ఆనంద్ మహీంద్రా ట్వీట్; బహుశా.. ఇదోరకమైన సామజిక దూరమేమో
భారతదేశంలో కరోనా మహమ్మారి చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ మహమ్మారి వ్యాప్తిని నిరోధించడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కఠినమైన చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే పేస్ మాస్క్ ధరించడం మరియు సామాజిక దూరం వంటివి పాటించడం వున్నాయి. కరోనా మహమ్మారి నివారణకు తప్పకుండా ఈ నియమాలు పాటించాలి.

కరోనా మహమ్మారి నివారణకు దేశంలో దాదాపు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా లాక్ డౌన్ విధించాయి. ఈ లాక్ డౌన్ సమయంలో ప్రజలు బయటకు రాకూడదని నిబంధనలు ఉన్నాయి. ప్రజలు అత్యవసర సమయంలో మాత్రమే బయటకు రావడానికి అనుమతించబడుతుంది. అందులోనూ సామజిక దూరం తప్పకుండా ఉండేలా చూడాలి.

మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ చైర్మన్ ఆనంద్ మహీంద్రా తమ ట్విట్టర్ అకౌంట్ లో ఇటీవల ఒక ఫోటో షేర్ చేశారు. ఈ ఫోటో చూడటానికి చాలా ఫన్నీగా ఉంటుంది. ఈ ఫోటోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా మాట్లాడుతూ ఇది చూడటానికి చాలా హాస్యాస్పదంగా ఉంటుంది.

ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేసిన ఈ పోస్టులో ఇద్దరు బైకర్స్ నిచ్చెనను రెండువైపులా తలతో పట్టుకున్నారు చూడవచ్చు. ఇది చూడటానికి సామజిక దూరాన్ని పాటిస్తున్నట్లు అనిపించినప్పటికీ, నిజానికి ఇది చాలా ప్రమాదం కూడా.

ఆనంద్ మహీంద్రా చేసిన ఈ పోస్ట్ కి 4,000 మందికి పైగా లైక్లు మరియు 232 సార్లు రీట్వీట్స్ చేశారు. ఇది మాత్రమే కాకుండా చాలా మంది ట్విట్టర్ వినియోగదారులు ఈ పోస్ట్ గురించి చాలా కామెంట్స్ కూడా చేశారు.

మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ట్విట్టర్తో సహా సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ఎల్లప్పుడూ చాలా యాక్టివ్ గా ఉంటాడు. ఈ కారణంగానే చాలా ఇంట్రసింగ్ విషయాలకు సంబంధించిన చాలా పోస్ట్ లను తన సోషల్ మీడియా యాప్ లో షేర్ చేస్తుంటారు. ఈ విధంగా ఇంట్రస్టింగ్ విషయాలను షేర్ చేయడం వల్ల చలామది ఫాలోవర్స్ వున్నారు.

భారతదేశంలో ప్రసిద్ధి చెందిన వ్యాపారవేత్తలతో ఆనంద్ మహీంద్రా ఒకరు. ఆనంద్ మహీంద్రా సహాయం చేయడానికి ముందుకు వస్తారు. ఒక వ్యక్తి తన తల్లిని స్కూటర్ పై యాత్రలకు తీసుకెళ్లిన కారణంగా కారుని గిఫ్ట్ గా ఇచ్చారు. దీనికి సంబంధించిన సమాచారం ఇదివరకటి మునుపటి కథనాల్లో తెలుసుకున్నాం.

2021 ఆరంభంలో ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ గెలిచినా ఇండియన్ క్రికెట్ టీమ్ లో ఉన్న ఆరుగురు యువ క్రికెటర్లకు కొత్త థార్ ఎస్యూవీని గిఫ్ట్ గా ఇచ్చారు. ఢిల్లీ, ముంబై, పూణేతో సహా దేశంలోని అనేక చిన్న మరియు పెద్ద నగరాలలో వైద్యం కోసం ఆక్సిజన్ సరఫరా చేయడానికి ఆనంద్ మహీంద్రా ఇటీవల ఆక్సిజన్ ఆన్ వీల్స్ ప్రచారాన్ని ప్రారంభించారు.

ఆక్సిజన్ ఆన్ వీల్స్ ప్రచారం ద్వారా, మహీంద్రా & మహీంద్రా ఆసుపత్రులకు మరియు రోగుల ఇళ్లకు ఆక్సిజన్ను ఉచితంగా పంపిణీ చేస్తోంది. మహీంద్రా బొలెరో పికప్ వాహనం సహాయంతో మహీంద్రా 600 కి పైగా ఆక్సిజన్ సిలిండర్లను నిరుపేదల గుమ్మానికి చేరవేస్తూ తమ ఉదారతను చాటుకుంటున్నారు.


Click it and Unblock the Notifications








