Just In
- 1 hr ago గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- 3 hrs ago భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- 4 hrs ago రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- 5 hrs ago ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
Don't Miss
- Sports RCB vs KKR: చెలరేగిన కోహ్లీ, కార్తీక్.. కేకేఆర్ ముందు భారీ లక్ష్యం!
- News జైల్లో చిప్పకూడే.: కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Movies Tillu Square Collections సిద్దూ జొన్నలగడ్డ రికార్డుల మోత.. టిల్లు స్క్వేర్ మూవీకి ఎన్ని కోట్ల కలెక్షన్స్ అంటే?
శవాన్ని తీసుకెళ్లడానికి రూ. 60 వేలు డిమాండ్ చేసిన అంబులెన్స్ డ్రైవర్.. తర్వాత ఏం జరిగిందంటే?
భారతదేశంలో కరోనా వైరస్ తీవ్రత చాలా వేగంగా వ్యాపిస్తుంది. ఈ మహమ్మారి కారణంగా ఇప్పటికే ఎంతోమంది ప్రజలు ప్రాణాలను కోల్పోయారు. ఈ నేపథ్యంలో భాగంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చాలా వరకు కఠినమైన చర్యలను విధిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే చాలా రాష్ట్రల్లో నైట్ కర్ఫ్యూ అమలులో ఉంది.
కరోనా వేళ ప్రజలకు సేవలు చేయడానికి కొంతమంది వ్యక్తులు స్వచ్చందంగా ముందుకు వస్తున్నారు. ఇటీవల ఆక్సిజన్ మ్యాన్ గా పిలువబడిన బీహార్ కి చెందిన 'గౌరవ్ రాయ్' రోగులకు ఆక్సిజన్ సిలిండర్లను ఉచితంగా అందిస్తూ అందరి మన్ననలను పొందుతున్నారు.
అయితే బెంగళూరుకు చెందిన ఒక అంబులెన్స్ డ్రైవర్ కరోనా వల్ల చనిపోయిన మృతదేహాన్ని స్మశానానికి తరలించడానికి చాలా మొత్తం డబ్బుని అడిగి మృతుని కుటుంభ సభ్యులకు చాలా ఇబ్బందిని కలిగించాడు.
MOST READ:బిఎమ్డబ్ల్యూ ఎక్స్1 ఎస్-డ్రైవ్ 20డి రివ్యూ: ఫుల్ వీడియో.. ఇప్పుడు మీకోసం
నివేదికల ప్రకారం ఈ సంఘటన 2021 ఏప్రిల్ 20 న జరిగింది. 29 ఏళ్ల భవ్య తండ్రి ప్రసాద్ (57) ప్రైవేట్ ఆసుపత్రిలో కోవిడ్-19 కారణంగా మరణించాడు. మృతదేహాన్ని పీన్యలోని శ్మశానవాటికకు తీసుకెళ్లాలని ఆమె అంబులెన్స్కు ఫోన్ చేసింది. జై హనుమాన్ అంబులెన్స్ యజమాని హముమంతప్ప ఈ పనిని నిర్వహించడానికి ఏకంగా 60,000 రూపాయలు డిమాండ్ చేశారు.
అడిగిన మొత్తం 60,000 రూపాయలు ఇవ్వకుంటే మృతదేహాన్ని రోడ్డుపై వదిలివేస్తామని చెప్పాడు. ప్రస్తుత ఆమె వద్ద డబ్బు లేదని ఖచ్చితంగా ఇస్తానని ముందు మృతదేహాన్ని తీసుకెళ్లడానికి సహాయం చేయమని వేడుకుంది. అయితే కనికరం లేని ఆ అంబులెన్స్ డ్రైవర్ ససేమిరా ఒప్పుకోలేదు.
MOST READ:కారు విలువ 10 లక్షలు.. రిపేర్ ఫీజు 20 లక్షలు; ఇదేంటనుకుంటున్నారా.. ఇది చూడండి
అప్పుడు భవ్య పాపం ఇక ఏమి చేయాలో తోచక ఒక పోలీసుని పిలిచి వారికి సమాచారం ఇచ్చింది. అక్కడ పరిస్థితిని గమనించిన ఆ పోలీస్ వారి వద్ద నుంచి అంబులెన్స్ డ్రైవర్ కి 16,000 ఇవ్వాలని చెప్పాడు. ఈ డబ్బు చెల్లించిన తర్వాత మృతదేహాన్ని తీసుకెళ్లారు.
ఈ సంఘటన జరిగిన తరువాత అమృతహళ్లి పోలీసులు అంబులెన్స్ స్వాధీనం చేసుకున్నారు మరియు ఇద్దరు నిందితులపైనా ఐపిసి సెక్షన్ 384, 269, 270 మరియు జాతీయ విపత్తు నిర్వహణ చట్టం (ఎన్ఎంఏ) కింద అరెస్ట్ చేశారు.
MOST READ:పూర్తి చార్జ్పై 350 కిలోమీటర్లు ప్రయాణించిన మహీంద్రా ఈ2ఓ ప్లస్!
నిందితులు ఇదేవిధంగా చాలా మంది నుండి డబ్బు డిమాండ్ చేశారు. దీనిపైనా కూడా దర్యాప్తు జరుగుతుందని సిటీ నార్తెస్ట్ డివిజన్ డిసిపి సికె బాబా మీడియాకు తెలియజేశారు. ఇలాంటి సంఘటనలు జరిగితే దయచేసి పోలీసులకు తెలియజేయండి అని కూడా తెలిపారు.
కరోనా మహమ్మరి గుప్పెట్లో చిక్కి కొట్టు మిట్టాడుతున్న వేళ ఇలాంటి మన్సులేని మనసులు ప్రజలను డబ్బుకోసం మరింత పీక్కుతింటున్నారు. ఇలాంటి సంఘటనలపై పోలీసులు ఉక్కుపాదం మోపాలి, అప్పుడే ఇలాంటి వాటిని నివారించవచ్చు. ఇలాంటి సంఘటనలు ప్రజల దృష్టిలో పడితే పోలీసులకు తెలియజేయాలి.
MOST READ:వాహనాలకు స్పీడ్ లిమిట్ తప్పనిసరి; హైకోర్టు ఆదేశం
Source: The New Indian Express