Just In
- 1 hr ago త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- 4 hrs ago హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- 5 hrs ago JNCAP క్రాష్ టెస్ట్లో అదరగొట్టిన స్విఫ్ట్.. స్కోర్ ఎంతో తెలుసా?
- 5 hrs ago కొత్త మారుతి స్విఫ్ట్ బుకింగ్ ప్రైస్ ఎంతో తెలుసా? ఇక్కడ చూడండి!
Don't Miss
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- News పొలిటికల్ స్టార్.. తెలంగాణా కాంగ్రెస్ కమాండర్ రేవంత్ రెడ్డి ఈజ్ బ్యాక్!!
- Sports IPL 2024: ధోనీపై గంభీర్ అక్కసు.. మండిపడుతున్న చెన్నై ఫ్యాన్స్!
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Movies నాగార్జున ఇంటికి కోడలుగా రాబోతున్న మరో హీరోయిన్
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
పారిశ్రామిక రంగంలో 2020 పద్మ భూషణ్ అవార్డ్స్ పొందిన వారు ఎవరో తెలుసా!
భారతదేశంలో ప్రతిష్టాత్మకమైన అవార్డులలో పద్మ అవార్డ్స్ చెప్పుకోదగ్గవి. వివిధ రంగాలలో విశిష్టమైన సేవ చేసిన వారికి భారత ప్రభుత్వమ్ ప్రతి ఏటా ఈ అవార్డ్స్ ఇస్తూ ఉంటారు. 2020 సంవత్సరానికి గాను మొత్తం అన్ని రంగాలలో 141 పద్మ అవార్డ్స్ ని ప్రకటించడం జరిగింది. ఇందులో పారిశ్రామిక రంగంలో ఇద్దరి వ్యక్తులను పద్మ అవార్డ్ వరించింది. పారిశ్రామిక రంగంలో పద్మ అవార్డు పొందిన వ్యక్తులను గురించి మరింత తెలుసుకుందాం!
2020 సంవత్సరంలో పారిశ్రామిక రంగంలో పద్మ అవార్డ్స్ పొందిన వారు మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, రెండవ వ్యక్తి టీవీఎస్ మోటార్స్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ వేణు శ్రీనివాసన్.
ప్రపంచంలో వాణిజ్యరంగాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మహీంద్రా సంస్థ చురుకైన పాత్రపోషించింది. ఇంతటి గొప్ప సంస్థకి 1991 మరియు 2012 లో చైర్మన్ అయ్యారు. ఆనంద్ మహీంద్రా నాయకత్వంలో ఆటోమోటివ్ డివిజన్ ని చాలా అభివృద్ధి చేశారు. అంతేకాకుండా సంస్థ అధికమైన లాభాలను పొందటంతో పాటు ఇతర గ్లోబల్ బ్రాండ్లతో విజయవంతమైన భాగస్వామ్యాన్ని పొందింది.
ఇండియాలో మహీంద్రా ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. ఇప్పుడు మహీంద్రా సంస్థ ఏరోస్పేస్, అగ్రిబిజినెస్, ఆటోమోటివ్, కన్స్ట్రక్షన్, డిఫెన్స్, ఎనర్జీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హాస్పిటాలిటీ, రియల్ ఎస్టేట్ మరియు రిటైల్ వంటి వ్యాపార వ్యాపారాలను కలిగి ఉంది. ఇటీవల కాలంలో మహీంద్రా సంస్థ నుంచి చైర్మన్ పదవినుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. కానీ ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా పదవిని కొనసాగిస్తున్నారు.
ఇక పద్మ అవార్డు పొందిన రెండవ వ్యక్తి మిస్టర్ వేణు శ్రీనివాసన్. ఇతడు 1979 లో క్లేటన్ మేనేజింగ్ డైరెక్టర్ గా మరియు 1980 ల చివరలో టివిఎస్ మోటార్ కంపెనీ ఛైర్మన్ గా నియమితులయ్యారు.ఇతడు చైర్మన్ అయేసరికి కంపెనీలో కార్మిక ఇబ్బందులు, కార్మికులను కొట్టడం మరియు నష్టాలను కూడబెట్టడం జరిగింది.
శ్రీనివాసన్ కర్మాగారాన్ని మూడు నెలలు మూసివేసారు. తరువాత కర్మాగారాలను అప్గ్రేడ్ చేశారు. కొత్త టెక్నాలజీలో పెట్టుబడులు పెట్టారు మరియు టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ను ప్రవేశపెట్టారు.
శ్రీనివాసన్ నాయకత్వంలో టివిఎస్ మోటార్ కంపెనీ సుజుకి నుండి వేరుపడి, టివిఎస్ విక్టర్ను ప్రారంభించింది. ఇతని నాయకత్వంలోనే టీవీఎస్ దేశంలో ద్విచక్ర వాహనాల మూడవ అతిపెద్ద తయారీదారుగా మారింది. అంతే కాకుండా జర్మన్ ఆటో దిగ్గజాలకు బిఎమ్డబ్ల్యూ మోటార్సైకిళ్లను కూడా తయారు చేయడం జరిగింది.
డ్రైవ్స్పార్క్ తెలుగు అభిప్రాయం!
పారిశ్రామిక రంగంలో ఆనంద్ మహీంద్రా కి మరియు శ్రీనివాసన్ కి పద్మ భూషణ్ అవార్డ్స్ రావడం చాలా అభిననందనీయం. ప్రపంచదేశాలు కూడా హర్షించే విధంగా వీరు తమ సంస్థలను అంచెలంచెలుగా అభివృద్ధి చేసారు. పారిశ్రామిక రంగంలో ఇప్పుడు అన్ని దేశాలు కూడా మనదేశంలో పెట్టుబడులు పెట్టడానికి బాగా దోహదం చేసారు. ఈ రంగంలో ఇంతటి కృషి చేసిన వీరు పద్మభూషణ్ అవార్డులు అందుకోవడానికి నిజమైన అర్హులు.