Just In
- 11 hrs ago గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- 12 hrs ago 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- 14 hrs ago జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- 17 hrs ago జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
Don't Miss
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Movies డైరెక్టర్లకు అమ్మాయిలను సప్లై.. సీనియర్ ఆర్టిస్ట్ చీకటి కోణం వెనుక వాస్తవం అదేనట!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఆంధ్రప్రదేశ్లో కరోనా ఈ-పాస్ పొందాలంటే ఇలా చేయండి
భారతదేశంలో కరోనా మహమ్మారి చాప కింద నీరులాగా చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ మహమ్మారి వ్యాప్తిని నిరోధించడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కఠినమైన చర్యలు తీసుకుంటున్నాయి. భారతదేశంలో కరోనా కేసులు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఆంద్రప్రదేశ్ ఒకటి. కావున ఆంధ్రప్రదేశ్ లో కూడా కఠినమైన ఆంక్షలు విధించబడ్డాయి.
ప్రస్తుతం కరోనా నివారణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చాలా కఠినమైన చర్యలు తీసుకుంటూ లాక్ డౌన్ విధించింది. ఈ లాక్ డౌన్ సమయంలో ఎవరైనా వాహనదారులు బయటకి వస్తే వారిపై చర్యలు తీసుకోబడతాయి. అయితే అత్యవసర సమయంలో మాత్రం కొన్ని నియమాలతో బయటకు రావడానికి అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అత్యవసర సమయంలో బయటకు రావడానికి ఈ-పాస్ అమలు చేయబడింది. కావున ఈ-పాస్ అవసరమైన వ్యక్తులు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా అప్లై చేసుకున్న వారైయు లాక్ డౌన్ సమయంలో బయటకు రావడానికి అర్హులు. ఈ పాస్ కావాలనుకునే వారు appolice.gov.in అనే వెబ్ సైట్ లో పొందవచ్చు.
MOST READ:ఆనంద్ మహీంద్రా ట్వీట్; బహుశా.. ఇదోరకమైన సామజిక దూరమేమో
అత్యవసర సమయంలో మాత్రమే సంబంధిత పత్రాలతో ఈ ఈ పాస్ పొందాలని ఆంధ్రప్రదేశ్ డిజిపి గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఈ కరోనా ఈ పాస్ పొందే విధానం ఎలాగో ఈ క్రింద చూడండి.
ఇక్కడ appolice.gov.in వెబ్ సైట్ పై క్లిక్ చేసిన వెంటనే పేరు, చిరునామా మరియు ఫోటో వంటివి ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. తరువాత ఏ అవసరంతో ప్రయాణించాలనుకునుటున్నారు అని నిర్దారించాలి. అప్లై చేసుకునే వారి ప్రజెంట్ అడ్రస్, చేరుకోవాల్సిన అడ్రస్ పొందుపరచాలి.
తర్వాత ప్రయాణం ఒకసారి వెళ్లాలా లేకుంటే వెళ్లి తిరిగి రావాలా అనే దాన్ని కూడా ఇక్కడ తెలియజేసి, ప్రయాణానికి కచ్చితమైన కారణం తెలియజేయాలి, మరియు ప్రయాణానికి సొంతవాహనమా లేక ప్రజా రవాణా అని తెలియజేయాలి. ఇందులో ఎంతమంది ప్రయాణించాలి, వారి పేర్లు ఫోన్ నంబర్స్ మరియు గుర్తింపు కార్స్ సమర్పించాలి.
కరోనా కి సంబంధించిన ఏవైనా లక్షణాలు ఉన్నాయా లేదా అని ముంచుగానే ఇక్కడ తెలియపరచాలి. అంతే కాకుండా గతంలో క్వారంటైన్ లో ఉన్నారా లేదా అని నిర్దారించాలి. ఈ విధంగా అప్లై చేసుకున్న వారికి కేవలం గంట వ్యవధిలోనే ఈ పాస్ మంజూరు చేయడానికి ప్రయత్నిస్తుందని, ప్రభుత్వం స్పష్టం చేసింది.
MOST READ:తోటి వ్యక్తి అంత్యక్రియలకు నిరాకరించిన గ్రామస్థులు.. పిఎఫ్ఐ టీమ్ రాకతో కథ సుఖాంతం
ఇదిలా ఉండగా టీవీ9 కథనంలో వచ్చిన దాని ప్రకారం ప్రతి జిల్లాకు సంభందించిన అధికారుల మొబైల్ నంబర్స్ మరియు మెయిల్ ఐడి లు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా కూడా కరోనా ఈ-పాస్ పొందవచ్చు. ఏది ఏమైనా ఈ కరోనా నివారణలో ప్రభుత్వం చేస్తున్న కృషికి మన వంతు కూడా మద్దతుగా వీలైనంతవరకు ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండటానికి ప్రయత్నించాలి.
NOTE: ఇక్కడ ఉపయోగించిన ఫోటోలు కేవలం రిఫరెన్స్ కోసం మాత్రమే