ఈ కారణంగానే అక్కడ లాక్డౌన్లో సీజ్ చేసిన వాహనాలు ఇచ్చేస్తున్నారు.. ఎక్కడో తెలుసా?
కరోనా వైరస్ యొక్క సెకండ్ వేవ్ భారతదేశంలో చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. రోజురోజుకి కరోనా బాధితుల సంఖ్య పెరిగిపోతున్న సమయంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సంక్రమణను నివారించడానికి చాలా రాష్ట్రాల్లో కరోనా లాక్ డౌన్ విధించడం జరిగింది. ప్రస్తుతం భారతదేశంలో అమలులో ఉన్న లాక్ డౌన్ గత సంవత్సరం అమలులో ఉన్న లాక్ డౌన్ కంటే చాలా కఠినంగా ఉంది.

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా లాక్ డౌన్ అమలులో ఉంది. కావున కర్ణాటకలో కూడా లాక్ డౌన్ అమలులో ఉంది. ఈ లాక్ డౌన్ సమయంలో అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడే బయటకు రావడానికి అనుమతి కల్పించబడింది. అలా కాకుండా అనవసరంగా బయట తిరిగే వాహనదారులపై పోలీసులు చర్యలు తీసుకోవడమే కాకుండా, వారి వాహనాలను కూడా జప్తు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే పోలీసులు ప్రతిరోజూ ఎక్కువ సంఖ్యలో వాహనాలను జప్తు చేస్తున్నారు. ఈ లాక్ డౌన్ సమయంలో దాదాపు 10,000 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు బెంగళూరు నగర పోలీసులు తెలిపారు. ఈ వాహనాలు కేవలం 10 రోజుల్లో జప్తుచేయబడిన వాహనాలుగా తెలిసింది.

బెంగళూరులో లాక్ డౌన్ విధించిన మొదటి రోజు దాదాపు రెండు వేలకు పైగా వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అంతే కాదు ఇటీవల బెంగళూరు నగర పోలీసులు ఒక ఖరీదైన బెంజ్ కారును కూడా స్వాధీనం చేసుకున్నారు.

నివేదికల ప్రకారం మొత్తం 10 రోజుల్లో 10 వేలకు పైగా వాహనాలను జప్తు చేసినట్లు తెలుస్తోంది. రోజు రోజుకి లెక్కకు మించిన వాహనాలను స్వాధీనం చేసుకోవడం వల్ల బెంగళూరులోని దాదాపు అన్ని పోలీస్ స్టేషన్లు వాహనాలతో నిండిపోతున్నాయి. ఈ కారణంగానే పోలీస్స్టేషన్ల సమీపంలో ఖాళీ ప్రదేశాల్లో వాహనాలను పార్క్ చేస్తున్నారు.

ఎక్కువవుతున్న వాహనాల వల్ల కాళీ స్థలాలు కూడా నిండిపోతున్నాయి. ఈ కారణంగా బెంగళూరు నగర పోలీసులు ఒక నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న వాహనాలను ఆ వాహన యజమానికి అప్పగించనున్నారు.

జప్తు చేసిన వాహన యజమానులను విచారించి, ఈ వాహనాలను వారి యజమానులకు తిరిగి ఇవ్వాలని పోలీసులు నిర్ణయించారు. లాక్ డౌన్ రూల్స్ ఉల్లంఘించినందువల్ల బెంగళూరు నగర పోలీసులు గత ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో 50 వేలకు పైగా వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

గత సంవత్సరం లాక్ డౌన్ ముగిసిన తర్వాత రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు వాహనాలను వారి యజమానులకు తిరిగి ఇచ్చారు. ఇందులో కూడా ద్విచక్ర వాహనాలకు రూ. 500, కార్లకు రూ. 1,000 జరిమానా విధించారు. కావున ఇప్పుడు మళ్ళీ వాహనదారులకు వాహనాలను అప్పగించే సమయంలో భారీ జరిమానా విధించే అవకాశం ఉంది.
NOTE:ఇక్కడ ఉపయోగించిన కొన్ని ఫోటోలు కేవలం రిఫరెన్స్ కోసం మాత్రమే


Click it and Unblock the Notifications








