Just In
- 3 hrs ago గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- 5 hrs ago 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- 7 hrs ago జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- 10 hrs ago జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
Don't Miss
- News ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
- Sports PBKS vs MI: చెలరేగిన సూరీడు... తెలుగోడు!
- Movies డైరెక్టర్లకు అమ్మాయిలను సప్లై.. సీనియర్ ఆర్టిస్ట్ చీకటి కోణం వెనుక వాస్తవం అదేనట!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఈ కారణంగానే అక్కడ లాక్డౌన్లో సీజ్ చేసిన వాహనాలు ఇచ్చేస్తున్నారు.. ఎక్కడో తెలుసా?
కరోనా వైరస్ యొక్క సెకండ్ వేవ్ భారతదేశంలో చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. రోజురోజుకి కరోనా బాధితుల సంఖ్య పెరిగిపోతున్న సమయంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సంక్రమణను నివారించడానికి చాలా రాష్ట్రాల్లో కరోనా లాక్ డౌన్ విధించడం జరిగింది. ప్రస్తుతం భారతదేశంలో అమలులో ఉన్న లాక్ డౌన్ గత సంవత్సరం అమలులో ఉన్న లాక్ డౌన్ కంటే చాలా కఠినంగా ఉంది.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా లాక్ డౌన్ అమలులో ఉంది. కావున కర్ణాటకలో కూడా లాక్ డౌన్ అమలులో ఉంది. ఈ లాక్ డౌన్ సమయంలో అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడే బయటకు రావడానికి అనుమతి కల్పించబడింది. అలా కాకుండా అనవసరంగా బయట తిరిగే వాహనదారులపై పోలీసులు చర్యలు తీసుకోవడమే కాకుండా, వారి వాహనాలను కూడా జప్తు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే పోలీసులు ప్రతిరోజూ ఎక్కువ సంఖ్యలో వాహనాలను జప్తు చేస్తున్నారు. ఈ లాక్ డౌన్ సమయంలో దాదాపు 10,000 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు బెంగళూరు నగర పోలీసులు తెలిపారు. ఈ వాహనాలు కేవలం 10 రోజుల్లో జప్తుచేయబడిన వాహనాలుగా తెలిసింది.
MOST READ:టోల్ ప్లాజాలో ఈ గీత బయట వేచి ఉంటే ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు; NHAI
బెంగళూరులో లాక్ డౌన్ విధించిన మొదటి రోజు దాదాపు రెండు వేలకు పైగా వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అంతే కాదు ఇటీవల బెంగళూరు నగర పోలీసులు ఒక ఖరీదైన బెంజ్ కారును కూడా స్వాధీనం చేసుకున్నారు.
నివేదికల ప్రకారం మొత్తం 10 రోజుల్లో 10 వేలకు పైగా వాహనాలను జప్తు చేసినట్లు తెలుస్తోంది. రోజు రోజుకి లెక్కకు మించిన వాహనాలను స్వాధీనం చేసుకోవడం వల్ల బెంగళూరులోని దాదాపు అన్ని పోలీస్ స్టేషన్లు వాహనాలతో నిండిపోతున్నాయి. ఈ కారణంగానే పోలీస్స్టేషన్ల సమీపంలో ఖాళీ ప్రదేశాల్లో వాహనాలను పార్క్ చేస్తున్నారు.
MOST READ:2021 హయాబుసా డీలర్షిప్కి వచ్చేసిందోచ్.. ఇక డెలివరీ త్వరలోనే
ఎక్కువవుతున్న వాహనాల వల్ల కాళీ స్థలాలు కూడా నిండిపోతున్నాయి. ఈ కారణంగా బెంగళూరు నగర పోలీసులు ఒక నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న వాహనాలను ఆ వాహన యజమానికి అప్పగించనున్నారు.
జప్తు చేసిన వాహన యజమానులను విచారించి, ఈ వాహనాలను వారి యజమానులకు తిరిగి ఇవ్వాలని పోలీసులు నిర్ణయించారు. లాక్ డౌన్ రూల్స్ ఉల్లంఘించినందువల్ల బెంగళూరు నగర పోలీసులు గత ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో 50 వేలకు పైగా వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
MOST READ:ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు; ధర అక్షరాల 200 కోట్లు.. మీరూ ఓ లుక్కేసుకోండి
గత సంవత్సరం లాక్ డౌన్ ముగిసిన తర్వాత రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు వాహనాలను వారి యజమానులకు తిరిగి ఇచ్చారు. ఇందులో కూడా ద్విచక్ర వాహనాలకు రూ. 500, కార్లకు రూ. 1,000 జరిమానా విధించారు. కావున ఇప్పుడు మళ్ళీ వాహనదారులకు వాహనాలను అప్పగించే సమయంలో భారీ జరిమానా విధించే అవకాశం ఉంది.
NOTE:ఇక్కడ ఉపయోగించిన కొన్ని ఫోటోలు కేవలం రిఫరెన్స్ కోసం మాత్రమే