Just In
- 33 min ago 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- 2 hrs ago జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- 5 hrs ago జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
- 5 hrs ago టోల్గేట్ల వద్ద ఇకపై ఈ బోర్డులు ఉండవు.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
Don't Miss
- Sports T20లో డబుల్ సెంచరీ: ఆ భారత ప్లేయర్కే సాధ్యం- విలియమ్సన్
- Movies పడక గదిలోకి వెళ్లందే ఆఫర్లు రావు.. టాప్ సింగర్పై మండిపడ్డ నటి కస్తూరి
- News తెలంగాణలో నామినేషన్లను దాఖలు చేసిన బీజేపీ ఎంపీ అభ్యర్థులు వీరే
- Technology Samsung నుంచి కొత్త 8K మరియు 4K AI టీవీ లు లాంచ్ అయ్యాయి! ధర, ఫీచర్లు, ఆఫర్లు
- Lifestyle Happy Birthday Wishes : పుట్టినరోజు శుభాకాంక్షలను ఇలా అందంగా తెలపండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఎమర్జెన్సీ వాహనాలకు మినహాయిస్తే, PM కారైనా... CM కారైనా సైరన్ బుగ్గలు వాడద్దు!
వీఐపీలు వినియోగించే కార్ల మీద ఎర్ర బుగ్గలను తొలగించాలని కేంద్ర మంత్రి వర్గం నిర్ణయించింది. ప్రధాన మంత్రి, రాష్ట్రపతి నుండి అన్ని వీఐపీల వాహనాలపైనున్న బుగ్గ లైట్లను తొలగించాలని కేంద్రం తెలిపింది.
ప్రధాన
మంత్రి,
రాష్ట్రపతి
మరియు
ఉప
రాష్ట్రపతితో,
ప్రధాన
న్యాయమూర్తితో
పాటు
లోక్
సభ
స్పీకర్
సహా
దేశవ్యాప్తంగా
ఉన్న
అందరి
వీఐపీల
కార్ల
మీద
బుగ్గలను
తొలగించేందుకు
కేంద్ర
ప్రభుత్వం
నిర్ణయించింది.
మరి అత్యవసర సేవలకు వినియోగించే వాహనాలు మీదున్న బుగ్గ లైట్లు కూడానా అంటే, ఇందుకు ఆ ఎమర్జెన్సీ వాహనాలను మినహాయించినట్లు ప్రభుత్వం తెలిపింది. అంబులెన్స్, ఫైర్ వెహికల్, పోలీసు మరియు ఆర్మీ వాహనాలు మీదున్న బుగ్గ లైట్లు అలాగే యథావిధిగా కొనసాగుతాయి.
ఈ కొత్త నియమం మే 1, 2017 నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకురానున్నట్లు కేంద్ర మంత్రి వర్గం పేర్కొంది.
దీని గురించి కేంద్ర రవాణా మరియు జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, ఎమర్జెన్సీ వాహనాలు మినహాయిస్తే దేశవ్యాప్తంగా ఉన్న వీఐపీల కార్ల మీద బుగ్గ లైట్ల నిషేధించే చారిత్రాత్మక చట్టాన్ని తెచ్చినట్లు పేర్కొన్నాడు.
ఈ కొత్త చట్టం భారత దేశపు ప్రధాన మంత్రి, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర మంత్రులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాష్ట్రాల మంత్రి వర్గం, ప్రభుత్వాధికారులు, హై కోర్టు, సుప్రీం కోర్టు న్యాయమూర్తులందరికీ వర్తిస్తుంది.
అధికారులు తమ కార్ల మీద బుగ్గ లైట్లను తొలగించాలని ఉత్తర ప్రదేశ్ మరియు పంజాబ్ ముఖ్యమంత్రులు నిర్ణయం తీసుకున్నారు. దీనిని దేశవ్యాప్తంగా వర్తింపచేయడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది.
అధికారులు తమ స్టేటస్కు గుర్తుగా బుగ్గ లైట్లను హాస్యాస్పదంగా వినియోగిస్తున్నారని 2013 లో సుప్రీం కోర్టులు చేసింది. వెంటనే బుగ్గ లైట్లను తొలగించాలను సుప్రీం కోర్టు ఆదేశించింది.
అయితే తరువాత 2015 లో సుప్రీం మళ్లీ ఇవి హోదా చిహ్నాలను పేర్కొంది. అయితే మొత్తానికి రాష్ట్రపతి నుండి సాధారణ వీఐపీ వరకు అందరు కూడా బుగ్గ లైట్లను తొలగించాలను కోర్టు కూడా ఈ సారి ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంది.