Just In
- 13 hrs ago వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- 14 hrs ago వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- 15 hrs ago 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- 15 hrs ago 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
Don't Miss
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Movies బాయ్ ఫ్రెండ్తో శృతి హాసన్ బ్రేకప్? ఆ విషయంలో సమంతను ఫాలో అయిన బ్యూటీ!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కరోనా ఎఫెక్ట్ : ఇతరులు తమ రాష్ట్రంలోకి రాకుండా రోడ్డుపైనే గోడ నిర్మాణం
కరోనా వైరస్ వ్యాపించడం వల్ల భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించబడింది. ఈ లాక్ డౌన్ కారణంగా వాహనసేవలన్నీ రద్దుచేయబడ్డాయి. అంతే కాకుండా దేశ వ్యాప్తంగా ప్రజలు బయటకు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. అత్యవసర సమయాల్లో తప్ప బయటకు రాకూడదని అధికారులు అంలక్షలు విధించారు. ఈ కారణంగా ఒక రాష్ట్రంలోని ప్రజలు ఇతర రాష్ట్రాలలోకి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
కరోనావైరస్ వ్యాప్తిని నివారించడానికి మరియు లాక్ డౌన్ చర్యలను కఠినంగా విధించడానికి ఆంధ్ర సరిహద్దు వద్ద 7 అడుగుల గోడలను నిర్మించాలని తమిళనాడు ప్రభుత్వం ఆదేశించింది.
దేశంలో కరోనావైరస్ లాక్ డౌన్ మధ్య వాహనాల రాకపోకలను ఆపడానికి తమిళనాడు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో రహదారులకు అడ్డంగా గోడను నిర్మించింది. దాదాపు 7 అడుగుల వరకు రహదారిపై గోడను నిర్మించింది. ఈ గోడను చిత్తూరు-గుడియతం రహదారిపై రెండు కీ ఎంట్రీ మరియు ఎగ్జిట్ పాయింట్ల వద్ద నిర్మించారు.
MOST READ:భారత్ లో ప్రారంభం కానున్న నెక్జు మొబిలిటీ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్స్
ప్రస్తుతం భారతదేశంలో రెండవ దశ లాక్ డౌన్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వాహనాల రాకపోకలను పూర్తిగా నిరోధించడానికి ఆంధ్ర సరిహద్దు వద్ద గోడలను నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు.
సరిహద్దు ప్రాంతాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఆంక్షలు విధించాయి మరియు అవసరమైన సేవలను మినహాయించి వాహనాల కదలికను అనుమతించలేదు.
MOST READ:మంచులో చిక్కుకున్న అధికారిని రక్షించిన ఇండియన్ ఆర్మీ [వీడియో]
కరోనా వైరస్ కేసులు మరింత పెరగకుండా ఉండటానికి చట్ట ప్రకారం ఈ చర్య తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు ఇండియా టుడేకు ప్రకటించాయి.
తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్ రెండూ ఇప్పటివరకు వెయ్యికి పైగా కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో 1,885 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే 1,097 కేసులు నమోదయ్యాయి.
MOST READ:ఇండియాలో 5 అత్యంత చీప్ & బెస్ట్ బిఎస్ 6 కార్లు
కోవిడ్ -19 రోగుల సంఖ్య ఆదివారం తమిళనాడులో 1,000 సంఖ్యను దాటాయి, తమిళనాడు రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల నుండి 60 మంది డిశ్చార్జ్ అయ్యారు.
ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్లో కూడా కరోనా వైరస్ కేసులు పెరుగుదల కొనసాగుతోంది. అయితే ఇప్పటివరకు వివిధ జిల్లాల్లోని 231 మంది కరోనావైరస్ రోగులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని నివేదికలు తెలిపాయి.
MOST READ:పోర్స్చే ఓనర్ తో గుంజిళ్ళు తీయించిన పోలీసులు, ఎందుకో తెలుసా..?