చైనాలో బుల్లెట్ రైలులో ప్రయాణించి, పరీక్షించిన చంద్రబాబు నాయుడు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నపుడు హైదరాబాద్లోని మెట్రో రైలు ప్రాజెక్ట్తో తెలుగు వారు సంతోషపడే వారు. కాని విభజించిన తరువాత ఆంధ్రప్రదేశ్ కనీసం సదుపాయాలు కూడా నోచుకునే స్థితిలో లేదు. ఈ పరిస్థితిలో ఏపి సిఎం చంద్రబాబు నాయుడు గారు అమరావతి నుండి వివిధ ప్రదేశాలకు బుల్లెట్ రైలు నడపాలనే ఆలోచనలో ఉన్నారు.
చైనా పర్యటనకు వెళ్లినపుడు తన భావన చెప్పాడు. చైనా పర్యటనలో చంద్రబాబు నాయుడు బుల్లెట్ రైలును పరీక్షించారు. వాటి పట్ల ఎంతో ఆకర్షితుడైన బాబు ఎలాగైనా అమరావతిలో వీటిని పరుగులు పెట్టించాలని అనుకుంటున్నాడు.

ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ విడిపోయి ఉండకపోతే తెలుగు ప్రజల మహానగరమైన భాగ్యనగరంలోని మెట్రోతో తృప్తి పడేవారు. కాని రాష్ట్రం వేరు కావడం వలన రాజధాని కూడా వేరయ్యింది. ఇపుడిప్పుడే రూపుదిద్దుకుంటున్న అమరాతి రాజధాని మెట్రో జోలికెళ్లడం కాస్త ఆలస్యమే. కాని చైనా పర్యటనకు వెళ్లిన ఎపి సిఎం బుల్లెట్ రైలులో ప్రయాణించి అమరావతి నుండి కూడా బుల్లెట్ రైళ్లను నడపాలని భావించాడు.

చైనాలోని టియాంజిన్ నుండి బీజింగ్ వరకు బుల్లెట్ రైలులో ప్రయాణించిన చంద్రబాబు అమరావతి నుండి హైదరాబాద్ మరియు విశాఖపట్టణానికి బుల్లెట్ లైదా హై స్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టే అంశాల గురించి ప్రస్తావించాడు.

హైదరాబాద్ నుండి అంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ప్రత్యేకించి విజయవాడకు కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభు మరియు ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారుల సమక్షంలో జూన్ 20, 2016 న సూపర్ ఫాస్ట్ రైలును ప్రారంభించారు.

ఈ మధ్య కాలంలోనే సిఎం చైనా పర్యటనకేగాడు. అయితే అక్కడ అధికారులతో బుల్లెట్ రైలు వ్యవస్థ గురించి అన్ని వివరాలు అడిగితెలుసుకున్నాడు. అయితే దీనికి సంభందించి సిఎం ప్రత్యేక వ్యూహంతో ఉన్నట్లు తెలుస్తోంది.

చైనాలోని టియాంజిన్ నుండి చైనా రాజధాని నగరం బీజింగ్ మధ్య ఉన్న 140 కిలోమీటర్ల దూరాన్ని బుల్లెట్ రైలులో కేవలం 31 నిమిషాల వ్యవధిలోనే ప్రయాణించాడు.

సిఎం ప్రయాణించిన రైలు గంటకు 295 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాయి. అయితే బుల్లెట్ రైలు ప్రయాణం పట్ల చంద్రబాబు నాయుడు ఎంతో ఆకర్షితుడయ్యాడు.

వేగంగానే కాకుండా ఎంతో సౌకర్యవంతమైన మరియు భద్రమైన ప్రయాణించే కలిగించే బుల్లెట్ రైలు ప్రాజెక్టును, కేంద్రంతో చర్చించి రాష్ట్రానికి తీసుకువచ్చే సానుకూల అవకాశాలు కనబడుతున్నాయి.

దక్షిణ భారతదేశంలో అతి పెద్ద నగరాలైన హైదరాబాద్, బెంగళూరు మరియు చెన్నై వంటి నగరాలకు కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే చేరుకునే అవసరం చాలా మందికి ఉంది. ముఖ్యంగా కొత్తగా ఏర్పడిన అమరవాతి ఇది ఇంకా ఎంతో అవసరం. ఈ మూడు నగరాలను బుల్లెట్ రైళ్లతో అనుసంధానం చేస్తే, దేశ అభివృద్ది అంతే వేగం పుంజుకుంటుంది. దీనికి కేంద్ర చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అత్యంత పొడవు మేరక బుల్లెట్ రైళ్లను నిర్వహిస్తోన్న దేసం చైనా ఒక్కటే. అంతే కాకుండా బుల్లెట్ రైళ్ల తయారీ మరియు ఇతర దేశాలలో బుల్లెట్ రైలు ప్రాజెక్టులను చేపట్టే విషయం పరంగా చూసినా చైనా ముందులోనే ఉంది. బహుశా ఈ కారణం చేతనో ఏమో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చైనా పర్యటనకు ఆసక్తి చూపాడు. అయితే బుల్లెట్ రైళ్ల వినియోగం ఆ యా ప్రాంతాల అభివృద్ది ఎక్కువ ప్రభావం చూపిస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

రవాణా రంగంలో అభివృద్దిని పరుగులు పెట్టించిన బాబు

ఏపి సిఎం చంద్రబాబు నాయుడు గురించి మీకు ఎంత వరకు తెలుసు ?

సముద్రంలో పరుగులు పెట్టనున్న భారతదేశపు మొదటి బుల్లెట్ రైలు


Click it and Unblock the Notifications








