుడ్ న్యూస్; 8 రోజుల తర్వాత మళ్ళీ ప్రారంభమైన అమర రాజా కంపెనీ
భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం చెందిన బ్యాటరీ కంపెనీలలో అమర రాజా కంపెనీ ఒకటి. ఈ బ్యాటరీ తయారీ కంపెనీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా కరకంబాడి మరియు నూనెకుండపల్లిలో రెండు ప్లాంట్స్ కలిగి ఉంది. అయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి జారీ చేసిన నిబంధనల ప్రకారం ఈ రెండు ప్లాంట్స్ లో ఉత్పత్తి నిలిపివేయాలని ఆదేశించింది.
దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఏప్రిల్ 30 న చేశారు. ఈ కారణంగా కంపెనీలో ఉత్పత్తి వెంటనే ఆగిపోయింది. కానీ అమర రాజా పరిపాలన రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర హైకోర్టులో కేసు వేసింది. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి జారీ చేసిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఆ ఉత్తర్వులను కోర్టు కొట్టివేసింది.
దీని ఫలితంగా కంపెనీ కరకంబాడి మరియు నూనెకుండలపల్లి రెండింటిలోని తన తయారీ కర్మాగారాలలో ఉత్పత్తిని తిరిగి ప్రారంభించింది. నివేదికల ప్రకారం కంపెనీ ఉత్పత్తి 2021 మే 8 నుంచి ప్రారంభించింది. ఉత్పత్తి ప్రారంభించిన తర్వాత భవిష్యత్తులో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలితో కలిసి పని చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
MOST READ:బెంగళూరులో కరోనా ఎఫెక్ట్; లాక్డౌన్లో పట్టుబడ్డ వారికి డిఫరెంట్ పనిష్మెంట్
ఇప్పటికే కంపెనీకి వచ్చిన ఆర్డర్లకు ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్ని వస్తువులు సరఫరా చేస్తామని హామీ ఇచ్చింది. అమర రాజా కంపెనీ దేశంలో అనేక కంపెనీలకు బ్యాటరీలను ఎగుమతి చేస్తోంది. కావున చాలా కంపెనీలు ఈ అమర రాజా కంపెనీపై ఆధారపడి ఉన్నాయి.
అమర రాజా కంపెనీ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్, హ్యుందాయ్ మోటార్స్ ఇండియా లిమిటెడ్, ఫోర్డ్ ఇండియా లిమిటెడ్, టాటా మోటార్స్ లిమిటెడ్, మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్, హోండా కార్స్ ఇండియా లిమిటెడ్, రెనాల్ట్ నిస్సాన్, హోండా మోటార్ సైకిల్స్ & స్కూటర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, రాయల్ ఎన్ఫీల్డ్, బజాజ్ ఆటో లిమిటెడ్ వంటి వాటికీ బ్యాటరీలను అందిస్తుంది.
MOST READ:మీరెప్పుడూ చూడని బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ వీడియో.. ఇప్పుడు చూసెయ్యండి
కేవలం ఇది మాత్రమే కాకూండా కంపెనీ పారిశ్రామిక, ఆటోమోటివ్ బ్యాటరీలు ప్రపంచవ్యాప్తంగా 32 దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు అధికారికంగా తెలిపింది. ఎన్నో దేశాలలోని చాలా కంపెనీలకు మన నుంచి బ్యాటరీలు ఎగుమతవుతుండటం నిజంగా గర్వకారణం.
అమర రాజా కంపెనీలో దాదాపు 16,000 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరు అహర్నిశలు కష్టపడుతూ దేశవిదేశాలకు బ్యాటరీలను ఎగుమతి చేయడానికి సహకరిస్తున్నారు. ఒకవేళా అకస్మాత్తుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించడంతో వారి పని ప్రమాదంలో పడింది.
MOST READ:మాడిఫైడ్ మహీంద్రా థార్.. ఇప్పుడు 22 ఇంచెస్ అల్లాయ్ వీల్తో
ఈ పరిస్థితిలో, సంస్థ యొక్క ఉత్పత్తి కార్యకలాపాలను గణనీయమైన ఆంక్షలతో కొనసాగించడానికి ఆంధ్రప్రదేశ్ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ కంపెనీలో చాలామంది యువత పనిచేస్తున్నారు. కావున ఈ కంపెనీ ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ కంపెనీలో ఒకటిగా నిలిచింది.