Just In
- 2 hrs ago
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- 3 hrs ago
దక్షిణ భారత్లో కొత్త డీలర్షిప్ ఓపెన్ చేసిన బెనెల్లీ; వివరాలు
- 5 hrs ago
భారత్లో మరే ఇతర కార్ కంపెనీ సాధించని ఘతను సాధించిన కియా మోటార్స్!
- 6 hrs ago
రిపబ్లిక్ డే పరేడ్లో టాటా నెక్సాన్ ఈవీ; ఏం మెసేజ్ ఇచ్చిందంటే..
Don't Miss
- News
హెచ్1బీ వీసాదారుల భాగస్వాములకు భారీ ఊరట: ట్రంప్ నిర్ణయాలకు చెక్ పెట్టిన జో బైడెన్
- Finance
ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7300 తక్కువకు బంగారం, ఫెడ్ పాలసీకి ముందు రూ.49,000 దిగువకు
- Sports
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. కమిన్స్ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్ను చేయండి: క్లార్క్
- Movies
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. పవన్ కల్యాణ్కు అండగా మెగాస్టార్.. జనసేన నేత సంచలన ప్రకటన!
- Lifestyle
Study : గాలి కాలుష్యం వల్ల అబార్షన్లు పెరిగే ప్రమాదముందట...! బీకేర్ ఫుల్ లేడీస్...!
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నడిరోడ్డుపై జరిగిన ఈ సంఘటన చూస్తే ఒళ్ళు ఝల్లుమంటుంది.. కావాలంటే ఈ వీడియో చూడండి
రోజురోజుకి పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల కొన్ని వేలమంది మరణిస్తున్నారు, అంతే కాకుండా ప్రమాదాల వల్ల చాల నష్టాలను కూడా చవి చూస్తున్నారు. ప్రపంచంలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న దేశాల జాబితాలో భారతదేశం కూడా ఉంది. భారతీయ రోడ్లపైనా కూడా నిరంతరం రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన విషయాలు మీరు ఇది వరకటి కథనాలతో చదివి ఉంటారు.

రోడ్లపై ఎదో ఒక రకంగా ప్రమాదాలు సంభవించడం నిత్యజీవితంలో ఒకటిగా చూస్తూనే ఉన్నాం. దీనికి ప్రధాన కారణం ట్రాఫిక్ నియమాలను పాటించకపోవడం ఒకటయితే, రోజు రోజుకి పెరుగుతున్న వాహనాలు కూడా మరొక కారణం అనే చెప్పాలి. వాహన తయారీదారు రోజు రోజుకి కొత్త వాహనాలను మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రతి సంవత్సరం కొన్ని వేళా సంఖ్యలో కొత్త వాహనాలు రోడ్డుపైకి వస్తున్నాయి.

ఇక విషయంలోకి వస్తే, ఇటీవల ముంబైలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. రోడ్డుపై అప్పుడప్పుడు వాహనదారుల మధ్య వాదనలు, గొడవలు చూసే ఉంటాం.. కానీ నేడు వాటి సంఖ్య మరీ ఎక్కువైంది. ముంబై నగరంలో ఆటో డ్రైవర్ మరియు ద్విచక్ర వాహన డ్రైవర్ మధ్య జరిగిన ఈ సంఘటన ఇప్పుడు వైరల్ అయ్యింది.

ఆటో డ్రైవర్ మరియు ద్విచక్ర వాహన డ్రైవర్ మధ్య జరిగిన సంఘటన మణూకు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వీడియోలో ఆటో డ్రైవర్ మరియు ద్విచక్ర వాహనం చాలా బిజీగా ఉన్న రహదారిపై తీవ్ర వాదనకు దిగడం మనం చూడవచ్చు.

కొన్ని సెకన్ల తరువాత వారిద్దరి మధ్య సమస్య పరిష్కారమైనట్లు తెలుస్తోంది. తరువాత ఇద్దరూ అక్కడి నుంచి బయలుదేరి వెళ్లడం కూడా మనం ఇక్కడ వీడియోలో గమనించవచ్చు. ఆ సమయంలో ఆటో డ్రైవర్ అకస్మాత్తుగా తన ఆటోతో పక్కనే వస్తున్న గొడవపడిన ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్నాడు.
MOST READ:ఫాస్ట్ట్యాగ్ ద్వారా ఒకే రోజులో రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ ; ఎంతో తెలుసా ?

ఇది ఆటో డ్రైవర్ యొక్క ఉద్దేశపూర్వకంగా జరిగిన చర్య. ఆటో ఢీ కొట్టిన వెంటనే ద్విచక్ర వాహన డ్రైవర్ కింద పడిపోయాడు. కానీ అదేమీ పట్టించుకోకుండా ఆ ఆటో డ్రైవర్ ముందుకు వెళ్ళిపోతాడు. కానీ కిందపడిన ద్విచక్ర వాహన డ్రైవర్ను రక్షించడానికి పరిసరాల్లోని కొంతమంది పరుగెత్తుకుంటూ వచ్చారు. ఈ సంఘటనలో ఆ ద్విచక్ర వాహన డ్రైవర్ పెద్దగా గాయాలు కాలేదు. మొత్తానికి ద్విచక్ర వాహన డ్రైవర్ అదృష్టవశాత్తు తప్పించుకోగలిగాడు.

అక్కడ జరిగిన మొత్తం సంఘటన వీడియోలో రికార్డ్ చేయబడింది. ఈ వీడియో చూస్తే మీకు కూడా షాక్ గా అనిపిస్తుంది. ఈ వీడియో పోలీసులు దర్యాప్తు చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. పోలీసులు కేసు నమోదు చేసి ఆటో డ్రైవర్ను అరెస్టు చేశారు. పోలీసులకు పట్టుబడిన ఆ ఆటో డ్రైవర్ వయసు 34 సంవత్సరాలు.
MOST READ:రెండు గంటల్లోనే రూ.29.5 లక్షల జరిమానాలు, పోలీసుల రికార్డ్

అరెస్టు చేసిన ఆటో డ్రైవర్పై హత్యాయత్నంతో సహా వివిధ సెక్షన్ల కింద విచారణ జరిగే అవకాశం ఉంది. ఆటో డ్రైవర్ పై ఏ నమోదు చేయబడిందో ఖచ్చితంగా తెలియదు. కానీ యితడు చేరిన పనికి ఖచ్చితంగా శిక్షపడే అవకాశం ఉంది.
రోడ్డుపై ప్రయాణించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకుంటే అనవసరంగా ప్రమాదం భారిన పడే అవకాశం ఉందని ఈ వీడియో చూస్తే మనకు స్పష్టమవుతుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రశాంతమైన మనస్సులో ఉండటం ముఖ్యం.
MOST READ:దీని ముందు టెస్లా కూడా దిగదుడుపేనండోయ్.. ఎందుకో చూడండి

ఇతర వాహనదారులు పట్ల కూడా కొంత ప్రేమగా వ్యవహరించాలి, ఎంతుకంటే తోటి ప్రయాణికులు కూడా మనుషులే అన్న విషయం మరచిపోకూడదు. ఒక వేళా ఏదైనా చిన్న పొరపాటు జరిగితే పెద్ద గొడవలకు దిగటం అంత సమంజసం కాదు. ఒకవేళ గొడవ తీవ్రమవుతుందనిపిస్తే సమీప పోలీస్ స్టేషన్ ని సందర్శించడం చాలా మంచిది.