Just In
- 6 hrs ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 7 hrs ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 8 hrs ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 9 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
Don't Miss
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Movies కరీనా కపూర్ పోలిటికల్ ఎంట్రీ!.. ఏ పార్టీలో చేరి.. ఎక్కడ నుంచి పోటీ అంటే?
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
నగరిలో అంబులెన్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే ఆర్.కె రోజా
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల 1000 కి పైగా అంబులెన్సులను ప్రారంభించిన విషయం విదితమే, అత్యవసర పరిస్థితులలో ప్రజలకు సేవ చేయడానికి మరియు అధునాతన పద్దతులలో వైద్యం అందించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో విజయవాడలో అంబులెన్సులను ప్రారంభించారు.
ఈ నేపథ్యంలో భాగంగా నగరి నియోజక వర్గంలో అంబులెన్సులను నియోజక వర్గ ఎమ్మెల్యే రోజా ప్రారంభించింది. ఈ అంబులెన్సులు ప్రారంభించడానికి రోజా పూజ చేసి ప్రారంభించింది. ఇక్కడ ఉన్న వీడియోలో మనం గమనించినట్లయితే రోజా అంబులెన్సుని డ్రైవ్ చేయడం మనం చూడవచ్చు.
ఆంధ్రప్రదేశ్లోని నగరి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన దక్షిణ భారత మాజీ నటి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్.కె రోజా మంగళవారం మధ్యాహ్నం కొత్తగా ప్రవేశపెట్టిన 108 అంబులెన్స్ డ్రైవింగ్ చేయడం, ఫోటోలకు పోజు ఇవ్వడం వంటివి చిత్తూరు జిల్లాలోని నియోజకవర్గంలో వీడియోలలో చిత్రీకరించడం జరిగింది.
MOST READ:టెక్నికల్ గురూజీ లగ్జరీ కార్లు & బైక్లు, ఎలా ఉన్నాయో చూసారా ?
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్-19 పాజిటివ్ కేసులు అధికంగా పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ రోగులను ఆసుపత్రులు మరియు టెస్టింగ్ కేంద్రాలకు తీసుకెళ్లడానికి అంబులెన్స్లకు భారీ డిమాండ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ లో 2020 జూలై 7 న రాష్ట్రంలో 1178 కొత్త కేసులు నమోదయ్యాయి, రాష్ట్రంలో ప్రస్తుత కేసుల మొత్తం 21,197 కు చేరుకోగా, 13 మరణాలతో కలిపి మొత్తం మరణాల సంఖ్య 252 కు చేరుకున్నాయి.
మాజీ తెలుగు సినీ నటి రోజా పార్టీలో బహిరంగ పరస్పర చర్యలకు పాల్పడినందుకు చాలాసార్లు విమర్శలు ఎదుర్కొన్నారు. ఏప్రిల్ 21 న లాక్ డౌన్ మార్గదర్శకాలను పూర్తిగా ఉల్లంఘిస్తూ, ఆమె తన నియోజకవర్గంలోని ఒక గ్రామానికి ఒక బోర్వెల్ ప్రారంభోత్సవం చేయటానికి వెళ్ళింది. అక్కడ బోర్వెల్ ప్రారంభించడానికి ఆమె నడుచుకుంటూ వెళుతుండగా గ్రామస్తులు తన ముందు గులాబీ పూల రేకులను పరిచారు.
MOST READ:మరోసారి వైరల్ అయిన మహేంద్ర సింగ్ ధోని వీడియో : అదేంటో తెలుసా !
స్థానిక రెవెన్యూ శాఖ అధికారుల సూచనల మేరకు పలువురు మహిళలు, పిల్లలతో సహా గ్రామస్తులు మాస్కులు ధరించి గ్రామ రహదారిలో నిలబడి ఆమె నడుచుకుంటూ వెళ్లే దారిలో గులాబీ రేకులను పరిచారు. ఆ సమయంలో కూడా చాల విమర్శలు ఎదుర్కొంది. కానీ దీనికి సమాధానంగా తనని అలా ఆహ్వానించమని ఆమె వారికి సూచించలేదని రోజా చెప్పారు. వారు తన కోసం పువ్వులు పడటానికి వేచి ఉన్నారని నాకు తెలియదని చెప్పారు.
భారతదేశంలో కరోనా అధికంగా విస్తరిస్తున్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి. కరోనా వైరస్ నివారణలో భాగంగా ప్రజలకు అత్యవసర సమయంలో సేవ చేయడానికి అధునాతన టెక్నాలజీ కలిగిన అంబులెన్సులను ప్రారంభించదమే కాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా కరోనా టెస్టులు అధికంగా నిర్వహిస్తున్నారు.
MOST READ:అందుబాటులోకి రానున్న టెస్లా స్మాల్ షార్ట్స్ ; చూసారా ?