Just In
- 1 hr ago త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- 4 hrs ago హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- 6 hrs ago JNCAP క్రాష్ టెస్ట్లో అదరగొట్టిన స్విఫ్ట్.. స్కోర్ ఎంతో తెలుసా?
- 6 hrs ago కొత్త మారుతి స్విఫ్ట్ బుకింగ్ ప్రైస్ ఎంతో తెలుసా? ఇక్కడ చూడండి!
Don't Miss
- News వాళ్ళను తిడుతూనే.. వైఎస్ జగన్, భారతి వద్ద కోట్లలో వైఎస్ షర్మిలమ్మ అప్పులచిట్టా ఇదే!!
- Sports SRH vs RCB ఉప్పల్ మ్యాచ్కు భారీ అడ్డంకి..!
- Lifestyle నిమ్మరసంతో ఇన్ని ప్రయోజనాలాా..? కిడ్నీలో రాళ్లు కూడా మాయం, ఇంకా ఎన్నో..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Movies నాగార్జున ఇంటికి కోడలుగా రాబోతున్న మరో హీరోయిన్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
ఆనంద్ మహీంద్రా ట్వీట్; బహుశా.. ఇదోరకమైన సామజిక దూరమేమో
భారతదేశంలో కరోనా మహమ్మారి చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ మహమ్మారి వ్యాప్తిని నిరోధించడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కఠినమైన చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే పేస్ మాస్క్ ధరించడం మరియు సామాజిక దూరం వంటివి పాటించడం వున్నాయి. కరోనా మహమ్మారి నివారణకు తప్పకుండా ఈ నియమాలు పాటించాలి.
కరోనా మహమ్మారి నివారణకు దేశంలో దాదాపు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా లాక్ డౌన్ విధించాయి. ఈ లాక్ డౌన్ సమయంలో ప్రజలు బయటకు రాకూడదని నిబంధనలు ఉన్నాయి. ప్రజలు అత్యవసర సమయంలో మాత్రమే బయటకు రావడానికి అనుమతించబడుతుంది. అందులోనూ సామజిక దూరం తప్పకుండా ఉండేలా చూడాలి.
మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ చైర్మన్ ఆనంద్ మహీంద్రా తమ ట్విట్టర్ అకౌంట్ లో ఇటీవల ఒక ఫోటో షేర్ చేశారు. ఈ ఫోటో చూడటానికి చాలా ఫన్నీగా ఉంటుంది. ఈ ఫోటోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా మాట్లాడుతూ ఇది చూడటానికి చాలా హాస్యాస్పదంగా ఉంటుంది.
ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేసిన ఈ పోస్టులో ఇద్దరు బైకర్స్ నిచ్చెనను రెండువైపులా తలతో పట్టుకున్నారు చూడవచ్చు. ఇది చూడటానికి సామజిక దూరాన్ని పాటిస్తున్నట్లు అనిపించినప్పటికీ, నిజానికి ఇది చాలా ప్రమాదం కూడా.
ఆనంద్ మహీంద్రా చేసిన ఈ పోస్ట్ కి 4,000 మందికి పైగా లైక్లు మరియు 232 సార్లు రీట్వీట్స్ చేశారు. ఇది మాత్రమే కాకుండా చాలా మంది ట్విట్టర్ వినియోగదారులు ఈ పోస్ట్ గురించి చాలా కామెంట్స్ కూడా చేశారు.
MOST READ:తోటి వ్యక్తి అంత్యక్రియలకు నిరాకరించిన గ్రామస్థులు.. పిఎఫ్ఐ టీమ్ రాకతో కథ సుఖాంతం
మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ట్విట్టర్తో సహా సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ఎల్లప్పుడూ చాలా యాక్టివ్ గా ఉంటాడు. ఈ కారణంగానే చాలా ఇంట్రసింగ్ విషయాలకు సంబంధించిన చాలా పోస్ట్ లను తన సోషల్ మీడియా యాప్ లో షేర్ చేస్తుంటారు. ఈ విధంగా ఇంట్రస్టింగ్ విషయాలను షేర్ చేయడం వల్ల చలామది ఫాలోవర్స్ వున్నారు.
భారతదేశంలో ప్రసిద్ధి చెందిన వ్యాపారవేత్తలతో ఆనంద్ మహీంద్రా ఒకరు. ఆనంద్ మహీంద్రా సహాయం చేయడానికి ముందుకు వస్తారు. ఒక వ్యక్తి తన తల్లిని స్కూటర్ పై యాత్రలకు తీసుకెళ్లిన కారణంగా కారుని గిఫ్ట్ గా ఇచ్చారు. దీనికి సంబంధించిన సమాచారం ఇదివరకటి మునుపటి కథనాల్లో తెలుసుకున్నాం.
MOST READ:బెంగళూరులో కరోనా ఎఫెక్ట్; లాక్డౌన్లో పట్టుబడ్డ వారికి డిఫరెంట్ పనిష్మెంట్
2021 ఆరంభంలో ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ గెలిచినా ఇండియన్ క్రికెట్ టీమ్ లో ఉన్న ఆరుగురు యువ క్రికెటర్లకు కొత్త థార్ ఎస్యూవీని గిఫ్ట్ గా ఇచ్చారు. ఢిల్లీ, ముంబై, పూణేతో సహా దేశంలోని అనేక చిన్న మరియు పెద్ద నగరాలలో వైద్యం కోసం ఆక్సిజన్ సరఫరా చేయడానికి ఆనంద్ మహీంద్రా ఇటీవల ఆక్సిజన్ ఆన్ వీల్స్ ప్రచారాన్ని ప్రారంభించారు.
ఆక్సిజన్ ఆన్ వీల్స్ ప్రచారం ద్వారా, మహీంద్రా & మహీంద్రా ఆసుపత్రులకు మరియు రోగుల ఇళ్లకు ఆక్సిజన్ను ఉచితంగా పంపిణీ చేస్తోంది. మహీంద్రా బొలెరో పికప్ వాహనం సహాయంతో మహీంద్రా 600 కి పైగా ఆక్సిజన్ సిలిండర్లను నిరుపేదల గుమ్మానికి చేరవేస్తూ తమ ఉదారతను చాటుకుంటున్నారు.