కరోనా టైమ్లో ఆటో సర్వీస్ ఫ్రీ.. కేవలం వారికి మాత్రమే.. ఎక్కడంటే
భారతదేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ చాలా భయంకరంగా వ్యాపిస్తోంది. కరోనా మహమ్మారి భారిన పడి ప్రతిరోజూ లక్షలాది మంది మరణిస్తున్నారు. నివేదికల ప్రకారం భారతదేశంలో ఇప్పటికే 1 కోటి మందికి పైగా ప్రజలు కరోనా వైరస్ బారిన పడినట్లు తెలుస్తోంది.

రోజురోజుకి కరోనా తీవ్రత ఎక్కువవుతున్న సందర్భంగా ప్రజలు ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని భయపడుతున్నారు. కరోనావైరస్ సంక్రమణ వ్యాప్తి చెందకుండా ఉండటానికి కేంద్ర ప్రభుత్వం మరియు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుంటున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో దాదాపు వారం రోజుల పాటు లాక్డౌన్ అమలు చేయడం జరిగింది.

మరికొన్ని రాష్ట్రాల్లో కరోనా నైట్ కర్ఫ్యూ అమలులో ఉంది. కరోనా సోకినా రోగులకు వైద్యులు నిరంతరం అలుపులేకుండా 24 గంటలూ చికిత్స చేస్తున్నారు. వైద్యులు మాత్రమే కాకుండా కొంతమంది వ్యక్తులు తమకు తాముగా స్వచ్చందంగా సహాయపడటానికి ముందుకు వస్తున్నారు.

ఈ విధంగా సహాయం చేస్తున్న వారికి తన వంతుగా సహాయం చేయాలని ఒక ఆటో డ్రైవర్ ముందుకు వచ్చాడు. అతడు చేస్తున్న సహాయంతో ప్రజల దృష్టిని ఎంతగానో ఆకర్షిస్తున్నాడు. జార్ఖండ్లోని రాంచీలో నివసిస్తున్న రవి అగర్వాల్, ఆటో డ్రైవర్, యితడు ఇంతకుముందు కరోనావైరస్ బారిన పది కోలుకున్నాడు.

రవి అగర్వాల్ తన ఆటోలో అత్యవసర పరిస్థితుల్లో ఫ్రీ సర్వీస్ అనే పోస్టర్లను అతికించారు. అంతే కాకుండా అతడు తమ మొబైల్ నంబర్లను ఈ పోస్టర్లో పొందుపరిచయాడు. ఈ విధంగా తన మొబైల్ నెంబర్ అందుబాటులో ఉండటం వళ్ళ అత్యవసర సమయంలో అతడు సహాయం చేయడానికి వీలుగా ఉంటుంది.

ఈ సమాచారాన్ని మరింత అందుబాటులోకి తీసుకురావడానికి మరియు ప్రచారాన్ని మరింతగా పెంచడానికి రవి అగర్వాల్ సోషల్ నెట్వర్కింగ్ సైట్లను కూడా సద్వినియోగం చేసుకున్నారు. అతడు తమ మొబైల్ నంబర్లను సోషల్ నెట్వర్కింగ్ సైట్లో కూడా అందించాడు.

ఈ ప్రచారం గురించి మాట్లాడుతూ రవి అగర్వాల్ ఈ ప్రచారాన్ని ఏప్రిల్ 15 న ప్రారంభించారు. ఒక మహిళ ఆ సమయంలో రిమ్స్ ఆసుపత్రికి వెళ్లాలనుకుంది. కానీ ఎవరూ అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లలేదు. ఆ సమయంలో తానూ ఆసుపత్రి నుండి బయలుదేరాను అని చెప్పారు.

అత్యవసర సమయంలో ఆసుపత్రికి వెళ్లవలసిన ప్రతి ఒక్కరికీ నేను ఫ్రీ సర్వీస్ అందిస్తున్నాను. ఇందుకోసం నేను నా మొబైల్ నంబర్ను సోషల్ నెట్వర్కింగ్ సైట్లో ఇచ్చాను. అవసరమైన వారు నన్ను సులభంగా సంప్రదించవచ్చని ఆయన అన్నారు.

ఇదే విధంగా బీహార్ కి చెందిన 'గౌరవ్ రాయ్' రోగులకు ఆక్సిజన్ సిలిండర్లను ఉచితంగా అందిస్తూ ఆక్సిజన్ మ్యాన్ గా కీర్తి పొందుతున్నాడు. ఆక్సిజన్ మ్యాన్ గౌరవ్ రాయ్ కూడా ఎలాంటి డబ్బు ఆశించకుండా స్వచ్చందంగా సేవ చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications








