రోడ్డు ప్రమాదంలో ఆనంద్ మహీంద్రా మేనల్లుడి మరణం

కనీష్ నాథ్ స్వయానా ఆనంద్ మహీంద్రా చెల్లెకు కుమారుడు. ఈ ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ రాహుల్ కౌషిక్ను సరైన సమయంలో ఆల్కహాల్ పరీక్ష చేయటంలో అంజునా పోలీసులు విఫలమయ్యారు. దీంతో ప్రమాదం జరిగిన వెంటనే అతనికి బెయిల్ కూడా లభించింది. న్యూఢిల్లీలో మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారును విడుదల చేసిన తర్వాత ఆనంద్ మహీంద్రాకు ఈ విషయం తెలిసింది. దీంతో వెంటనే ప్రత్యేక జెట్ విమానంలో మరణించిన వ్యక్తి తండ్రిని వెంటబెట్టుకొని ఆనంద్ మహీంద్రా గోవా వెళ్లారు.
కవీష్ చాలా తెలివైన కుర్రాడని, ఈ ప్రమాదానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసిన కార్ డ్రైవర్పై తగిన చర్యలు తీసుకొని, కనీష్ కుటుంబానికి న్యాయం చేయాలని ఆయన కోరారు. పోలీసులు తమ పని తాము చేయగలరని, వారిపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, ఈ విషయంలో న్యాయం కోసం గోవా ముఖ్యమంత్రి మనోహప్ పారికార్ను సంప్రదిస్తానని ఆనంద్ మహీంద్రా చెప్పారు. మరికొద్ది రోజుల్లో కవీష్ మహీంద్రా కంపెనీలో చేరాల్సి ఉంది.


Click it and Unblock the Notifications








