Just In
- 9 hrs ago 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- 11 hrs ago మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- 12 hrs ago కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- 14 hrs ago వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్పై కూర్చుకున్న వ్యక్తి (వీడియో)
Don't Miss
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Movies Karthika Deepam 2 April 25th: దీపను టార్గెట్ చేసిన పారిజాతం.. దాడి చేస్తే దిక్కెవరు.. సుమిత్ర
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
190 ఏళ్ల అమృతాంజన్ వంతెనను కూల్చివేసిన మహారాష్ట్ర గవర్నమెంట్, ఎందుకో తెలుసా.. !
ముంబై మరియి పూణే ఎక్స్ప్రెస్వే సమీపంలో ఉన్న 190 ఏళ్ల అమృతాంజన్ బ్రిజ్డ్ కూల్చి వేశారు. దాదాపు 190 సంవత్సరాలుగా ఉన్న ఈ వంతెన ఇప్పుడు కూల్చి వేయడం జరిగింది. ఈ అమృతాంజన్ వంతెన కూల్చివేయడానికి గల కారణాలను ఇక్కడ పూర్తిగా తెలుసుకుందాం.. !
దాదాపు 190 సంవత్సరాలు వాడుకలో ఉన్న అమృతాంజన్ వంతెనను ఆదివారం సాయంత్రం కూల్చివేసినట్లు మహారాష్ట్ర రాష్ట్ర రహదారి అభివృద్ధి సంస్థ (ఎంఎస్ఆర్డిసి) ఒక ప్రకటనలో తెలిపింది. బ్రిటిష్ యుగం నాటి ఈ వంతెన కూల్చివేత కోసం పేలుడు పదార్థాలను ఉపయోగించినట్లు కూడా ప్రకటించారు.
ఈ అమృతాంజన్ వంతెన 1830 జనవరిలో నిర్మాణాన్ని ప్రారంభించింది మరియు అదే సంవత్సరం నవంబర్లో వినియోగంలోకి వచ్చింది. సాధారణంగా అమృతాంజన్ వంతెన మహారాష్ట్రలోని దక్కన్ (కొండ) మరియు కొంకణ్ (తీర) ప్రాంతాలను అనుసంధానించడానికి ఉద్దేశించబడింది.
ప్రస్తుతం ముంబై నగరం నుండి పూణేకు వెళ్లే మార్గంలో ఖండాలా మరియు లోనావాలా హిల్ స్టేషన్లకు ప్రయాణాన్ని సులభతరం చేసింది ఈ అమృతాంజన్ వంతెన.
మహారాష్ట్ర రాష్ట్ర రహదారి అభివృద్ధి సంస్థ (ఎంఎస్ఆర్డిసి) యొక్క ఒక సీనియర్ అధికారి మాట్లాడుతూ, ఈ వంతెన కొంత కాలంగా ఉపయోగంలో లేదని, అంతే కాకుండా ఈ వంతెన స్థంబాలు వాహన రద్దీ కారణంగా అడ్డంకిగా మారాయని తెలిపారు. వాహన రాకపోకలకు ఇది చాలా సమస్యగా మారింది.
ముంబై-పూణే ఎక్స్ప్రెస్ వే లో 6 లైన్ల క్యారేజ్వేపై తీవ్రమైన ట్రాఫిక్ స్నార్ల్స్ ఉన్నాయి. ఈ విధంగా ఉండటం వల్ల చాలా ఎక్కువ ట్రాఫిక్ అయ్యే సమస్య కూడా ఉంది. కాబట్టి దీనిని ప్రస్తుతం వినియోగంలో లేదు కావున ఈ అమృతాంజన్ వంతెనను ఏప్రిల్ 4 నుంచి 14 మధ్యలో కూల్చి వేయడానికి ఎంఎస్ఆర్డిసికి రాయ్గడ్ జిల్లా కలెక్టర్ అనుమతి ఇచ్చారు.
ప్రస్తుతం భారత్ లాక్ డౌన్ లో ఉన్న కారణంగా వాహనాల రాకపోకలు ఇప్పుడు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ సమయంలో ఆదివారం సాయంత్రం పేలుడు పాదయ్రాతలను ఉపయోగించి దీనిని పేల్చి వేయడం జరిగింది. ఏది ఏమైనా ఎట్టకేలకు కరోనా లాక్ డౌన్ కూడా ఈ వంతెన కూల్చి వేయడానికి సహకరించింది.