Just In
- 53 min ago మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- 14 hrs ago వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- 17 hrs ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- 20 hrs ago కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
Don't Miss
- News అభ్యర్దుల మార్పు పై చంద్రబాబు కీలక నిర్ణయం - ఆ నేతలకు పిలుపు..!!
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్కు రావట్లేదు- CSK కోచ్
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Movies Karthika Deepam 2 April 20th: దీపపై పగతో రగిలిపోతున్న నర్సింహ.. శౌర్యని ఇక్కడే చదివిస్తానంటున్న దశరద్!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
నగరిలో అంబులెన్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే ఆర్.కె రోజా
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల 1000 కి పైగా అంబులెన్సులను ప్రారంభించిన విషయం విదితమే, అత్యవసర పరిస్థితులలో ప్రజలకు సేవ చేయడానికి మరియు అధునాతన పద్దతులలో వైద్యం అందించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో విజయవాడలో అంబులెన్సులను ప్రారంభించారు.
ఈ నేపథ్యంలో భాగంగా నగరి నియోజక వర్గంలో అంబులెన్సులను నియోజక వర్గ ఎమ్మెల్యే రోజా ప్రారంభించింది. ఈ అంబులెన్సులు ప్రారంభించడానికి రోజా పూజ చేసి ప్రారంభించింది. ఇక్కడ ఉన్న వీడియోలో మనం గమనించినట్లయితే రోజా అంబులెన్సుని డ్రైవ్ చేయడం మనం చూడవచ్చు.
ఆంధ్రప్రదేశ్లోని నగరి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన దక్షిణ భారత మాజీ నటి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్.కె రోజా మంగళవారం మధ్యాహ్నం కొత్తగా ప్రవేశపెట్టిన 108 అంబులెన్స్ డ్రైవింగ్ చేయడం, ఫోటోలకు పోజు ఇవ్వడం వంటివి చిత్తూరు జిల్లాలోని నియోజకవర్గంలో వీడియోలలో చిత్రీకరించడం జరిగింది.
MOST READ:టెక్నికల్ గురూజీ లగ్జరీ కార్లు & బైక్లు, ఎలా ఉన్నాయో చూసారా ?
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్-19 పాజిటివ్ కేసులు అధికంగా పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ రోగులను ఆసుపత్రులు మరియు టెస్టింగ్ కేంద్రాలకు తీసుకెళ్లడానికి అంబులెన్స్లకు భారీ డిమాండ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ లో 2020 జూలై 7 న రాష్ట్రంలో 1178 కొత్త కేసులు నమోదయ్యాయి, రాష్ట్రంలో ప్రస్తుత కేసుల మొత్తం 21,197 కు చేరుకోగా, 13 మరణాలతో కలిపి మొత్తం మరణాల సంఖ్య 252 కు చేరుకున్నాయి.
మాజీ తెలుగు సినీ నటి రోజా పార్టీలో బహిరంగ పరస్పర చర్యలకు పాల్పడినందుకు చాలాసార్లు విమర్శలు ఎదుర్కొన్నారు. ఏప్రిల్ 21 న లాక్ డౌన్ మార్గదర్శకాలను పూర్తిగా ఉల్లంఘిస్తూ, ఆమె తన నియోజకవర్గంలోని ఒక గ్రామానికి ఒక బోర్వెల్ ప్రారంభోత్సవం చేయటానికి వెళ్ళింది. అక్కడ బోర్వెల్ ప్రారంభించడానికి ఆమె నడుచుకుంటూ వెళుతుండగా గ్రామస్తులు తన ముందు గులాబీ పూల రేకులను పరిచారు.
MOST READ:మరోసారి వైరల్ అయిన మహేంద్ర సింగ్ ధోని వీడియో : అదేంటో తెలుసా !
స్థానిక రెవెన్యూ శాఖ అధికారుల సూచనల మేరకు పలువురు మహిళలు, పిల్లలతో సహా గ్రామస్తులు మాస్కులు ధరించి గ్రామ రహదారిలో నిలబడి ఆమె నడుచుకుంటూ వెళ్లే దారిలో గులాబీ రేకులను పరిచారు. ఆ సమయంలో కూడా చాల విమర్శలు ఎదుర్కొంది. కానీ దీనికి సమాధానంగా తనని అలా ఆహ్వానించమని ఆమె వారికి సూచించలేదని రోజా చెప్పారు. వారు తన కోసం పువ్వులు పడటానికి వేచి ఉన్నారని నాకు తెలియదని చెప్పారు.
భారతదేశంలో కరోనా అధికంగా విస్తరిస్తున్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి. కరోనా వైరస్ నివారణలో భాగంగా ప్రజలకు అత్యవసర సమయంలో సేవ చేయడానికి అధునాతన టెక్నాలజీ కలిగిన అంబులెన్సులను ప్రారంభించదమే కాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా కరోనా టెస్టులు అధికంగా నిర్వహిస్తున్నారు.
MOST READ:అందుబాటులోకి రానున్న టెస్లా స్మాల్ షార్ట్స్ ; చూసారా ?