Just In
- 10 hrs ago వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- 13 hrs ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- 15 hrs ago కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- 18 hrs ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
Don't Miss
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Movies Paarijatha Parvam Review సునీల్, చైతన్య రావు క్రైమ్ కామెడీ ఎలా ఉందంటే? పారిజాత పర్వం రివ్యూ
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
కరోనా ఎఫెక్ట్ : ఇతరులు తమ రాష్ట్రంలోకి రాకుండా రోడ్డుపైనే గోడ నిర్మాణం
కరోనా వైరస్ వ్యాపించడం వల్ల భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించబడింది. ఈ లాక్ డౌన్ కారణంగా వాహనసేవలన్నీ రద్దుచేయబడ్డాయి. అంతే కాకుండా దేశ వ్యాప్తంగా ప్రజలు బయటకు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. అత్యవసర సమయాల్లో తప్ప బయటకు రాకూడదని అధికారులు అంలక్షలు విధించారు. ఈ కారణంగా ఒక రాష్ట్రంలోని ప్రజలు ఇతర రాష్ట్రాలలోకి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
కరోనావైరస్ వ్యాప్తిని నివారించడానికి మరియు లాక్ డౌన్ చర్యలను కఠినంగా విధించడానికి ఆంధ్ర సరిహద్దు వద్ద 7 అడుగుల గోడలను నిర్మించాలని తమిళనాడు ప్రభుత్వం ఆదేశించింది.
దేశంలో కరోనావైరస్ లాక్ డౌన్ మధ్య వాహనాల రాకపోకలను ఆపడానికి తమిళనాడు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో రహదారులకు అడ్డంగా గోడను నిర్మించింది. దాదాపు 7 అడుగుల వరకు రహదారిపై గోడను నిర్మించింది. ఈ గోడను చిత్తూరు-గుడియతం రహదారిపై రెండు కీ ఎంట్రీ మరియు ఎగ్జిట్ పాయింట్ల వద్ద నిర్మించారు.
MOST READ:భారత్ లో ప్రారంభం కానున్న నెక్జు మొబిలిటీ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్స్
ప్రస్తుతం భారతదేశంలో రెండవ దశ లాక్ డౌన్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వాహనాల రాకపోకలను పూర్తిగా నిరోధించడానికి ఆంధ్ర సరిహద్దు వద్ద గోడలను నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు.
సరిహద్దు ప్రాంతాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఆంక్షలు విధించాయి మరియు అవసరమైన సేవలను మినహాయించి వాహనాల కదలికను అనుమతించలేదు.
MOST READ:మంచులో చిక్కుకున్న అధికారిని రక్షించిన ఇండియన్ ఆర్మీ [వీడియో]
కరోనా వైరస్ కేసులు మరింత పెరగకుండా ఉండటానికి చట్ట ప్రకారం ఈ చర్య తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు ఇండియా టుడేకు ప్రకటించాయి.
తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్ రెండూ ఇప్పటివరకు వెయ్యికి పైగా కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో 1,885 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే 1,097 కేసులు నమోదయ్యాయి.
MOST READ:ఇండియాలో 5 అత్యంత చీప్ & బెస్ట్ బిఎస్ 6 కార్లు
కోవిడ్ -19 రోగుల సంఖ్య ఆదివారం తమిళనాడులో 1,000 సంఖ్యను దాటాయి, తమిళనాడు రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల నుండి 60 మంది డిశ్చార్జ్ అయ్యారు.
ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్లో కూడా కరోనా వైరస్ కేసులు పెరుగుదల కొనసాగుతోంది. అయితే ఇప్పటివరకు వివిధ జిల్లాల్లోని 231 మంది కరోనావైరస్ రోగులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని నివేదికలు తెలిపాయి.
MOST READ:పోర్స్చే ఓనర్ తో గుంజిళ్ళు తీయించిన పోలీసులు, ఎందుకో తెలుసా..?