Just In
- 1 hr ago కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- 4 hrs ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- 7 hrs ago కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- 14 hrs ago మారుతి స్విఫ్ట్ ధరలు పెరిగాయండోయ్!.. ఇప్పుడే తెలుసుకోండి
Don't Miss
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
- Technology ఎయిర్ కండిషనర్ AC ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఇవి తెలుసుకోండి..!
- News నాకు అండగా, చీకటిలో వెలుగుగా..
- Travel వేసవిలో సందర్శించేందుకు దేశంలోని బెస్ట్ ఆఫ్బీట్ హిల్ స్టేషన్లు ఇవే..
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Movies Market Mahalakshmi Review: మార్కెట్ మహాలక్ష్మీ మెప్పించిందా? మూవీ ఎలా ఉందంటే?
3 కి.మీ ఒక్కడే కాలువ తవ్విన అపర భగీరధునికి ట్రాక్టర్ ఇచ్చిన ఆనంద్ మహీంద్రా.. ఇంతకీ ఎవరితను తెలుసా ?
గుండెల్లో దైర్యం, చేయాలనే తపన ఉన్న మనిషి ఏదైనా, ఎంత కష్టమైన సాధించగలడు. మౌంటెన్ మ్యాన్ దశరథ మాంజి అడుగుజాడలు అనుసరించి బీహార్ కి చెందిన ఒక రైతు 30 సంవత్సరాల కృషితో ఒంటరిగా మూడు కిలోమీటర్ల పొడవైన కాలువను తవ్వాడు. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.
రైతు ఒంటరిగా కృషి చేస్తున్నాడని కొంతమంది ప్రజలు కూడా ఇప్పుడు సాయం చేయడం ప్రారంభించారు. ఇప్పుడు మహీంద్రా & మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా అతనికి సహాయం చేయడానికి ముందుకు వచ్చారు.
లాంగి భూయాన్ పట్టుదలకు మెచ్చుకున్న ఆనంద్ మహీంద్రా తనకు ట్రాక్టర్ ఇవ్వమని కోరారు. నిజానికి ఆనంద్ మహీంద్రా అభిమాని ట్విట్టర్లో ఈ విధంగా ట్వీట్ చేశారు, బీహార్కు చెందిన లాంగి భూయాన్ అనే రైతు తన జీవితంలో 30 సంవత్సరాలు ఈ కాలువ తవ్వటానికి గడిపాడు. ఇప్పుడు అతను ట్రాక్టర్ తప్ప మరేమీ కోరుకోలేదు. ట్రాక్టర్ వస్తే అది అతనికి చాలా మంచిది. వారు తనను గౌరవిస్తే, అతను చాలా గర్వపడుతున్నాడని వినియోగదారు ఆనంద్ మహీంద్రాకు విజ్ఞప్తి చేశారు.
MOST READ:ఇప్పుడే చూడండి.. రూ. 3.70 లక్షల స్కాట్ సైకిల్
యూజర్ ట్వీట్పై స్పందిస్తూ ఆనంద్ మహీంద్రా, వారికి ట్రాక్టర్ ఇవ్వడం నా అదృష్టం. ఈ కాలువ తాజ్ మహల్ మరియు ఈజిప్టు పిరమిడ్ల అంతటి అద్భుతమైనది మరియు సాటిలేనిది" అని అన్నారు. ట్వీట్లో మా బృందం వారిని ఎలా చేరుకోగలదో నాకు చెప్పమని వినియోగదారుని కోరాడు.
లాంగి భూయాన్ 30 సంవత్సరాల కృషితో లాథువా ప్రాంతంలోని తన గ్రామంలో ఒక కాలువను నిర్మించాడు. గ్రామంలో నీటిపారుదల సమస్య కారణంగా వ్యవసాయంలో చాలా సమస్య ఉందని అతడు తెలిపాడు. గ్రామంలోని జంతువులన్నీ అడవిలో ఒకే చోట నీరు త్రాగడానికి వెళుతున్నాయని, భారీ వర్షాల వల్ల నీరు వృథా అవ్వడం అతడు గమనించాడు.
MOST READ:రవాణా వాహనాల వేగపరిమితిని స్పష్టం చేసిన హైకోర్టు.. ఏం చెప్పిందో తెలుసా ?
ఇక్కడ నుండి కాలువను తయారు చేస్తే, నీరు వృథా కాదని, వ్యవసాయానికి ఉపయోగపడుతుందని తన మనస్సులో ఆలోచన వచ్చిందని ఆయన వివరించారు. ఆలోచన వచ్చిన వెంటనే కాలువ తవ్వడం ప్రారంభించాడు.
ఇమామ్గంజ్, బ్యాంకేబజార్ బ్లాకుల సరిహద్దు వద్ద లాంగి భూయాన్ 3 కిలోమీటర్ల పొడవు, నాలుగు అడుగుల వెడల్పు మరియు 3 అడుగుల లోతులో ఒక కాలువ తవ్వారు. లాంగి భార్య 65 ఏళ్ల రామ్రాతి దేవి అతన్ని ఎప్పుడూ ఆపలేదు.
MOST READ:నమ్మండి.. ఇది నిజంగా రాయల్ ఎన్ఫీల్డ్ థండర్బర్డ్ 350 బైక్
అతను తవ్వడం ప్రారంభించినప్పుడు, ప్రజలు అతనిని ఎగతాళి చేసారు అంతే కాకుండా అతడు పిచ్చిగా ఈ పనులు చేస్తున్నాడని హేళన చేసారు. ఎవరు ఎమన్నా అతను తన పనిని కొనసాగించాడు. నేడు సుమారు మూడు కిలోమీటర్ల పొడవైన కాలువ నిర్మించబడింది. వారి పనిని చూసి, నీటి శాఖ అధికారులు ఒక పెద్ద శిఖరాన్ని నిర్మించారు, దీనికి లాంగి అహర్ అని పేరు పెట్టారు.