గుడ్ న్యూస్; 8 రోజుల తర్వాత మళ్ళీ ప్రారంభమైన అమర రాజా కంపెనీ
భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం చెందిన బ్యాటరీ కంపెనీలలో అమర రాజా కంపెనీ ఒకటి. ఈ బ్యాటరీ తయారీ కంపెనీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా కరకంబాడి మరియు నూనెకుండపల్లిలో రెండు ప్లాంట్స్ కలిగి ఉంది. అయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి జారీ చేసిన నిబంధనల ప్రకారం ఈ రెండు ప్లాంట్స్ లో ఉత్పత్తి నిలిపివేయాలని ఆదేశించింది.

దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఏప్రిల్ 30 న చేశారు. ఈ కారణంగా కంపెనీలో ఉత్పత్తి వెంటనే ఆగిపోయింది. కానీ అమర రాజా పరిపాలన రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర హైకోర్టులో కేసు వేసింది. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి జారీ చేసిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఆ ఉత్తర్వులను కోర్టు కొట్టివేసింది.

దీని ఫలితంగా కంపెనీ కరకంబాడి మరియు నూనెకుండలపల్లి రెండింటిలోని తన తయారీ కర్మాగారాలలో ఉత్పత్తిని తిరిగి ప్రారంభించింది. నివేదికల ప్రకారం కంపెనీ ఉత్పత్తి 2021 మే 8 నుంచి ప్రారంభించింది. ఉత్పత్తి ప్రారంభించిన తర్వాత భవిష్యత్తులో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలితో కలిసి పని చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

ఇప్పటికే కంపెనీకి వచ్చిన ఆర్డర్లకు ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్ని వస్తువులు సరఫరా చేస్తామని హామీ ఇచ్చింది. అమర రాజా కంపెనీ దేశంలో అనేక కంపెనీలకు బ్యాటరీలను ఎగుమతి చేస్తోంది. కావున చాలా కంపెనీలు ఈ అమర రాజా కంపెనీపై ఆధారపడి ఉన్నాయి.

అమర రాజా కంపెనీ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్, హ్యుందాయ్ మోటార్స్ ఇండియా లిమిటెడ్, ఫోర్డ్ ఇండియా లిమిటెడ్, టాటా మోటార్స్ లిమిటెడ్, మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్, హోండా కార్స్ ఇండియా లిమిటెడ్, రెనాల్ట్ నిస్సాన్, హోండా మోటార్ సైకిల్స్ & స్కూటర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, రాయల్ ఎన్ఫీల్డ్, బజాజ్ ఆటో లిమిటెడ్ వంటి వాటికీ బ్యాటరీలను అందిస్తుంది.

కేవలం ఇది మాత్రమే కాకూండా కంపెనీ పారిశ్రామిక, ఆటోమోటివ్ బ్యాటరీలు ప్రపంచవ్యాప్తంగా 32 దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు అధికారికంగా తెలిపింది. ఎన్నో దేశాలలోని చాలా కంపెనీలకు మన నుంచి బ్యాటరీలు ఎగుమతవుతుండటం నిజంగా గర్వకారణం.

అమర రాజా కంపెనీలో దాదాపు 16,000 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరు అహర్నిశలు కష్టపడుతూ దేశవిదేశాలకు బ్యాటరీలను ఎగుమతి చేయడానికి సహకరిస్తున్నారు. ఒకవేళా అకస్మాత్తుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించడంతో వారి పని ప్రమాదంలో పడింది.

ఈ పరిస్థితిలో, సంస్థ యొక్క ఉత్పత్తి కార్యకలాపాలను గణనీయమైన ఆంక్షలతో కొనసాగించడానికి ఆంధ్రప్రదేశ్ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ కంపెనీలో చాలామంది యువత పనిచేస్తున్నారు. కావున ఈ కంపెనీ ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ కంపెనీలో ఒకటిగా నిలిచింది.


Click it and Unblock the Notifications








