Just In
- 13 hrs ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 14 hrs ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 15 hrs ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 16 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
Don't Miss
- Movies యాంకర్ దీపికా పిల్లి బెడ్ వీడియో వైరల్: కళ్లు చెదిరేలా ప్యాంటు లేకుండా!
- News నిప్పుల కుంపటిలా ఏపీ.. ఈ జిల్లాలలో వడగాలులు.. జాగ్రత్త; వాతావరణశాఖ అలెర్ట్!!
- Sports రోహిత్ శర్మ ప్లేస్లో..!!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
లాక్ డౌన్ లో వినూత్నమైన చర్య చేపట్టిన బెంగళూరు పోలీసులు, ఇంతకీ ఏంచేసారో తెలుసా..!
భారతదేశంలో కరోనా వైరస్ వల్ల మరణించే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఈ భయంకరమైన వైరస్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి దాదాపు ఇప్పటికే 43,272 మంది ప్రాణాలను తీసింది. అంతే కాకుండా 8,00,000 మందికి పైగా ప్రజలు ఈ వైరస్ భారిన పడ్డారు. ఈ వైరస్ మహమ్మారి వల్ల మరణాల రేటు మరింత పెరిగే అవకాశం కూడా ఉంది.
భారతదేశంలో కోవిడ్ -19 వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. కరోనావైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి కేంద్ర ప్రభుత్వం 21 రోజుల లాక్డౌన్ ప్రకటించింది. ప్రజలు తమ ఇళ్లను వదిలిపెట్టి బయటికి రాకుండా వుండే విధంగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇల్లు వదిలి వెళ్లకూడదని సూచించారు.
భారతదేశం మొత్తం లాక్ డౌన్ లో ఉన్నప్పటికీ కొంతమంది పరిస్థితిని అర్థం చేసుకోకుండా విచ్చలవిడిగా రోడ్లపై తిరుగుతున్నారు. ప్రజలు యొక్క రక్షణను దృష్టిలో ఉంచుకుని పోలీసులు ఎంత కఠినమైన చర్యలను తీసుకుంటున్నప్పటికీ ఇలాంటివి అక్కడక్కడా జరుగుతూనే ఉన్నాయి.
అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న వాహనదారులను పోలీసులు కఠినంగా శిక్షంచడమే కాకుండా వాహనదారులను కొట్టిన వీడియోలు సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో వైరల్ అవుతున్నాయి. ఈ విధంగా చేస్తున్న పోలీసులపై కొంత వ్యతిరేఖ చర్య కూడా ఉంది.
పోలీసులు కొట్టడం వల్ల దీనికి ప్రజలు వ్యతిరేఖంగా ఉండటం వల్ల, పోలీసులు కొత్త చర్యలను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో భాగంగా వాహనాలను జప్తు చేసి జరిమానా విధించారు. అంతే కాకుండా వీరిపై కేసులు కూడా బుక్ చేయడం జరిగింది.
వీటన్నిటి కంటే కొంత వ్యతిరేఖంగా మరియు ప్రజలలో కొంత అవగాహన కల్పించడానికి కొరోనా వైరస్ హెల్మెట్ ధరించి విన్నూత ప్రదర్శనలు చేసారు. ఇవన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇదే విధంగా కొద్ది రోజుల క్రితం తమిళనాడు పోలీసులు కూడా ఇటువంటి చర్యనే అమలు చేసారు. దీనినే కర్ణాటక పోలీసులు కొంత విభిన్నంగా చేశారు.
కర్ణాట పోలీసులు చేసినా ఈ చర్య చూడటానికి చాలా సరదాగా ఉంటుంది కానీ మరణ భయాన్ని మాత్రం చూపిస్తుంది. ప్రజల్లో అవగాహన పెంచడానికి పోలీసులు విడుదల చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వీడియోలో పోలీసులు కరోనా వైరస్ వంటి హెల్మెట్ ధరించారు. అప్పుడు ఒక యువకుడు బైక్ మీద వస్తాడు. కరోనా హెల్మెట్తో ఉన్న ఒక పోలీసు అతని వెనుక కూర్చున్నాడు. ఇంకొక పోలీస్ చావు గంట కొడతారు. కరోనా వైరస్ ఉన్నప్పుడు ఇంటి నుండి వాయతికి వస్తే మరణానికి కారణమవుతుందని పోలీసులు ఈ విధంగా చేసారు.
ఈ వీడియో చూసిన తర్వాత కూడా ప్రజలు ఇల్లు వదిలి వెళ్ళే అవకాశం తక్కువ ఉంది. పోలీసులు లాఠీ రుచి చూపించకుండా కొత్త రకమైన చర్య చేపట్టడం వల్ల ప్రజలలో ఎక్కువ అవగాహన కల్పించినట్లు కూడా అవుతుంది.