Just In
Don't Miss
- News పట్టు కోల్పోయిన పవన్: వైసీపీలో మరో జనసేన సీనియర్
- Finance Zomato: జొమాటోకు షాక్.. రూ. 11.81 కోట్ల పెనాల్టీ..!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Movies ‘సీరియల్స్లో తెలుగు వాళ్లను నీచంగా.. కన్నడ యాక్టర్ల ముందు పని వాళ్లకంటే హీనంగా’
- Sports T20 World Cup: రింకూకు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. అతని కోసమే వేటు?
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
బెంగళూరులో కరోనా ఎఫెక్ట్; లాక్డౌన్లో పట్టుబడ్డ వారికి డిఫరెంట్ పనిష్మెంట్
కరోనా సెకండ్ వేవ్ భారతదేశంలో చాలా వేగంగా వ్యాపిస్తోంది. ఈ మహమ్మారి వల్ల లెక్కకు మించిన ప్రజలు మృత్యువాత పడుతున్నారు. అంతే కాకూండా ఎంతో మంది ప్రజలు ఈ వైరస్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కావున ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కఠినంగా ఆదేశాలు జారీ చేశారు.
కరోనా మహమ్మారిని నివారించడానికి ప్రభుత్వం కరోనా లాక్ డౌన్ విధించింది. కావున ప్రజలు అత్యవసర సమయంలో తప్ప మిగిలిన సమయంలో బయటకు రావడం పూర్తిగా నిషేధం. అలా కాదని బయటకు వచ్చేవారికి జరిమానాలు విధించడమే కాకుండా కఠినంగా శిక్షించడం కూడా జరుగుతుంది
దేశంలో అత్యధికంగా కరోనా కేసులు ఉన్న రాష్ట్రలలో కర్ణాటక ఒకటి. కావున కర్ణాటకలో ఈ రోజు నుంచి పూర్తిగా లాక్ డౌన్ విధించి కర్ఫ్యూ అమలుచేసింది. కావున ఏ ఒక్కరు బయట తిరగరాదు. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ విధించినందు వల్ల వేలాది మంది ప్రజలు తమ గమ్యాన్ని చేరుకోవడానికి, వారి సొంత రాష్ట్రానికి వెళ్లడానికి బయలుదేరారు.
MOST READ:వావ్.. ఈ మోడిఫైడ్ టాటా సుమో, నిజంగా సూపర్ గురూ..!
ఈ సమయంలో బెంగళూరు నగర పోలీసులు లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేశారు. పోలీసులు వాహనదారులతో మళ్లీ నిబంధనలను ఉల్లంఘించమని ప్రతిజ్ఞ చేశారు. కరోనా కర్ఫ్యూ ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు బెంగళూరు పోలీసులు గతంలో 2,277 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
గత 2020 సంవత్సరంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించినప్పుడు కేవలం నాలుగు గంటల నోటీసుతో మరియు వేలాది మంది ప్రజలు తమ ఇళ్ళకు దూరంగా దాదాపు నెలల తరబడి దూరంగా ఉన్నారు. కరోనా లాక్ డౌన్ ఉల్లంఘించినందుకు వారిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు.
MOST READ:మీరెప్పుడూ చూడని బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ వీడియో.. ఇప్పుడు చూసెయ్యండి
ఆ తరువాత వాహనదారులు సామాజిక దూరం నియమంతో నేరస్థుల్లా రోడ్డు మధ్యలో కూర్చున్నారు. దీని తరువాత, పోలీసులు ప్రతి ఒక్కరి చేతా ప్రమాణం చేయించారు. దీని కోసం పోలీసులు లౌడ్ స్పీకర్లను ఉపయోగించారు. కర్ఫ్యూ సమయంలో రోడ్డుపైకి వెళ్లిన ప్రజల వాహనాలన్నింటినీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అయితే పోలీసులు అక్కడికక్కడే చలాన్ జారీ చేశారా లేదా వాహనాలను స్వాధీనం చేసుకున్నారా అనేది ఖచ్చితంగా తెలియదు. ఒకవేళ, కరోనా వైరస్ యొక్క సెకండ్ వేవ్ తగ్గిన కొన్ని వరాల తర్వాత స్వాధీనం చేసుకున్న వాహనాలన్నింటినీ తిరిగి ఇవ్వడం జరుగుతుంది.
MOST READ:హార్లే-డేవిడ్సన్ బైక్గా మారిన టీవీఎస్ ఎక్స్ఎల్.. నమ్మకపోతే వీడియో చూడండి
గత సంవత్సరం ఇలాంటి పరిస్థితిలో పోలీసులు వేలాది వాహనాలను స్వాధీనం చేసుకుని, వాహనాల పత్రాలను ధృవీకరించిన తర్వాత తిరిగి ఇవ్వడం జరిగింది. అయితే, గత ఏడాది అమలులో ఉన్న నిబంధనల ప్రకారం ప్రజలకు ఉదయం 6 నుంచి 10 గంటల మధ్య అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లడానికి అనుమతించారు. ఈ ఏడాది కరోనా ఎక్కువగా వ్యాపించడం వల్ల నిబంధనలు కూడా మరింత కఠినంగా ఉంటాయి.