Just In
- 1 hr ago కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- 14 hrs ago 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- 16 hrs ago మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- 18 hrs ago కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
Don't Miss
- News ఎల్లుండే వైసీపీలోకి యనమల ? చర్చలు పూర్తి..!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Movies Brahmamudi April 25th episode: కావ్యకు సవతి వచ్చినా ఫర్వాలేదా?.. నీవు నా మొగుడిని తగులుకుంటావా? అనామిక
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
3 కి.మీ ఒక్కడే కాలువ తవ్విన అపర భగీరధునికి ట్రాక్టర్ ఇచ్చిన ఆనంద్ మహీంద్రా.. ఇంతకీ ఎవరితను తెలుసా ?
గుండెల్లో దైర్యం, చేయాలనే తపన ఉన్న మనిషి ఏదైనా, ఎంత కష్టమైన సాధించగలడు. మౌంటెన్ మ్యాన్ దశరథ మాంజి అడుగుజాడలు అనుసరించి బీహార్ కి చెందిన ఒక రైతు 30 సంవత్సరాల కృషితో ఒంటరిగా మూడు కిలోమీటర్ల పొడవైన కాలువను తవ్వాడు. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.
రైతు ఒంటరిగా కృషి చేస్తున్నాడని కొంతమంది ప్రజలు కూడా ఇప్పుడు సాయం చేయడం ప్రారంభించారు. ఇప్పుడు మహీంద్రా & మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా అతనికి సహాయం చేయడానికి ముందుకు వచ్చారు.
లాంగి భూయాన్ పట్టుదలకు మెచ్చుకున్న ఆనంద్ మహీంద్రా తనకు ట్రాక్టర్ ఇవ్వమని కోరారు. నిజానికి ఆనంద్ మహీంద్రా అభిమాని ట్విట్టర్లో ఈ విధంగా ట్వీట్ చేశారు, బీహార్కు చెందిన లాంగి భూయాన్ అనే రైతు తన జీవితంలో 30 సంవత్సరాలు ఈ కాలువ తవ్వటానికి గడిపాడు. ఇప్పుడు అతను ట్రాక్టర్ తప్ప మరేమీ కోరుకోలేదు. ట్రాక్టర్ వస్తే అది అతనికి చాలా మంచిది. వారు తనను గౌరవిస్తే, అతను చాలా గర్వపడుతున్నాడని వినియోగదారు ఆనంద్ మహీంద్రాకు విజ్ఞప్తి చేశారు.
MOST READ:ఇప్పుడే చూడండి.. రూ. 3.70 లక్షల స్కాట్ సైకిల్
యూజర్ ట్వీట్పై స్పందిస్తూ ఆనంద్ మహీంద్రా, వారికి ట్రాక్టర్ ఇవ్వడం నా అదృష్టం. ఈ కాలువ తాజ్ మహల్ మరియు ఈజిప్టు పిరమిడ్ల అంతటి అద్భుతమైనది మరియు సాటిలేనిది" అని అన్నారు. ట్వీట్లో మా బృందం వారిని ఎలా చేరుకోగలదో నాకు చెప్పమని వినియోగదారుని కోరాడు.
లాంగి భూయాన్ 30 సంవత్సరాల కృషితో లాథువా ప్రాంతంలోని తన గ్రామంలో ఒక కాలువను నిర్మించాడు. గ్రామంలో నీటిపారుదల సమస్య కారణంగా వ్యవసాయంలో చాలా సమస్య ఉందని అతడు తెలిపాడు. గ్రామంలోని జంతువులన్నీ అడవిలో ఒకే చోట నీరు త్రాగడానికి వెళుతున్నాయని, భారీ వర్షాల వల్ల నీరు వృథా అవ్వడం అతడు గమనించాడు.
MOST READ:రవాణా వాహనాల వేగపరిమితిని స్పష్టం చేసిన హైకోర్టు.. ఏం చెప్పిందో తెలుసా ?
ఇక్కడ నుండి కాలువను తయారు చేస్తే, నీరు వృథా కాదని, వ్యవసాయానికి ఉపయోగపడుతుందని తన మనస్సులో ఆలోచన వచ్చిందని ఆయన వివరించారు. ఆలోచన వచ్చిన వెంటనే కాలువ తవ్వడం ప్రారంభించాడు.
ఇమామ్గంజ్, బ్యాంకేబజార్ బ్లాకుల సరిహద్దు వద్ద లాంగి భూయాన్ 3 కిలోమీటర్ల పొడవు, నాలుగు అడుగుల వెడల్పు మరియు 3 అడుగుల లోతులో ఒక కాలువ తవ్వారు. లాంగి భార్య 65 ఏళ్ల రామ్రాతి దేవి అతన్ని ఎప్పుడూ ఆపలేదు.
MOST READ:నమ్మండి.. ఇది నిజంగా రాయల్ ఎన్ఫీల్డ్ థండర్బర్డ్ 350 బైక్
అతను తవ్వడం ప్రారంభించినప్పుడు, ప్రజలు అతనిని ఎగతాళి చేసారు అంతే కాకుండా అతడు పిచ్చిగా ఈ పనులు చేస్తున్నాడని హేళన చేసారు. ఎవరు ఎమన్నా అతను తన పనిని కొనసాగించాడు. నేడు సుమారు మూడు కిలోమీటర్ల పొడవైన కాలువ నిర్మించబడింది. వారి పనిని చూసి, నీటి శాఖ అధికారులు ఒక పెద్ద శిఖరాన్ని నిర్మించారు, దీనికి లాంగి అహర్ అని పేరు పెట్టారు.