Just In
- 11 hrs ago 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- 13 hrs ago మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- 14 hrs ago కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- 16 hrs ago వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్పై కూర్చుకున్న వ్యక్తి (వీడియో)
Don't Miss
- Movies Brahmamudi April 25th episode: కావ్య విషయంలో రుద్రాణికి షాకిచ్చిన కనకం.. రెచ్చగొడుతున్న రాహుల్
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
లాక్ డౌన్ లో వినూత్నమైన చర్య చేపట్టిన బెంగళూరు పోలీసులు, ఇంతకీ ఏంచేసారో తెలుసా..!
భారతదేశంలో కరోనా వైరస్ వల్ల మరణించే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఈ భయంకరమైన వైరస్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి దాదాపు ఇప్పటికే 43,272 మంది ప్రాణాలను తీసింది. అంతే కాకుండా 8,00,000 మందికి పైగా ప్రజలు ఈ వైరస్ భారిన పడ్డారు. ఈ వైరస్ మహమ్మారి వల్ల మరణాల రేటు మరింత పెరిగే అవకాశం కూడా ఉంది.
భారతదేశంలో కోవిడ్ -19 వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. కరోనావైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి కేంద్ర ప్రభుత్వం 21 రోజుల లాక్డౌన్ ప్రకటించింది. ప్రజలు తమ ఇళ్లను వదిలిపెట్టి బయటికి రాకుండా వుండే విధంగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇల్లు వదిలి వెళ్లకూడదని సూచించారు.
భారతదేశం మొత్తం లాక్ డౌన్ లో ఉన్నప్పటికీ కొంతమంది పరిస్థితిని అర్థం చేసుకోకుండా విచ్చలవిడిగా రోడ్లపై తిరుగుతున్నారు. ప్రజలు యొక్క రక్షణను దృష్టిలో ఉంచుకుని పోలీసులు ఎంత కఠినమైన చర్యలను తీసుకుంటున్నప్పటికీ ఇలాంటివి అక్కడక్కడా జరుగుతూనే ఉన్నాయి.
అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న వాహనదారులను పోలీసులు కఠినంగా శిక్షంచడమే కాకుండా వాహనదారులను కొట్టిన వీడియోలు సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో వైరల్ అవుతున్నాయి. ఈ విధంగా చేస్తున్న పోలీసులపై కొంత వ్యతిరేఖ చర్య కూడా ఉంది.
పోలీసులు కొట్టడం వల్ల దీనికి ప్రజలు వ్యతిరేఖంగా ఉండటం వల్ల, పోలీసులు కొత్త చర్యలను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో భాగంగా వాహనాలను జప్తు చేసి జరిమానా విధించారు. అంతే కాకుండా వీరిపై కేసులు కూడా బుక్ చేయడం జరిగింది.
వీటన్నిటి కంటే కొంత వ్యతిరేఖంగా మరియు ప్రజలలో కొంత అవగాహన కల్పించడానికి కొరోనా వైరస్ హెల్మెట్ ధరించి విన్నూత ప్రదర్శనలు చేసారు. ఇవన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇదే విధంగా కొద్ది రోజుల క్రితం తమిళనాడు పోలీసులు కూడా ఇటువంటి చర్యనే అమలు చేసారు. దీనినే కర్ణాటక పోలీసులు కొంత విభిన్నంగా చేశారు.
కర్ణాట పోలీసులు చేసినా ఈ చర్య చూడటానికి చాలా సరదాగా ఉంటుంది కానీ మరణ భయాన్ని మాత్రం చూపిస్తుంది. ప్రజల్లో అవగాహన పెంచడానికి పోలీసులు విడుదల చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వీడియోలో పోలీసులు కరోనా వైరస్ వంటి హెల్మెట్ ధరించారు. అప్పుడు ఒక యువకుడు బైక్ మీద వస్తాడు. కరోనా హెల్మెట్తో ఉన్న ఒక పోలీసు అతని వెనుక కూర్చున్నాడు. ఇంకొక పోలీస్ చావు గంట కొడతారు. కరోనా వైరస్ ఉన్నప్పుడు ఇంటి నుండి వాయతికి వస్తే మరణానికి కారణమవుతుందని పోలీసులు ఈ విధంగా చేసారు.
ఈ వీడియో చూసిన తర్వాత కూడా ప్రజలు ఇల్లు వదిలి వెళ్ళే అవకాశం తక్కువ ఉంది. పోలీసులు లాఠీ రుచి చూపించకుండా కొత్త రకమైన చర్య చేపట్టడం వల్ల ప్రజలలో ఎక్కువ అవగాహన కల్పించినట్లు కూడా అవుతుంది.