Just In
- 8 hrs ago వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- 9 hrs ago వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- 10 hrs ago 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- 10 hrs ago 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
Don't Miss
- Lifestyle చాణక్య నీతి ప్రకారం, ఈ అలవాట్లు మీకు తెలియకుండానే మీ సంపదను పూర్తిగా నాశనం చేస్తాయి...!
- News రిజర్వేషన్లు రద్దు చేస్తారు: మోడీ, కేసీఆర్పై రేవంత్ సంచలన ఆరోపణలు
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Movies ఆ పార్టీ ఎంపినే గెలిపించండి.. ప్యాకేజ్ తీసుకొని చెప్పడం లేదు.. రేణు దేశాయ్ సంచలన పోస్ట్
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
29 వేల కోట్లతో అనంతపురం అమరావతి మధ్య ఎక్స్ప్రెస్ వే నిర్మించనున్న కేంద్రం
అనంతపురం నుండి అమరావతికి మలుపుల్లేని ఎక్స్ప్రెస్ వే కోసం 29,000 కోట్లు ప్రకటించిన కేంద్రం.
అనంతపురం
నుండి
అమరావతికి
మలుపుల్లేని
ఎక్స్ప్రెస్
వే
కోసం
29,000
కోట్లు
ప్రకటించిన
కేంద్రం.
కేంద్ర
నిధులతో
అనంతపురం
అమరావతి
మధ్య
600
కిలోమీటర్ల
మేర
నాలుగు
మరియు
ఆరు
లేన్ల
రహదారి
నిర్మించనుంది.
విభజనకు ముందు తెలుగు రాష్ట్ర రాజధాని హైదరాబాదుకి అనంతపురం నుండి నాలుగు రోడ్ల రహదారి ఉండేది. ఏడవ నెంబర్ జాతీయ రహదారి అనంతపురం మరియు హైదరాబాద్లను కలిపేది.
విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుండి అధిక దూరంలో ఉన్న జిల్లాలలో అనంతపురం ఒకటి. అయితే అనంతపురం నుండి అమరావతికి జాతీయ రహదారి లేకపోవడంతో రాయలసీమతో రాజధాని అనుసంధానం కాస్త కష్టతరంగా మారింది.
అయితే కేంద్రం ఈ ప్రాజెక్టును దాదాపు ఖరారు చేసింది. ఈ రహదారి మొత్తం నిర్మాణానికి కావాల్సిన నిధులను కేంద్రమే సమకూర్చనుంది.
ఈ రహదారి ప్రతిపాదనలు మరియు దీనికి సంభందించిన నిధులు గురించిన అంశాన్ని కేంద్రం మంత్రివర్గంలో చర్చించాల్సి ఉంటుంది.
2017 భారతదేశపు సరుకు రవాణా సమావేశంలో కేంద్రం రవాణా, జాతీయ రహదారులు మరియు షిప్పింగ్ మంత్రి నితిన్ గడ్కరీ గారు ఈ ప్రాజెక్టును ప్రకటించారు.
రహదారులు మరియు భవనముల ప్రధాన కార్యదర్శి సుమిత గారు ఓ పత్రికకు ఇచ్చిన వివరణలో, ప్రభుత్వం నుండి ఈ ప్రాజెక్టుకు సంభందించి అధికారిక ప్రకటన ఏ సమయంలోనైనా రానుందని ఆమె తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు నెట్వర్క్ విస్తరణలో ఈ అనంతపురం - అమరావతి ఎక్స్ప్రెస్ వే కీలకంగా మారనుంది మరియు నిర్మాణ దశలో ఉన్న రాజధాని నగరాన్ని అనుసంధానం చేస్తూ ఈ ప్రాజెక్టు పనులు అతి త్వరలో ప్రారంభం కానున్నాయి.
అధికారుల సమాచారం మేరకు, అనంతపురం - అమరావతి మధ్య నిర్మించతలపెట్టనున్న ఎక్స్ప్రెస్ వే కోసం కేంద్రమే నిధులు ఇవ్వనుంది. అయితే ఈ రహదారి వెంబడి ఉండే టోల్ బూత్ల ద్వారా వచ్చే ఆదాయం కేంద్ర ఖజానాకు వెళ్లనుంది.
రాష్ట్ర ప్రభుత్వం ఈ రహదారి కోసం 8,562.84 హెక్టార్ల స్థలాన్ని సేకరించాల్సి ఉంటుంది. అనంతపురం - అమరావతి లను కలిపే ఈ ఎక్స్ప్రెస్ వే అనంతపురం, కర్నూలు, కడప, ప్రకాశం మరియు గుంటూరు జిల్లా మీదుగా వెళ్లనుంది.
ఐదు జిల్లాల్లో 45 మండళాలు, 186 గ్రామాలను కలుపుతూ మొత్తం 600 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. ఇందులో 394 కిలోమీటర్లను నాలుగు లేన్లతో మరియు 208 కిలోమీటర్లను ఆరు లేన్లతో నిర్మించనున్నారు.
ఈ మార్గాన్ని కలుపుతూ కర్నూలు మరియు కడపల నుండి రెండు హై వేలను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టును 30 నెలల వ్యవధిలో పూర్తి చేసేందుకు ప్రతిపాదిస్తున్నారు. ప్రతిపాదిత మార్గంలో మలుపులను దాదాపు తగ్గించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఇప్పటి వరకు రాయలసీమ జిల్లాలను అమరావతి కలిపేందుకు ఓ రహదారి అంటూ ఏదీ లేదు. ప్రస్తుతం అనంతపురం నుండి అమరావతి మధ్య రైలు ప్రయాణం 12 నుండి 14 గంటలుగా ఉంది. ఈ రహదారి పూర్తయితే 5 నుండి 6 గంటల్లో రోడ్డు ద్వారా రాజధాని చేరుకోవచ్చు.
గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేందుకు వీలుగా ఈ ఎక్స్ప్రెస్ను నిర్మించనున్నారు. ఇందుకు అడ్డంకిగా ఉన్నటువంటి కొండ మరియు వాలు తలాలను కూడా సమాతరం చేయాలని భావిస్తోంది.