దేశీయంగా నేల మరియు నీటిలో నడిచే బస్సులకు లభించిన అనుమతులు
ఎటువంటి ట్రాఫిక్ లేకుండా నదిలో లేదా సరస్సులలో ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి పడవలలో కాకుండా బస్సులలో వెళ్లాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. ఇలాంటి బస్సుల ద్వారా నేల మరియు నీరు రెడింటి మీద కూడా ప్రయాణించవచ్చు. ఇలాంటి వాటిలో ప్రయాణించాలనే కోరిక ఉన్న వారు త్వరలలో వీటిలో ప్రయాణించే అవకాశం దక్కనుంది. ఇంలాంటి బస్సులను దేశీయంగా వినియోగించవచ్చని కేంద్ర రవాణా శాఖ మంత్రి అనుమతులు మంజూరు చేశారు.

గోన్ అనే సంస్థ ఇలా నేల మరియు నీటి మీద నడిచే 14 ఆంపిబియస్ బస్సులను తయారు చేసింది. అయితే వీటిని దేశీయంగా రవాణా కోసం వినియోగించడానికి పూర్వం కేంద్ర రవాణా శాఖ ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు.

అయితే తాజాగా ఈ సంస్థ చేసిన విజ్ఞప్తి మేరకు తగిన నియమ నిభందనలతో కూడిన అనుమతులు మంజూరు చేసినట్లు తెలిసింది.

ప్రభుత్వం సూచించిన నియమాలలో ఈ ఆంపిబియస్ బస్సులను నీటి మీద గంటకు 40 కిలోమీటర్లు వేగాన్ని మించి నడపకూడదు.

అందే విధంగా సూర్యాస్తమయం తరువాత మరియు సూర్యోదయానికి ముందు వీటిని నీటిలో నడపకూడదను ఆంక్షలు విధించింది. భద్రతా సంభందమైన కారణాలు దృష్ట్యా ఇలాంటి ఆంక్షలు విధించినట్లు తెలిసింది.

అనుమతులు వచ్చిన తరువాత మొదటి ఆంపిబియస్ బస్సును జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్టు వారు కొనుగోలు చేసారు. రానున్న మూడు నెలల్లోపు దీనిని ముంబాయ్ నగరంలో తిప్పనున్నారు.

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కొన్ని ప్రధాన నగరాలలో ఆంపిబియస్ బస్సులను పర్యాటకుల కోసం నడుపుతున్నారు. ఇందులో ముఖ్య ఉదాహరణ లండన్ డక్ టూర్స్ సంస్థ.

రెండవ ప్రపంచ యుద్ద కాలంనాటి పురాతన ఆంపిబియస్ వాహనాన్ని నేడు ఆంపిబియస్ బస్సుగా లండన్లో వినియోగిస్తున్నారు.

- నేల మరియు నీటి మీద ఈ ఆంపిబియస్ లగ్జరీ బస్సుతో రౌండ్లు వేయండి !


Click it and Unblock the Notifications